Categories: FeaturedMovie News

ఎన్నో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.. వాటిని తట్టుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నానంటూ..

ఒకప్పుడు ఎంతో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు.. ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీనికి ఎవరూ అతీథులు కాదు. ఎవరికైనా కష్టాలు రావచ్చు. అటు టాలీవుడ్, బాలీవుడ్, సాధారణ ప్రజలకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే.. తెలుగులో ‘ఆహా కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బ్యూటీ వాణీకపూర్. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆమెను నిరాశకు గురిచేసింది. తర్వాత తెలుగులో సినిమా ఆఫర్లు రాలేదు.

కానీ బాలీవుడ్ లో మాత్రం ఆమె హవా కొనసాగింది. అక్కడ కొన్ని వరుస హిట్లతో తన పొజిషన్ ని ఇప్పుడు సుస్థిరం చేసుకుంది. శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్.. తర్వాత బేఫిక్రే..వార్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఆమెకు సంబంధించి ఓ సీక్రెట్ ఇప్పుడు అభిమానులకు షాక్ ను గురిచేస్తోంది. కపూర్ వంశస్తురాలిగా బాలీవుడ్ కి పరిచయమైన ఈ అమ్మడికి కూడా అందరిలానే కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి. 19 సంవత్సరాల వయస్సులో ఆమె తన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

వాళ్ల కుటుంబసభ్యులు ఆర్థిక కష్టాలు భరించలేక ఎంతగానో కుమిలిపోయారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమె తన కుటుంబానికి అండగా నిలబడాలనే నిశ్చయంతో స్వయంగా కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకున్నానని వాణీ చెప్పుకొచ్చింది. సనిమాలో నటిగా ఎదిగే సమయంలో ఇంటి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని.. తానే ఎన్నో ఆటుపోటులను తట్టుకొని నేడు ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. మోడలింగ్ లోకి రావడానికి కారణం కూడా ఆర్థిక కష్టాలే అని చెప్పింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన బెల్ బాటమ్ లో నటించింది.

ఈ సనిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఒక సనిమాలో నటిస్తున్న ఈ బామ.. షామ్ శ్రీ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. టాలీవుడ్ లో ఆమెకు లక్ కలసిరాలేదనే చెప్పాలి. అయితే తాజాగా ఆమె టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి.. సలార్ లాంటి భారీ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

36 minutes ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

44 minutes ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

50 minutes ago

ఆదివారం బట్టలు ఉతికితే జరిమానా..అసలు కారణం తెలిస్తే ఆశర్యపోతారు.!

భారత్‌లో ఆదివారం అంటే చాలామందికి ఇంటి పనుల రోజు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కారణంగా వారం మొత్తం బిజీగా గడిపే…

55 minutes ago

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

21 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

22 hours ago