Tag Archives: bollywood

విడాకులకు సిద్ధమైన రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి..! బాలీవుడ్ లో మరో చర్చ..!

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి.. తన భర్త ఓ ప్రముఖ వ్యాపార వేత్త అయినా రాజ్ కుంద్రా గతనెల అశ్లీల వీడియోలను తీసి వాటిని యాప్స్ లో అప్లోడ్ చేస్తూ లక్షలకు లక్షలు డబ్బులు సంపాదిస్తున్నారని అభియోగం రావడంచేత ఆయనని ముంబై పోలీసులు అరెస్టు చేయగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఒక్కసారిగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు బయటపడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది.

ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతనికి బెయిల్ దొరకలేదు.అయితే తన భర్త ఈ విధమైనటువంటి వీడియోలను చిత్రీకరించి డబ్బులు సంపాదిస్తున్నారనే విషయం తెలియని శిల్పాశెట్టి ఈ విషయం బయటపడటంతో ఒక్కసారిగా షాక్ అయింది. ఈ క్రమంలోనే ఈ కేసులో తనకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఈమెను కూడా విచారించారు.

తాజాగా తన భర్త చేసిన పనికి తన వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావం పడుతుందని భావించిన శిల్పాశెట్టి తన నుంచి విడిపోయి తన పిల్లలతో కలిసి ఒంటరిగా జీవించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను ఈ విధంగా సంపాదించిన డబ్బును తాను తాకకూడదని అందుకే తన నుంచి విడిపోయి ఒంటరిగా జీవించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తన భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడానికి సిద్ధపడిన శిల్పాశెట్టి తిరిగి సినిమాలలో నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే అనురాగ్ బసు, ప్రియదర్శన్ వంటి దర్శకులు తమ సినిమాలలో ఈమెకు అవకాశం కల్పించినట్లు సమాచారం.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శిల్పాశెట్టి తన భర్త పోర్నోగ్రఫీ విషయం బయట పడిన తర్వాత మోటివేషనల్ పోస్టులు పెడుతున్నారు. మరి నిజంగానే శిల్పాశెట్టి తన భర్త నుంచి విడాకులు తీసుకుంటుందా లేదా అనే విషయాన్ని శిల్పాశెట్టి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

జక్కన్నకు ఆ సినిమాతో గట్టి షాక్.. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ ఆలస్యం..

రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ‘బాహుబలి’ ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్‌తో తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌కు తెలుగులో కంటే హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది రెండో పార్ట్ కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెరో రూ.100 కోట్ల చొప్పును రూ.200 కోట్లను షేర్ సాధించింది. ఇక తమిళం,కన్నడ, మలయాళంలో దాదాపు రూ. 150 కోట్ల వరకు కలక్షన్స్ వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ మొత్తం కలిపి రూ. 1400 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. బాహుబలి పాన్ ఇండియా లెవల్లో విజయవంతం కావడంలో హిందీ ప్రేక్షకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.

పైగా గ్రాఫిక్స్ వర్క్ బాగా ఉండటంతో ఈ సినిమాను థియేటర్స్‌లో చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలను ఆక్టోబర్ 13 న విడుదల చేద్దామని అనుకున్నా.. హీరో అక్షయ్ కుమార్ నీళ్లు చల్లాడనే చెప్పాలి.

ఎందుకంటే.. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ సినిమాకు మంచి రివ్యూస్‌ వచ్చాయి. కానీ కలెక్షన్లలో మాత్రం ఎక్కువగా వసూలు కాలేదు. అక్షయ్ నటించిన సినిమాల్లో కంటే ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో పదో వంతు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే హిందీ ప్రేక్షకుల్లో కరోనా భయం పోలేదని.. అందుకే థియేటర్లకు రాలేదని తెలుస్తోంది. ఆ సినిమాకు హిందీ ప్రేక్షకులు ఆదరించలేదంటే..ఆక్టోబర్ 13 న విడుదలయ్యే ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఇలాంటి ఎఫెక్ట్ వస్తుందేమోనని.. రాజమౌళి భయపడుతున్నట్లు తెలుస్తోంది.

