రియాల్టీ షో బిగ్ బాస్ కు హోస్ట్ చేస్తే అన్ని వైపులా ఆలోచించి.. తప్పు ఎవరిదీ.. ఎక్కడ మొదలైంది.. ఎవరు మొదలు పెట్టారు అనే అన్ని కోణాల్లో విశ్లేషించి.. తప్పు ఎవరిదో తెలుసుకోవాలి. ఒప్పు ఉన్నవాళ్లను ప్రశంసించాలి. అప్పుడు హోస్ట్గా విజయవంతం అయినట్టు. అంతే కానీ స్క్రిప్ట్ ప్రకారం చదివేసి వెళ్లిపోవడం హోస్ట్ అని పించుకోడు. మన నాగార్జున చేసేది మాత్రం అదే. ఏ మాత్రం ఏమి జరిగింది.. ఏం తెలుసుకోకుండా.. స్క్రిప్ట్ ప్రకారం వెళ్తున్నాడు.
తమ డియరెస్ట్ కంటెస్టెంట్లకు అనుగుణంగానే ప్రవర్తిస్తుంది బిగ్ బాస్ టీం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ టీం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నాగార్జున రెచ్చిపోయినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలే జరిగిందంటే.. 10వ వారంలో కెప్టెన్సీ టాస్క్ లో షణ్ముఖ్, సన్నీకి మధ్య జరిగిన గొడవలో మొత్తం సన్నీదే అన్నట్లు నాగార్జున వ్యవహరించారు. దోషమంతా కూడా సన్నీదే అన్నట్టుగా నాగార్జున చిత్రీకరించాడు.
కొన్ని పదాలు తూలాడేమో సన్నీ.. కానీ వాటి ఉద్దేశ్యాన్ని స్వయంగా చెబుతూ ఉంటే కూడా కాదన్నాడు. ప్రతీ సారి అప్పడం, అమ్మెస్తా.. అనే దాని గురించే మాట్లాడుతున్నాడే తప్ప.. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా సన్నీనే నిందించడం చాలామందికి నచ్చలేదు. తాజాగా ఈ అతడి హోస్టింగ్ మీద మాధవీలత స్పందించింది. ‘తగలబెట్టండి సర్ తగలబెట్టండి.. డియర్ ప్రైమ్ మినిస్టర్.. అప్పడం అన్ పార్లమెంటర్లీ వర్డ్గా కన్సిడర్ చేయాలి.. ఇవాల్టి నుంచి కొత్త రూల్స్ పాస్ చేయండి..
ఈ దేశంలో ఎవరు అప్పడం తినకూడదు.. తింటే ఒక అమ్మాయిని తినట్లు.. అప్పడాల బిజినెస్ ఓనర్స్ మీకు తెలుసా?.. మీరు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని?… అవును అప్పడం అంటే అమ్మాయి.. అమ్మాయిని మీరు అమ్ముతారా? అని మన హీరో మిస్టర్ నాగార్జున చెప్పాడు.. అంత పెద్ద హీరో చెప్పినప్పుడు అది మనం నమ్మాలి తెలుగులో అప్పడం అంటే అమ్మాయి అనే అర్ధం అవుతుంది.. దయచేసి అప్పడం అనే పదం చెడ్డ పదం.. బూతు అది.. అనొద్దు.. తినొద్దు.. అమ్మొద్దు.. ధన్యవాదములు’ అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…