ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ లో విడుదలైన జై భీమ్ .. ఎంతటి ఘన విజయం సాధించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్టులను తిరగరాసింది ఈ సినిమా. యదార్థ ఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. దీనిలో కోలీవుడ్ నటుడు సూర్య.. చంద్రు అనే లాయర్ పాత్రలో నటించి.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు కురిపించుకున్నారు.
ఈ సినిమా ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది అంటూ సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది.
దీనిలో సిన్నతల్లిగా నటించి లిజోమోల్ అద్భుతంగా నటించారు. రియల్ సిన్నతల్లి పేరు పార్వతి. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదు ఆమెకు. అయితే దీనిపై స్పందించిన లారెన్స్ ఆమెకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. సూర్య కూడా అంతక ముందే ఆమెకు రూ. 10 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటకు సార్థకం చేసే రోజు రానే వచ్చింది.
ఆమెకు రూ.15 లక్షల రూపాయలను అందజేశారు సూర్య. తన తరఫున రూ.10 లక్షలు.. చిత్ర నిర్మాణం తరఫున మరో రూ.5లక్షలు అంటూ ఆమె అకౌంట్లో డిపాజిట్ చేయించారు హీరో సూర్య. చెప్పడమే కాకుండా.. ఆ మాటను నిలబెట్టుకొని చూపించిన సూర్యను అక్కడి ప్రజలు ప్రశంసిస్తున్నారు.
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…