అందుకే బాలీవుడ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను విడుదలను పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనకు రాజమౌళి వచ్చినట్టు సమాచారం. మధ్యలో ఏదైనా హిందీ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తే.. పరిస్థితులు చూసుకొని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఏదేమైన ఈ సినిమా విడుదల కోసం ఎదరుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని చెప్పాలి.

ఎన్నో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.. వాటిని తట్టుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నానంటూ..

ఒకప్పుడు ఎంతో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు.. ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీనికి ఎవరూ అతీథులు కాదు. ఎవరికైనా కష్టాలు రావచ్చు. అటు టాలీవుడ్, బాలీవుడ్, సాధారణ ప్రజలకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే.. తెలుగులో ‘ఆహా కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బ్యూటీ వాణీకపూర్. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆమెను నిరాశకు గురిచేసింది. తర్వాత తెలుగులో సినిమా ఆఫర్లు రాలేదు.

కానీ బాలీవుడ్ లో మాత్రం ఆమె హవా కొనసాగింది. అక్కడ కొన్ని వరుస హిట్లతో తన పొజిషన్ ని ఇప్పుడు సుస్థిరం చేసుకుంది. శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్.. తర్వాత బేఫిక్రే..వార్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఆమెకు సంబంధించి ఓ సీక్రెట్ ఇప్పుడు అభిమానులకు షాక్ ను గురిచేస్తోంది. కపూర్ వంశస్తురాలిగా బాలీవుడ్ కి పరిచయమైన ఈ అమ్మడికి కూడా అందరిలానే కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి. 19 సంవత్సరాల వయస్సులో ఆమె తన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

వాళ్ల కుటుంబసభ్యులు ఆర్థిక కష్టాలు భరించలేక ఎంతగానో కుమిలిపోయారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమె తన కుటుంబానికి అండగా నిలబడాలనే నిశ్చయంతో స్వయంగా కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకున్నానని వాణీ చెప్పుకొచ్చింది. సనిమాలో నటిగా ఎదిగే సమయంలో ఇంటి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని.. తానే ఎన్నో ఆటుపోటులను తట్టుకొని నేడు ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. మోడలింగ్ లోకి రావడానికి కారణం కూడా ఆర్థిక కష్టాలే అని చెప్పింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన బెల్ బాటమ్ లో నటించింది.

ఈ సనిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఒక సనిమాలో నటిస్తున్న ఈ బామ.. షామ్ శ్రీ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. టాలీవుడ్ లో ఆమెకు లక్ కలసిరాలేదనే చెప్పాలి. అయితే తాజాగా ఆమె టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి.. సలార్ లాంటి భారీ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.

ఆ షోలో జడ్జిగా కనిపించిన శిల్పాశెట్టి.. వీడియో వైరల్..

గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్‌‌‌లో సంచలనం రేపిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే కొనసాగుతుంది. గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు యజమానిగా వ్యవహరించిన రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మించే స్థాయికి దిగజారడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పోర్న్ చిత్రాల ద్వారా ఆయన పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే అతడి చీకటి కోణాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

ఈ కేసు నడుస్తుండగానే మరికొంత మంది మోడల్స్ బయటకు వచ్చి అతడిపై ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఈ కేసు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బయటపడింది. ఆసమయంలోనే మహిళలను బలవంతంగా శృంగార సినిమాల్లోకి నెట్టిన ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు పోర్న్ చిత్రాల వ్యాపార రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ వేదికగా యూకే ప్రొడక్షన్ యజమాని ఉమేష్ కామత్ తో రాజ్ కుంద్రాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు.

