తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. 10 వారాలు కంప్లీట్ చేసుకొని 11 వ వారం రన్ అవుతోంది. ప్రస్తుతం 11 వ వారం కెప్టెన్ ఎవరనే దానిపై టాస్క్ లు నడుస్తున్నాయి.
ఇప్పటికే హౌస్ నుంచి 10 మంది ఇంటికి వెళ్లి పోయారు. అందులో జెస్సీ అనారోగ్యం కారణంగా వెళ్లాల్సి వచ్చింది. మిగిలింది 9 మంది మాత్రమే. అయితే అందులో కూడా ఈ వారం 8 మంది నామినేషన్లో ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 4 లో మోనల్ గుర్తుంది కదా.. రెండు లవ్ ట్రాక్ లు నడిపించి.. చివరి వరకు వచ్చింది.
ఆమె తాజాగా కొన్ని కామెంట్లు చేసింది. ప్రస్తుతం యానీ మాస్టార్ ఈ వారం ఇంటి నుంచి వెళ్లి పోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడే యానీ మాస్టార్ కు గుడ్ బై చెబుతుండటంతో ఆమె అయోమయానికి గురయ్యారు. వాటికి సమాధానంగా మోనల్ ఇలా చెప్పింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి.. దయచేసి యానీ మాస్టార్ కు సపోర్టు చేయండి అంటూ అభ్యర్థించారు. యానీ మాస్టార్ నాకు వ్యక్తిగతంగా తెలుసని.. ఆమె ఎంతో స్ట్రాంగ్ అంటూ చెప్పుకొచ్చింది.
ఎవరి సపోర్టు లేకుండా ఒంటరిగా సినీ పరిశ్రమలోకి వచ్చి తన కష్టంపై తాను నిలబడుతుందని.. అలాంటి వారికి మన సపోర్టు ఉండాలంటూ చెప్పింది మోనాల్. ఆమె ఇల్లు కొనుగోలు చేయాలనే ఆశతో బిగ్ బాస్ కు వెళ్లినట్లు ఆమె చెప్పింది. ఆమె కల నెరవేరాలని తాను కోరుకుంటున్నానని.. మీరు కూడా యానీ మాస్టార్ కు సపోర్టు చేయండి అంటూ వీడియో పోస్టు చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…