ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఛార్మి, తాజాగా నిర్మాతగా మారి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఛార్మి ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ చార్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, చార్మి నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “లైగర్”. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ పనులలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను, తనకెంతో ఇష్టమైన తన పెట్ గురించి చార్మి నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఛార్మి పలు సందర్భాలలో తన తల్లిదండ్రుల గురించి అభిమానులతో ముచ్చటించారు. తాజాగా ఛార్మి తన తండ్రి సేవలో మునిగిపోయారు. తన తండ్రికి కాళ్లను ఒత్తుతూ చివరికి ఆయన పాదాల చెంతకు చేరాను అంటూ తన తండ్రికి పాద సేవ చేస్తున్నటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…