సినిమాలో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను.. అవకాశం కచ్చితంగా కల్పిస్తానని చెప్పి.. ఈ ఊబిలోకి దించుతున్నారని పోలీసులు తెలిపారు. ఇలా తన భర్త వ్యవహారాలు ఒకొక్కటిగా బయటకు వస్తుండటంతో శిల్పాశెట్టికి తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటికే సినిమాలకు దూరంగా ఉన్న శిల్పాశెట్టి టీవీ షోలల్లో జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే వాటికి కూడా గత కొన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నారు. కొన్ని ప్రొడక్ట్స్ ఉత్పత్తులకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ స్థానాన్ని కూడా వదులుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ముందు ఆమె కనిపించకవోచ్చు అంటూ.. అందరూ అనుకున్నారు.

https://www.instagram.com/p/CStWn_pK3ma/?utm_source=ig_web_copy_link

కానీ తాజాగా ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న ఓ షోలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్నా ‘సూపర్ డాన్సర్-4’కు జడ్జిగా శిల్పా వ్యవహరిస్తున్నారు. ఆమె జడ్జి సీటు ఆమెకు ఇంకా కేటాయించడానికి కారణం ఏంటంటే.. ఈ షో పాపులర్ అవ్వడానికి కారణం శిల్పాశెట్టి అవ్వడమే. అందుకే ఆమె మళ్లీ ఇలా షోలో అడుగుపెట్టారు. అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భర్త జైల్లో ఉండగా ఇలా శిల్పాశెట్టి షోలు చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కంగనా రనౌత్ అందాలకు హాలీవుడ్ నటుడు ఫిదా.. ఆ కోరిక అంటూ?

బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనారనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో వివాదం సృష్టించే కంగనా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు మతి పోగొడుతుంది. ఈ క్రమంలోనే కంగనా నటిస్తున్న టువంటి “ధాకడ్”సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈమె చిత్ర బృందానికి ప్రత్యేక పార్టీ అరేంజ్ చేశారు. ప్రస్తుతం ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ విధంగా సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందానికి పార్టీ ఇచ్చిన ఈమె బ్రాలెట్ టాప్ ధరించి తన ఎద అందాలను ఆరబోసింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పలువురు నెటిజన్లు ఈ ఫోటో పై భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఈ క్రమంలోని ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కంగనా షేర్ చేసిన ఈ ఫోటోను చూసిన హాలీవుడ్ నటుడు ఆమె అందానికి ఫిదా అయ్యాడు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నటువంటి రస్సెల్ఈమె అందానికి ఫిదా అవడమే కాకుండా ఈమెతో కలిసి ఓ సినిమాలో నటించాలని ఆశించిన ఒక అభిమాని ఇచ్చిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు .

ఈ క్రమంలోనే ఈ ట్వీట్ ను రస్సెల్ క్రో రీట్వీట్ చేయడంతో ఇద్దరు నటుల అభిమానులలో ఈ విషయం తీవ్ర కలకలం రేపిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే మరికొందరు వీరిద్దరూ కలిసి సినిమా తీస్తే ఒక అద్భుతమైన జోడి అవుతుందని వీరికి మద్దతుగా నిలబడ్డారు.అయితే ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ హీరో రీట్వీట్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి చర్చనీయాంశం అయింది. ఇక కంగనా తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

నన్ను కొట్టాడు.. తన్నాడు.. కులం పేరుతో కూడా దూషించాడు: హిందీ నటి అర్జూ గోవిత్రికర్

భర్త నుంచి విడాకులు కావాలంటూ హిందీ నటి అర్జూ గోవిత్రికర్ నిర్ణయం తీసుకుంది. భర్త సిద్ధార్థ్‌ శబర్వాల్‌ పెట్టే వేధింపులు, హింసను భరించలేకపోతున్నానని వాపోయింది. ఆమె అతడిపై 2019 లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు తనలో మార్పు వస్తుందేమోనని నమ్మకంతో కాపురం చేసింది. కానీ అతడిలో ఏ మాత్రం మార్పురాక పోగ మరింత హింసకు పాల్పడుతుండటంతో విడిపోవడానికే నిశ్చయించుకుంది. ఈ సందర్భంగా ఆమె విలేకురుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను నిజంగానే విడాకుల కోసం దరఖాస్తు చేశానని చెప్పింది.

