Tag Archives: comment

నేనైతే అలా చెయ్యను అంటూ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..!

సీనియర్ నటులైన చిరంజీవి మోహన్ బాబుల మధ్య నిత్యం గొడవలు కనిపిస్తూనే ఉంటాయి. వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ రిలేషన్షిప్ ఉందని చాలా మంది భావిస్తుంటారు. ఎప్పుడు గొడవ పడతారో.. ఎప్పుడు కలుస్తారో వారికే తెలియదు.ఇలా ఎన్నో సార్లు వీరిద్దరూ ఒకరి పై ఒకరు మాటల యుద్ధం చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే మోహన్ బాబు మరొకసారి చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పోటీలో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ ఎన్నికల మధ్య సాధారణ ఎన్నికల మాదిరిగా పోటీ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా ఎన్నికలలో అధ్యక్ష పదవి కోసం మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ లేదా అరవింద్ కొడుకు అల్లు అర్జున్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎవరు నిలబడిన నా కుటుంబం మద్దతు పూర్తిగా వారికే ఉండేదని కానీ ప్రస్తుతం తన కొడుకు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పటికీ చిరంజీవి మద్దతు తనకు లేదని,నేనైతే చిరంజీవి విషయంలో ఇలా ఎప్పటికీ చేయను…కానీ చిరంజీవి కుటుంబం మాత్రం తన కొడుకుకి కాకుండా ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా మెగా కుటుంబం పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన తన కొడుకు ఈ ఎన్నికలలో తన కొడుకు గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. విష్ణు గెలిచిన తర్వాత తన సొంత డబ్బులతోనే మా బిల్లింగ్ నిర్మిస్తానని ఈ సందర్భంగా మరోసారి మోహన్ బాబు చాలెంజ్ చేశారు. ఇకపోతే అక్టోబర్ 10వ తేదీ ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం వేగవంతంగా జరుగుతూ ఒకరి పానల్ పై మరొకరు పరస్పర మాటల దాడి చేసుకుంటున్నారు.

పోసానికి విపరీతమైన కోపం..! ఫోన్ లిఫ్ట్ చేయడం రెండు సెకండ్లు లేట్ అయినా.. ఎం.ఎం. శ్రీలేఖ..

టాలీవుడ్ లో ఏకైక లేడీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ లేఖ‌. ఎం.ఎం. కీర‌ణ‌వాణి చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీలేఖ ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాల‌కు సంగీతం అందించారు. ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని హిందీ, తమిళ, మళయాలం, కన్నం వంటి భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ హీరోగా తాజ్ మహల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీనిని డా. డి. రామానాయుడు నిర్మించారు. దీనిలో సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ పనిచేశారు. ఆ తర్వాత శివయ్య, ప్రేయసి రావే.. ఆపరేషన్ దుర్యోదన వంటి 70కి పైగా సినిమాలకు బాణీలను అందించారు శ్రీలేఖ. అయితే ఆమె తాజాగా పోసానీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమె ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పోసానీ కృష్ణ మురళికి కోపం ఎక్కువగా ఉంటుందని.. తొందర్లో టపటపా మాట్లాడేసి.. తర్వాత కూల్ అవుతారని చెప్పుకొచ్చారు. ఒక సాంగ్ కంపోజ్ చేయడం లేట్ అయిందంటే.. ఎందుకు.. ఏమైందటూ ఆవేశ పడతారాని.. తెలిపారు. కాల్ చేసిన రెండో రింగ్ కు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే.. అతడికి కోపం విపరీతంగా వస్తుందని శ్రీలేఖ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అతడు మంచి విజన్ ఉన్న దర్శకుడు అని.. ఎలాంటి టెన్షన్ లేని సమయంలో ‘రాజా’ అంటూ సంబోధిస్తారని చెప్పారు. కోపం వచ్చినా కేవలం తాత్కాలికంగా ఉంటుందని.. తదుపరి సెకన్లో అన్నీ మర్చిపోతారని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో పోసానీతో కలిసి ఓ సినిమాలో వర్క్ చేసినట్లు.. ఆ సినిమా పేరు ‘ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు’అని చెప్పారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదని ఆమె అన్నారు.

మెగా ఫ్యామిలీలో పరాన్నజీవులే ఎక్కువ.. ఒక్క అల్లుఅర్జున్ తప్ప అంటూ.. ఆర్జీవీ పంచ్

రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందో అక్కడే ఉంటాడు. ఇతని గురించి తెలియకుండా తెలుగు ప్రేక్షకుడే కాదు.. దక్షిణ భారతదేశంలో కూడా ఎవరూ ఉండరు. అంతగా పాపులారిటీ తెచ్చుకున్నారు ఆర్జీవీ. ఒకప్పుడు దర్శకత్వంలో తన మార్క్ ను చూపించిన వర్మ ప్రస్తుతం వివాదాలే అతడి టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

ఇటీవల అమ్మాయిలతో తాగి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. సందర్భం ఏదైనా, పరిణామాలు ఏవైనా అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాడు వర్మ. ఎప్పటికప్పుడు సెన్సేషనల్‌ కామెంట్స్‌, ట్వీట్స్‌ చేస్తూ అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటాడు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మెగా ఫ్యామిలీపై అతడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా అతడు మెగా ఫ్యామిలీపై మరోసారి రెచ్చిపోయాడు. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును చిరు ఇంట్లో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజు రాఖీ పౌర్ణమి కూడా రావడంతో చాలామంది ఆ వేడుకకు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ అంతా ఆ వేడుకకు హాజరు కాగా కొన్ని కారణాలతో అల్లు అర్జున్ హాజరు కాలేకపోయారు.

దీనిని ఆర్జీవీ టార్గెట్ చేసి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వేడుకకు హాజరైన వాళ్లంతా చిరంజీవి సపోర్టుతో పైకి వచ్చారని.. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే స్వయంకృషితో పైకి వచ్చారటూ ట్వీట్ చేశారు. ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగతా మెగా ఫ్యామిలీ అంతా పరాన్న జీవులని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. దీనిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.