Tag Archives: comment

చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్లగణేష్.. మాటలు రాలేదంటూ!

బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిర్మాతగా ఎందుకు మంచి పేరు సంపాదించుకున్న బండ్లగణేష్ మెగా కుటుంబానికి వీర అభిమాని అనే విషయం మనకు తెలుసు.ఈయన ఎక్కడ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడితే షాకింగ్ కామెంట్ చేశారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లోని యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువురు తెలంగాణ మంత్రులు, పుల్లెల గోపీచంద్ వంటి వారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ఎంతోమంది నిరుపేదలకు కార్మికులు ఉన్నాడు వారందరికీ యోధ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఏదైనా సహాయం చేయాలని అడిగారు. ఈ సందర్భంగా యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ అధినేత మాట్లాడుతూ.. మా మెంబర్స్,24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి సినీ కార్మికులకు డయాగ్నస్టిక్ సెంటర్ 50% రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఇక ఈ వీడియోను బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ మీరు సూపర్ సార్.. ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదంటూ ట్వీట్ చేయడం కాకుండా చిరంజీవి మాట్లాడిన వీడియోని షేర్ చేశారు. పస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అందుకే యానీ మస్టార్ బిగ్ బాస్ కు వెళ్లారు.. మోనాల్ వ్యాఖ్యలు..

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. 10 వారాలు కంప్లీట్ చేసుకొని 11 వ వారం రన్ అవుతోంది. ప్రస్తుతం 11 వ వారం కెప్టెన్ ఎవరనే దానిపై టాస్క్ లు నడుస్తున్నాయి.

ఇప్పటికే హౌస్ నుంచి 10 మంది ఇంటికి వెళ్లి పోయారు. అందులో జెస్సీ అనారోగ్యం కారణంగా వెళ్లాల్సి వచ్చింది. మిగిలింది 9 మంది మాత్రమే. అయితే అందులో కూడా ఈ వారం 8 మంది నామినేషన్లో ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 4 లో మోనల్ గుర్తుంది కదా.. రెండు లవ్ ట్రాక్ లు నడిపించి.. చివరి వరకు వచ్చింది.

ఆమె తాజాగా కొన్ని కామెంట్లు చేసింది. ప్రస్తుతం యానీ మాస్టార్ ఈ వారం ఇంటి నుంచి వెళ్లి పోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడే యానీ మాస్టార్ కు గుడ్ బై చెబుతుండటంతో ఆమె అయోమయానికి గురయ్యారు. వాటికి సమాధానంగా మోనల్ ఇలా చెప్పింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి.. దయచేసి యానీ మాస్టార్ కు సపోర్టు చేయండి అంటూ అభ్యర్థించారు. యానీ మాస్టార్ నాకు వ్యక్తిగతంగా తెలుసని.. ఆమె ఎంతో స్ట్రాంగ్ అంటూ చెప్పుకొచ్చింది.

ఎవరి సపోర్టు లేకుండా ఒంటరిగా సినీ పరిశ్రమలోకి వచ్చి తన కష్టంపై తాను నిలబడుతుందని.. అలాంటి వారికి మన సపోర్టు ఉండాలంటూ చెప్పింది మోనాల్. ఆమె ఇల్లు కొనుగోలు చేయాలనే ఆశతో బిగ్ బాస్ కు వెళ్లినట్లు ఆమె చెప్పింది. ఆమె కల నెరవేరాలని తాను కోరుకుంటున్నానని.. మీరు కూడా యానీ మాస్టార్ కు సపోర్టు చేయండి అంటూ వీడియో పోస్టు చేసింది.

మా ఫ్యామిలీలో ఆ నలుగురికి మెంటల్..! నిహారిక షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ నటి, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల గురించి అందరికీ పరిచయమే. మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించింది. కానీ ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. అంతేకాకుండా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

గత ఏడాది జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లలో బాగా బిజీ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో లో పాల్గొన్నది. ఇక ఈ షో లో ఆలీ వ్యాఖ్యాతగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిహారిక తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంది.

తాను చిన్నప్పుడు టీచర్ కావాలని అనుకుందట. ఆ తర్వాత డాక్టర్ కావాలని అనుకోగా బైపీసీ చదవాలని కానీ అందులో ఫిజిక్స్ ఉంటుందని భయపడి డాక్టర్ చదువు చదువలేకపోయిందట. ఇక తన తండ్రి నాగబాబు తనను ముద్దుగా మమ్మీ అని పిలుస్తారని తెలిపింది. తన సోదరుడు వరుణ్ బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తాడట.

