Tag Archives: charmy kaur

ఇక తెరపై సందడి చేయలేను సంచలన వ్యాఖ్యలు చేసిన నటి చార్మి..!

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో నటి చార్మి ఒకరు. ఎన్నో సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ తెరవెనుక బాధ్యతలను చేపట్టారు. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలను చేపట్టారు. ఈమె పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ తో కలిసి సంయుక్తంగా చిత్రాల నిర్మిస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమాలలో హీరోయిన్ గా నటించాలంటే కేవలం ఫిట్ నెస్ పై దృష్టి పెడితే చాలని, అదే నిర్మాతగా బాధ్యతలు చేపట్టి మాత్రం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.

నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క బాధ్యత మనపై ఉంటుంది. ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుందని ఈమె తెలిపారు. బాధ్యతలు చేపట్టాలని అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది ఈమె తెలిపారు. అయితే తనకు నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఈమె తెలిపారు.

తను ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తున్నాయనీ, అయితే తనకు నటించాలనే కోరికలేదని ఇకపై తాను నటించనని, ఇకపై ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతానని ఈ సందర్భంగా ఛార్మి తెలియజేశారు.

చివరికి ఆయన పాదాల చెంతకు చేరాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఛార్మి?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఛార్మి, తాజాగా నిర్మాతగా మారి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఛార్మి ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ చార్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, చార్మి నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “లైగర్”. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ పనులలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను, తనకెంతో ఇష్టమైన తన పెట్ గురించి చార్మి నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఛార్మి పలు సందర్భాలలో తన తల్లిదండ్రుల గురించి అభిమానులతో ముచ్చటించారు. తాజాగా ఛార్మి తన తండ్రి సేవలో మునిగిపోయారు. తన తండ్రికి కాళ్లను ఒత్తుతూ చివరికి ఆయన పాదాల చెంతకు చేరాను అంటూ తన తండ్రికి పాద సేవ చేస్తున్నటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అవన్నీ చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదనీ.. చేతులు జోడించి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఛార్మి!

టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలను చేపడుతూ బిజీగా ఉన్నారు. అదికూడా పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.పూరి కనెక్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ ఛార్మీనే చూసుకుంటున్నారు. అయితే తాజాగా చార్మి ఈ విషయంపై స్పందించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ చార్మి ముంబైలోనే ఉంటున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా మరోసారి కరోనా అడ్డుపడుతోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ముంబై వంటి ప్రాంతాలలో రోజురోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి విలయ ప్రతాపాన్ని చూసి ఛార్మి చలించిపోయారు. ఇటువంటి పరిస్థితులను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు.. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని ఛార్మి తెలిపారు.

ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలని, ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. మీతో పాటు మీరు ప్రేమించే వ్యక్తుల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండండి అంటూ ఛార్మి చేతులు జోడించి వేడుకున్నారు.