ఇప్పటి వరకు తాను పడ్డ బాధలు చాలు.. ఇక నుంచి ఆ వేధింపులను భరించలేనంటూ..సిద్దార్థ్‌తో కలిసుండటం సాధ్యపడదంటూ ఆమె చెప్పారు. తమ మధ్య పెరుగుతున్న దూరం గురించి నేనెప్పుడూ మీడియాతో మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడి తీరతాను అంటూ ధైర్యంగా చెప్పింది. సిద్ధార్థ్‌ ఆమెను ఇంట్లో నుంచి మెడ పట్టుకొని భయటకు నెట్టేందుకు ప్రయత్నించాడని.. తనపై చేయి కూడా చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. కట్టుకున్నదాన్ని అని చూడకుండా కడుపులో తన్నాడు. అంతెందుకు, నన్ను విచక్షణారహితంగా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి.

కానీ నేనెప్పుడూ ఆ గాయాలను బయటకు చూపించాలనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత తనను కొట్టినట్లు ఆమె చెప్పింది. కొడుకు పుట్టిన మూడు సంవత్సరాల తర్వాత అతడు వేరే గదిలో పడుకుంటున్నాడని ఆమె చెప్పింది. అతడికి రష్యన్ ప్రియురాలు ఉన్నట్లు ఆమె చెప్పింది.
అతడు ఒంటరిగా ఆ గదిలో ఆమెతో చాటింగ్‌ చేస్తున్నాడని అర్థమైంది. ఇదే విషయాన్ని నేరుగా అతడి దగ్గరకు వెళ్లి నిలదీశాను, కానీ ప్రయోజనం లేకపోయిందని ఆమె విలేకురులకు చెప్పింది. వాళ్లు కలిసి ఉంటున్నారా.. లేదా విడి విడిగా ఉంటున్నారా అనేది తనకు తెలియదని చెప్పింది.

తన భర్త చేసిన చాటింగ్ లు.. తనపై దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు మాత్రం తన దగ్గర ఉన్నట్లు చెప్పింది. ఈ ఆధారాలు తనను కాపాడతాయని నమ్ముతున్నట్లు ఆమె చెప్పింది. తనను కులం పేరుతో కూడా ఎన్నో సార్లు దూషించాడని తన భర్తపై ఆరోపణలు చేసింది. వీటిపై సిద్దార్థ్ స్పందిస్తూ.. ఈ విషయంపై మాట్లాడాలని తనకు లేదని.. ఆమెకు ఏం కావాలో అది చెప్పినివ్వండంటూ పేర్కొన్నాడు.

న్యూడ్‌గా లైవ్ లోకి వచ్చిన నటి.. రాజ్ కుంద్రా కేసులో ఆరోపణలు కవర్ చేసుకోడానికేనా?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ కేసు సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తనకు సంబంధం ఉందని ఆరోపణలు రావడం చేత నటి గెహన వశిష్ఠ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివరకు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఎంతో సందడి చేసేది.

తాజాగా నటి ఏకంగా లైవ్ లోనే న్యూడ్ సెషన్ చేశారు. ఈ క్రమంలోనే ఒంటిపై నూలు పోగు లేకుండా లైవ్ స్టేషన్ చేస్తూ నేను ఎలా ఉన్నాను… అందంగా ఉన్నానా.. బోల్డ్ గా ఉన్నాను అంటూ ప్రశ్నించింది. ఈ విధంగా నగ్నంగా ఉండడాన్ని ఏమంటారు? ఇది ఏ రకమైన పోర్నోగ్రఫీ కిందకి వస్తుంది అంటూ ప్రశ్నించారు.

