నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ’.. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా బాలయ్యతో బోయపాటి గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించడంతో, అఖండ కూడా ఖచ్చితంగా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
ఇక అఖండ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పేర్కొంది. కాగా ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సినిమాను నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు అనుకున్నదానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ బడ్జెట్లో బాలయ్య రెమ్యునరేషన్ కూడా సాధారణంగా ఉండటం గమనార్హం.ఈ సినిమా కథనం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని చిత్ర నిర్మాత ఇలా భారీ బడ్జెట్తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అఖండ చిత్రానికి అదిరిపోయే విజయాన్ని అందించేందుకు ఈ సినిమాను బడ్జెట్ పరంగా ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నారు చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది..ఇటీవలే వికారాబాద్ అడవుల్లో ఓ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా కరోనా వల్ల వాయిదా పడింది.. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని మే28 ఎన్టీఆర్ జయంతి రోజున విడుదల చేయనున్నారు..ఇక ఈ సినిమా అనంతరం క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…