చిన్నప్పుడు తన అన్నతో బాగా ఫైట్ చేసేదట. కోపంతో అతని మొహం పై మొత్తం గీతలు కూడా గీసేసానని తెలిపింది. ఓసారి కారులో బాగా అల్లరి చేస్తున్నప్పుడు తన తండ్రి గట్టిగా కొట్టాడని ఆ తర్వాత తన తండ్రి బాధపడ్డాడని తెలిపింది. తనకు పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు ముగ్గురిలో తన తండ్రి అంటేనే ఇష్టమని తెలిపింది. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తన భర్త గురించి కొన్ని విషయాలు తెలిపింది. ఈ క్రమంలో మాట్లాడుతూ ‘మా ఫ్యామిలో నాకు, సాయి ధరమ్ తేజ్, మా చిన్నత్త, మా నాన్నకు మా నలుగురికి కొంచెం మెంటల్ అంటూ ఫాన్నీ కామెంట్స్ చేసారు నిహారిక. ఇక ప్రస్తుతం తను నిర్మాతగా బాధ్యతలు చేపట్టి ఓ సినిమాను నిర్మిస్తుంది. త్వరలోనే ఆ మూవీ విడుదల కానుంది.

కేవలం వారి కోరిక తీర్చనందుకే నన్ను ఇండస్ట్రీలో తొక్కేశారు నటి షాకింగ్ కామెంట్స్..!

సాధారణంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం గురించి మనం ఎన్నో సార్లు విని ఉన్నాం. అయితే ఈ విషయం గురించి ఎంతో మంది సినీ తారలు బహిరంగంగా బయటకు చెప్పారు. ఇలా వారు కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలియజేశారు. బాలీవుడ్ నటి కాస్టింగ్ కౌచ్ గురించి చేశారు తన కెరియర్ లో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఈమె వెల్లడించారు.

ఈమె బాలీవుడ్ నటి అయినప్పటికీ అమెరికాలో పుట్టి పెరిగింది. గత 10 సంవత్సరాల క్రితం ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటి నర్గీస్ ఫక్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నటించిన మొదటి సినిమానే అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగు లేదని చాలా మంది భావించారు.

అయితే ఈ సినిమా తర్వాత ఈ హీరోయిన్ మద్రాస్ కేఫ్, మై తేరా హీరో, గూఢచారి, హౌజ్ ఫుల్ లాంటి సినిమాలలో నటించారు. ఈ సినిమాల ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు.తనకు అవకాశాలు రావాలంటే కొందరు దర్శకనిర్మాతలు తమ పక్కన పడుకోవాలని డైరెక్టుగా అడిగినట్లు ఈమె వెల్లడించారు.

అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో కొన్ని పాత్రలలో నటించకూడదని కొన్ని విషయాలు ఎవరు అడిగినా ఒప్పుకోకూడదని నియమాలు పెట్టుకోవడం వల్ల అలా దర్శకనిర్మాతలు అడిగిన వెంటనే తను నో చెప్పానని అదే విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకుండా తొక్కేశారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

అప్పడం ఎవరూ తినొద్దు.. బూతు అది.. నాగార్జునపై మాధవిలత షాకింగ్ పోస్టు..!

రియాల్టీ షో బిగ్ బాస్ కు హోస్ట్ చేస్తే అన్ని వైపులా ఆలోచించి.. తప్పు ఎవరిదీ.. ఎక్కడ మొదలైంది.. ఎవరు మొదలు పెట్టారు అనే అన్ని కోణాల్లో విశ్లేషించి.. తప్పు ఎవరిదో తెలుసుకోవాలి. ఒప్పు ఉన్నవాళ్లను ప్రశంసించాలి. అప్పుడు హోస్ట్‌గా విజయవంతం అయినట్టు. అంతే కానీ స్క్రిప్ట్ ప్రకారం చదివేసి వెళ్లిపోవడం హోస్ట్ అని పించుకోడు. మన నాగార్జున చేసేది మాత్రం అదే. ఏ మాత్రం ఏమి జరిగింది.. ఏం తెలుసుకోకుండా.. స్క్రిప్ట్ ప్రకారం వెళ్తున్నాడు.