ఈ విధంగా లైవ్ స్టేషన్ లో నగ్నంగా ఉన్నప్పటికీ చాలా మంది దీనిని ఫోర్న్ కంటెంట్ అని చెప్పడం లేదు.కానీ వంటిపై పలుచని దుస్తులు ఉండి వీడియోలో కనిపిస్తే మాత్రం పోర్నోగ్రఫీ అంటున్నారు అంటూ ఈమె ఆరోపించారు. ఏదైనా కానీ మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ ఈ విధంగా నగ్నంగా ఉన్న ఫోటోలను ఫోర్ వీడియో అనరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ బ్యూటీ ఈ విధంగా తన అందాలను ఆరబోస్తూ ఏం చెప్పాలనుకుంటుంది అంటూ చాలామంది సందేహాలను వ్యక్తపరిచారు. ఏదిఏమైనప్పటికీ పోర్నోగ్రఫీ అనేది తప్పు కాదని చెప్పడం కోసం ఈ చిన్నది తెగ ప్రయత్నం చేస్తోంది అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నటి గెహన వశిష్ఠ్ చేసిన ఈ న్యూడ్ సెషన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్టు కాగానే.. సాక్షాలు నాశనమయ్యాయి?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ కేసు తీవ్ర సంచలనంగా మారింది.బాలీవుడ్ నటి శిల్పా భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో గత రెండు వారాల క్రితం ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను అరెస్టు చేసినప్పటి నుంచి పోలీసులు ఈ కేసును పలు కోణాలలో విచారిస్తున్నారు.ఈ కేసును ఆరా తీసేకొద్దీ పలు ఆసక్తికరమైన సంఘటనలు బయటపడుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పోర్నోగ్రఫీ కేసు ద్వారా రాజ్ కుంద్రాను పోలీసులు కస్టడీలోకి తీసుకోగానే ఆ కేసుకు సంబంధించిన పలు సాక్షాలన్నింటిని నాశనం చేశారని ముంబై హైకోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ్ పాయ్ వెల్లడించారు.రాజ్ కుంద్రా అరెస్ట్ అవుతాడని ముందుగా గ్రహించడం చేతనే ఈ సాక్షాలు అన్నింటిని నాశనం చేశారని, తన వాట్సాప్ చాట్,హాట్ షాట్ బోలీ ఫేమ్ యాప్ లను ముందుగానే నాశనం చేసినట్లు తెలిపారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోకుండా రాజ్ కుంద్రా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం ఈ రెండు వెబ్ సైట్ల నుంచి సుమారు 50కి పైగా అశ్లీల చిత్రాల వీడియోలను సేకరించినట్లు తెలిపారు. రాజ్ కుంద్రా తీసిన ఈ పోర్నోగ్రఫీ వీడియోలను హాట్ షాట్ యాప్ లోఅప్లోడ్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు అనే ఆరోపణలు రావడం చేతనే గతవారం అతనికి బెయిల్ రద్దయిందని తెలిపారు.

ఈ విధంగా తన అరెస్టు గురించి ముందుగా గ్రహించి సాక్ష్యాధారాలను నాశనం చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనను వినిపించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై మరింత లోతుగా విచారణ చేపట్టే వరకు అతనికి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తనని డిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక ముందు ముందు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఎలాంటి నిజాలు బయట పడతాయన్న విషయం ప్రస్తుతం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.

అవకాశాల పేర్లతో అమాయకులతో బ్లూ ఫిలిమ్స్ .. సెట్లోనే మోడల్ అరెస్ట్!

