ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో నటి చార్మి ఒకరు. ఎన్నో సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ తెరవెనుక బాధ్యతలను చేపట్టారు. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలను చేపట్టారు. ఈమె పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ తో కలిసి సంయుక్తంగా చిత్రాల నిర్మిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమాలలో హీరోయిన్ గా నటించాలంటే కేవలం ఫిట్ నెస్ పై దృష్టి పెడితే చాలని, అదే నిర్మాతగా బాధ్యతలు చేపట్టి మాత్రం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.
నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క బాధ్యత మనపై ఉంటుంది. ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుందని ఈమె తెలిపారు. బాధ్యతలు చేపట్టాలని అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది ఈమె తెలిపారు. అయితే తనకు నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఈమె తెలిపారు.
తను ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తున్నాయనీ, అయితే తనకు నటించాలనే కోరికలేదని ఇకపై తాను నటించనని, ఇకపై ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతానని ఈ సందర్భంగా ఛార్మి తెలియజేశారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…