తమ డియరెస్ట్ కంటెస్టెంట్లకు అనుగుణంగానే ప్రవర్తిస్తుంది బిగ్ బాస్ టీం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ టీం ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం నాగార్జున రెచ్చిపోయినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలే జరిగిందంటే.. 10వ వారంలో కెప్టెన్సీ టాస్క్ లో షణ్ముఖ్, సన్నీకి మధ్య జరిగిన గొడవలో మొత్తం సన్నీదే అన్నట్లు నాగార్జున వ్యవహరించారు. దోషమంతా కూడా సన్నీదే అన్నట్టుగా నాగార్జున చిత్రీకరించాడు.

కొన్ని పదాలు తూలాడేమో సన్నీ.. కానీ వాటి ఉద్దేశ్యాన్ని స్వయంగా చెబుతూ ఉంటే కూడా కాదన్నాడు. ప్రతీ సారి అప్పడం, అమ్మెస్తా.. అనే దాని గురించే మాట్లాడుతున్నాడే తప్ప.. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా సన్నీనే నిందించడం చాలామందికి నచ్చలేదు. తాజాగా ఈ అతడి హోస్టింగ్ మీద మాధవీలత స్పందించింది. ‘తగలబెట్టండి సర్ తగలబెట్టండి.. డియర్ ప్రైమ్ మినిస్టర్.. అప్పడం అన్ పార్లమెంటర్లీ వర్డ్‌గా కన్సిడర్ చేయాలి.. ఇవాల్టి నుంచి కొత్త రూల్స్ పాస్ చేయండి..

ఈ దేశంలో ఎవరు అప్పడం తినకూడదు.. తింటే ఒక అమ్మాయిని తినట్లు.. అప్పడాల బిజినెస్ ఓనర్స్ మీకు తెలుసా?.. మీరు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని?… అవును అప్పడం అంటే అమ్మాయి.. అమ్మాయిని మీరు అమ్ముతారా? అని మన హీరో మిస్టర్ నాగార్జున చెప్పాడు.. అంత పెద్ద హీరో చెప్పినప్పుడు అది మనం నమ్మాలి తెలుగులో అప్పడం అంటే అమ్మాయి అనే అర్ధం అవుతుంది.. దయచేసి అప్పడం అనే పదం చెడ్డ పదం.. బూతు అది.. అనొద్దు.. తినొద్దు.. అమ్మొద్దు.. ధన్యవాదములు’ అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ముస్లిం వేషంలో కనిపించేది అందుకే.. రైటర్ కామెంట్స్ వైరల్?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించారు.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు ఆయనని ఒక ముస్లిం గెటప్ లో చూపించారు.అయితే ఎన్టీఆర్ ను అలా ఎందుకు చూపించారనే విషయం గురించి రైటర్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రోమోలు చూసి, టైటిల్స్ చూసి సినిమాను డిసైడ్ చేయొద్దని రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు.
ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం వేషధారణపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. అసలు ఆ గెటప్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలియకుండా ఎవరూ ఏదీ మాట్లాడడం సరి కాదని సాయి మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అల్లూరి సీతారామరాజు సినిమాను గుర్తు చేశారు.

ఆ సినిమాలో ఒక బ్రిటిష్ సైనికుడు అల్లూరి సీతారామరాజుకు గురి పెట్టగానే అప్పుడు ఆయన ఒక శ్రీ కృష్ణుడులాగా కనిపిస్తారని సాయి మాధవ్ చెప్పుకొచ్చారు. దాంతో ఆ సైనికుడు కాల్చకుండా తుపాకీని దించేస్తాడని ఆయన చెప్పారు. అప్పుడు ఇంకో సైనికుడు కాలుస్తాడని ఆయన అన్నారు.
అప్పట్లో ఈ సోషల్ మీడియా ఇంతగా లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత అల్లూరి సీతారామరాజు , శ్రీ కృష్ణుడిలా ఎందుకు ఉంటాడు ? అని, అసలు అల్లూరి సీతారామరాజు ఫైట్ చేసిందే క్రిస్టియన్ మీదైతే ఆయన కృష్ణుడి గెటప్ ఎందుకు వేసుకుంటారు ? అని అప్పుడు అందరూ అడిగేవారు అని సాయి మాధవ్ అన్నారు.