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా మరో ఫోర్న్ రాకెట్ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని ఎవరికీ తెలియకుండా ఈ విధంగా బ్లూ ఫిలిమ్స్ తీసుకున్నటువంటి ఓ మోడల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బాధితులు తెలిపిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

నటి నందితా దత్త ఒకప్పుడు ఎంతో పాపులారిటీ ఉన్న మోడల్. ఈ క్రమంలోనే ఆమె పలు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఎలాంటి సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈ విధంగా బ్లూ ఫిలిమ్స్ లో నటిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకొని యంగ్ మోడల్స్‌కు వెబ్‌ సిరీస్ అవకాశాలను ఎర్రగా వేస్తూ వారిని లొంగదీసుకుంది. ఈ క్రమంలోనే వారిని బ్లూ ఫిలిమ్స్ లో నటించమని వారిపై అధిక ఒత్తిడి తీసుకు వచ్చేది.

ఈ విధంగా నందిత అరాచకాన్ని ఇద్దరు మోడల్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె నివసిస్తున్న అటువంటి డమ్‌ డమ్‌, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లల్లో ఒకేసారి దాడులు జరపగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది.నక్‌టాలాలోని ఓ ఇంట్లో ఒక మోడల్ ను నగ్నంగా నటించాలని ఒత్తిడి చేస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను రెడ్ హ్యాండ్ గా అరెస్టు చేశారు. అదేవిధంగా డమ్ డమ్ మా ఇంట్లో తన అనుచరుడు నీలి చిత్రాలను షూటింగ్ చేస్తున్న క్రమంలో అతను పట్టుబడ్డాడు.

ఈ విధంగా బాధితులు తెలిపిన ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అరెస్టు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు.అవకాశాల ఆశచూపి ఇంత దారుణానికి పాల్పడ్డారని నీలి చిత్రాలలో చేయడానికి ఒప్పుకోకపోతే తన మనుషుల చేత చంపిస్తానని బెదిరిస్తారు అంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ విధంగా బయటపడిన వీరి సెక్స్ రాకెట్ కేసుకు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ.. నేడు సోనూ సూద్ పుట్టిన రోజు !

కరోనా మొదటి వేవ్ లో ఎంతో మంది వలస కార్మికులకు అండగా నిలిచాడు సోనూసూద్. సొంత డబ్బులను వెచ్చించి రవాణా సౌకర్యాలను కల్పించాడు ఈ రియల్ హీరో. అప్పటి నుంచి ఎంతో మందికి అండగా నిలస్తూ ఎంతో మంది గుండెల్లో దేవుడిగా నిలిచాడు. పేదల పాలిట ఆపద్బాంధవుడిలా మారాడు. కాగా, సోనూసూద్ కొద్దిరోజుల నుంచి కొత్త అవతారం ఎత్తాడు.

మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తున్నాడు. రహదారుల వెంట దుకాణాలు నడుపుకునే చిరు వ్యాపారులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. అయితే నేడు(జూలై 30) సోనుసూద్ పుట్టినరోజు. దీంతో అతడిపై అభిమానాన్ని ప్రతీ ఒక్కరూ ఎదో ఒక విధంగా చాటుకుంటున్నారు.

కొంతమంది ఆయన పేరును షాపులకు పెట్టుకుంటుంటే మరికొందరు ఏకంగా వారి పిల్లలకు సోనూ అని పేరు పెట్టుకుంటున్నారు. ఇంకొంత మంది ఆయనకు గుడి కట్టి దైవంగా కొలుస్తున్నారు. ఇక ఆయనను అమితంగా ఇష్టపడే వారు నడుచుకుంటూ సోను ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆయనను కలుస్తున్నారు. అభిమానలు సోనూ భాయ్ అని పిలిస్తే ఎక్కడికంటే అక్కడకు టక్కున వచ్చి వాలుతున్నాడు.

అయితే అతడి బర్త్ డే సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి పుట్టిన రోజుకు సెలబ్రేట్ చేసుకున్నారు సోను. పలువురు సినిమా తారాలు, అభిమానులు అతడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో కొంత మంది అతడి పుట్టిన రోజు వేడుకను ఓ పండగలా జరుపుకుంటున్నారు.