ఆ ట్రైలర్ లో అల్లూరి సీతారామరాజుని చూపించి, క్రీస్తు గెటప్ చూపిస్తే అందరూ అలానే అనుకుంటారని… ఆయన తెలిపారు. కేవలం ఆ ట్రైలర్ చూసి ఆ సినిమాలో ఆయన ఆ గెటప్ వేశారని అనుకుంటారు గానీ నిజంగా వేయడు కదా అని ఆయన వివరించారు.అయితే రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్ ను అలా ముస్లిం విషయంలో ఎందుకు చూపించారు అనే విషయం తెలియాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందేనని ఈ సందర్భంగా రైటర్ సాయి మాధవ్ ఎన్టీఆర్ ముస్లిం వేషం గురించి తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ మామూలోడు కాదు.. ఆకాష్ పూరీ కామెంట్స్ వైరల్?

బాల నటుడిగా వెండితెరకు పరిచయమై ప్రస్తుతం కథానాయకుడిగా వరుస చిత్రాలు చేస్తున్నారు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ. అయితే తనకు ప్రముఖ అగ్ర హీరోలతో ఉన్న మెమోరెబుల్ మూమెంట్స్ గురించి ఆకాశ్ ఇలా చెప్పారు.ఇక వివరాల్లోకి వెళితే జూనియర్ ఎన్టీఆర్ తనను ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటారని ఆకాశ్ తెలిపారు. ఇకపోతే ఈ మధ్యే విడుదలైన రొమాంటిక్ సినిమా ట్రైలర్ లాంచ్ సమయంలో ప్రభాస్ తనను మెచ్చుకున్నారని ఆయన అన్నారు.

అంతే కాకుండా అంత పెద్ద స్టార్‌తో కలిసి రీల్స్ చేయడం అనేది అల్టీమెట్ అని ఆకాశ్ చెప్పుకొచ్చారు. ఎవరికీ దక్కని ఆ అద్భుత అవకాశం తనకు దక్కిందన్న ఆయన, చాలా థ్యాంక్స్ అని ఆకాశ్ అన్నారు. ఇదిలా ఉండగా తాను స్విట్జర్‌ల్యాండ్‌లో హాలిడేస్‌లో ఉన్నపుడు రవితేజ గారు అపుడు ఏదో షూటింగ్ చేస్తున్నారని ఆకాశ్ చెప్పుకొచ్చారు. అది అనుకోకుండా అపుడు అలా ఆయన్ను కలిశానని ఆయన చెప్పారు.

ఆ షూటింగ్ అయిపోయాక ఆయన షాపింగ్ చేస్తున్నపుడు తాను కూడా వెంట వెళ్లానని ఆకాశ్ చెప్పారు. అది తనకు చాలా బ్యూటీపుల్‌గా అనిపించిందని ఆయన అన్నారు. అదే విధంగా తారక్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ మామూలోడు కాదు ఆయన అందరినీ ఎంతో సరదాగా టీజ్ చేస్తుంటారని ఆకాష్ తెలిపారు.

ఇకపోతే ఆకాష్ పూరీ హీరోగా, కొత్త హీరోయిన్ కేతిక శర్మ హీరోయిన్‌గా వచ్చిన లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’. సరికొత్త కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. మధ్యలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అటువంటిది ఏమి లేదంటూ క్లారిటీ ఇవ్వడమే కాదు అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆకాశ్ పూరి. అయితే ఇప్పటికే పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోవడం తెలిసిందే .

సన్నీ, యానీని ఆడేసుకున్న నాగార్జున.. హౌస్ లో ఏం జరుగుతుంది అంటూ!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది.

ఈ ఐదో సీజన్లో ఇప్పటికే 10 వారాలు పూర్తి కావచ్చాయి. 10వ వారంలో విజయవంతంగా యాకర్ రవి కెప్టెన్ అయ్యాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే శనివారం ఈ కార్యక్రమానికి వచ్చిన నాగార్జున సన్నీ, యానీపై కోపం చూపించినట్లు కనిపించింది.

సన్నీ విషయంపై రవి మాట్లాడుతూ.. కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ ఎక్కువగా టంగ్ లూస్ అయ్యాడని.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని .. వెరీ బ్యాడ్ బియేవియర్.. ఇష్టం వచ్చింది చేస్తా.. అంటూన్నాడు అంటూ రవి చెబుతాడు. దానికి సన్నీ నేను అనలేదు అని.. దానికి మానస్ కూడా నాకు వినిపించలేదు అని చెబుతారు. దీనికి నాగార్జున వీడియో ప్లే చేయించి.. తంతా అనే పదం వాడావు అంటూ నిరూపిస్తాడు.

దానికి యాని ఇంటెన్షన్ గా అనలేదు.. ఆ పదం బ్రిక్స్ ను తంతా అని వాడి ఉండొచ్చు అంటూ సన్నీని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయాగా.. నాగార్జున ఆమెకు కౌంటర్ ఇస్తాడు. కోపంలో ఏది చెప్పినా ఓకె.. కాజల్ చెబుతున్న బేవకూప్ కూడా కరెక్టే కదా అంటూ చెబుతాడు నాగార్జున. దీంతో ఒక్కసారిగా యానీ మాస్టార్ షాక్ కు గురవుతుంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఎక్కవుగా సన్నీ, యానీని ఆడేసుకున్నట్లు కనపడుతోంది.

షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ స్ట్రాంగ్ వార్నింగ్.. అతడిని హగ్ చేసుకోవాలని ఉందంటూ పోస్టు..

బిగ్ బాస్ 5 తెలుగు 10వ వారం ఎలిమినేషన్ కూడా అయిపోయింది. కాకపోతే అధికారికంగా మాత్రం తెలియదు. అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీని బయటకు పంచించినట్లు టాక్. అయితే ఈ 10వ వారం బీబీ హోటల్ వరకు హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ బాగానే ఉన్నారు. కానీ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో తమ టవర్ కాపాడుకునే సమయంలో ఒకరిపై ఒకరు విరుచుపడిపోయారు. సన్నీ, పిరి, షణ్ముఖ్ మధ్య పెద్ద యుద్దమే జరిగింది.

ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ సన్నీ రెచ్చిపోయి మాట్లాడాడు. దీనిపై షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనా ఘాటుగా స్పందిచారు. తన ఇన్ స్టాలో ఓ పెద్ద పోస్టును షేర్ చేశారు. అందులో ఏముందంటే.. ‘అప్పడం అయిపోతావ్‌ అనవసరంగానా? నువ్ ఒక్కడివే బెస్ట్ అనుకో తప్పులేదు కానీ.. మిగతా అందరినీ ఎందుకు అట్లా చూస్తున్నారు.. ? చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి..?

ఫిజికల్‌ అయ్యి గట్టి గట్టిగా అరిస్తే గేమ్ ఆడినట్లా..? ఫిజికల్‌ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్‌ మైండ్‌తో ఆడటం. అది షన్ను వంద శాతం ఆడుతున్నాడు. బిగ్‌బాస్‌ చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది. చాలా మెచ్యూర్‌గా బిహేవ్‌ చేస్తున్నాడు. యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకోనా..? ఈ స్టేజ్ వరకూ వచ్చాడు ఒక్కడే కష్టపడి అని సంతోషపడాలి కానీ.. యూట్యూబ్ వరకే అని అనడం ఏంటి..?

చాలా తప్పు సన్నీగారూ.. మీ ఆటను హౌస్‌లో బాగా ఇష్టపడతాను బట్ ఈరోజు చూడలేకపోయా. రా అంటేనే పడలేకపోయారు.. మరి మీరు అన్ని మాటలు అంటే ఎదుటి వాళ్లు పడాలా..? నాది తప్పు అయితే నేర్చుకుంటారా భై.. ఎంత బాగా చెప్పావ్ షన్నూ.. నీపై మరింత ఇష్టం ఏర్పడింది.. నిన్ను హగ్ చేసుకోవానలని ఉంది అంటూ పోస్ట్ పెట్టింది దీప్తి సునయన. ఈ పోస్టు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

చిన్న వయసు వారితో డేటింగ్ చేస్తే తప్పేంటి… షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక!

రష్మిక మందన్నా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రష్మిక ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే రష్మిక ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌ స్టేటప్‌పై ఓపెన్‌ అప్‌ అయ్యింది. ఈ క్రమంలోనే ఒక మీడియా వ్యక్తి మీరు మీ కన్నా చిన్న వ్యక్తితో డైటింగ్ చేస్తారా? అని ప్రశ్నించగా అందుకు రష్మిక తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ వయసుకు ప్రేమకు ఏమాత్రం సంబంధం లేదని.. మనసుకు నచ్చిన వారిని మన లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకుంటే తప్పేముందని దానికి వయసుతో పని ఏముందని తెలిపారు. మనం వారితో ఏ విధంగా ప్రవర్తిస్తాము అనేది ముఖ్యం అంతేకానీ వారు మనల్ని మార్చడం కోసం ప్రయత్నించకూడదు అంటూ రష్మిక పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా శర్వానంద్ హీరోగా ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా మూడు చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.