Tag Archives: comment

Manchu Vishnu: వివాదంలో మంచు విష్ణు జిన్నా మూవీ… వార్నింగ్ ఇచ్చిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి!

Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మంచు కుటుంబం ఈమధ్య కాలంలో ఏదో ఒక విషయంలో వివాదంలో చిక్కుకొని సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కొత్త సినిమా మరొక వివాదంలో చిక్కుకుంది. విష్ణు నటిస్తున్న కొత్త సినిమా జిన్నా అనే పేరును విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ టైటిల్ పోస్టర్ తీవ్ర వివాదానికి తెర తీసింది.

Manchu Vishnu: వివాదంలో మంచు విష్ణు జిన్నా మూవీ… వార్నింగ్ ఇచ్చిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి!

ఇకపోతే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ తిరుమల కొండ వెనుక నుంచి వచ్చేలా టైటిల్ డిజైన్ చేశారు. అదేవిధంగా తిరుమల కొండపై జిన్నా అనే పేరు ఉంచడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో మంచు విష్ణు పై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈయన విష్ణును హెచ్చరిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Manchu Vishnu: వివాదంలో మంచు విష్ణు జిన్నా మూవీ… వార్నింగ్ ఇచ్చిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి!

మహమ్మద్ అలీ జిన్నా గురించి విష్ణు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మంచు విష్ణుకు హితబోధ చేశారు. భారతదేశంలో కొన్ని వేల మంది ఊచకోతకు కారణమైన వ్యక్తి, ఎన్నో మానభంగాలకు కారణమైన జిన్నా పేరును తన సినిమాకి పెట్టుకోవడం ఎంతో సిగ్గుచేటు అంటూ మంచు విష్ణు పై నిప్పులు కురిపించారు. ఇక గుంటూరులో జిన్నా పేరుమీద ఉన్న టవర్ సైతం తొలగించాలని ఒకవైపు మేము ఉద్యమం చేస్తుంటే మరోవైపు మీరు అతని పేరును సినిమాకు పెట్టుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు.

హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు…

ఈ విధంగా దేశ విభజనకు కారణమైన ఓ వ్యక్తి పేరు సినిమాకి పెట్టుకోవడం చూస్తుంటే అతని గురించి పూర్తిగా మీకు తెలుసా లేదా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇక అలాంటి వ్యక్తి పేరు సినిమాకి పెట్టుకోవడమే కాకుండా ఏకంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై సినిమా పేరు పెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.హిందూ మనోభావాలను గౌరవిస్తూ మంచు విష్ణు తక్షణమే సినిమా పేరును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Jabardasth Komaram: నా భార్య లేకపోతే నేను ఇక్కడ లేను.. కన్నీటి కష్టాలను బయటపెట్టిన జబర్దస్త్ కొమరం!

Jabardasth Komaram: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొంది ఇండస్ట్రీలో మంచి స్థాయిలో నిలదొక్కుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన ఎంతో మంది ప్రస్తుతం వెండితెరపై అవకాశాలను అందుకుంటూ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారిలో జబర్దస్త్ కొమరం అలియాస్ కొమురక్క ఒకరు. జబర్దస్త్ కొమరం తన యాస, భాష, కట్టు బొట్టుతో అందరిని మెప్పించారు.

Jabardasth Komaram: నా భార్య లేకపోతే నేను ఇక్కడ లేను.. కన్నీటి కష్టాలను బయటపెట్టిన జబర్దస్త్ కొమరం!

ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ తమ భార్యలతో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొమరం తన భార్య రజిత గురించి చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.తన భార్య రజిత లేకపోతే తాను ఇక్కడ ఉండే వాడిని కాదంటూ తన కన్నీటి కష్టాలను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు.నాకు ఇండస్ట్రీలో ఉండటం అంటే ఎంతో ఇష్టం తన ఇష్టాన్ని తెలుసుకున్న తన భార్య రజిత తనను ఎంతగానో ప్రోత్సహించింది.

Jabardasth Komaram: నా భార్య లేకపోతే నేను ఇక్కడ లేను.. కన్నీటి కష్టాలను బయటపెట్టిన జబర్దస్త్ కొమరం!

మూడు సంవత్సరాల పాటు నువ్వు అవకాశాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తావు చేయి అని తనకు సపోర్ట్ చేశారు అంటూ తెలిపారు. ఈ విధంగా మూడు సంవత్సరాల పాటు భార్య పిల్లలు అందరినీ వదిలి ఇండస్ట్రీలో అవకాశాలు కోసం వచ్చాను. అయితే ఐదు సంవత్సరాల పాటు రజిత నా కోసం రాత్రి పగలు కష్టపడుతూ మిషన్ కుట్టి ప్రతి నెల తనకు మూడు వేల రూపాయలు డబ్బులు పంపించేది.

నా భార్య లేకపోతే నేనులేను….

ఈ విధంగా నాకు ఇష్టమైన రంగంలో నిలదొక్కుకోవడానికి తాను ఎన్నో త్యాగాలు చేసిందని, తన వల్లే నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నానని కొమరం చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నా భార్య సపోర్ట్ నాకు లేకపోతే నేను ఏమై పోయే వాడినో,నా జీవితం ప్రస్తుతం ఇలా ఉంది అంటే అందుకు కారణం నా భార్య రజిత అంటూ తన భార్య గురించి ఎంతో గొప్పగా చెబుతూ కొమరం వేదికపై ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Anchor Anasuya: రాముడు లాంటి నా భర్తను ఇలా చేసారేంటీ.. ఆపండి లేదంటే వైలెంట్ అవుతుంది.. వార్నింగ్ ఇచ్చిన అనసూయ..

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వెండితెరపై రంగమ్మత్త పాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని సందడి చేశారు.రంగమ్మత్త పాత్ర ద్వారా వెండితెరపై సందడి చేసిన అనసూయ సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం వెండితెరపై, బుల్లితెరపై వరుస సినిమాలు ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Anchor Anasuya: రాముడు లాంటి నా భర్తను ఇలా చేసారేంటీ.. ఆపండి లేదంటే వైలెంట్ అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తన గురించి ఎవరైనా ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేసిన వారి భరతం పడుతుంది. తాజాగా అనసూయ హైపర్ ఆది టీమ్ పై తన విశ్వరూపం చూపించారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Anchor Anasuya: రాముడు లాంటి నా భర్తను ఇలా చేసారేంటీ.. ఆపండి లేదంటే వైలెంట్ అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ?

ఈ ప్రోమోలో భాగంగా దొరబాబు, పరదేశి అనసూయ హోమ్ టూర్ స్కిట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో రైజింగ్ రాజు పాత్రలో నటించగా దొరబాబు అనసూయ భరద్వాజ్ పాత్రలో నటించారు. పరదేశి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే రైజింగ్ రాజు అనసూయ పాత్ర ద్వారా ఎంట్రీ ఇస్తారు.ఇలా తన పాత్రలో రైజింగ్ రాజుని చూసేసరికి అనసూయ గుండె ముక్కలైపోయింది.

నా వైలెన్స్ చూస్తారు….

మేము మీ హోమ్ టూర్ చేయడానికి వచ్చాము అని చెప్పగా వారిని గట్టిగా కసురుకుంటుంది. దీంతో పరదేశి ఇదేమైనా ఫేస్ బుక్ అనుకున్నావా యూట్యూబ్ అంటూ అనసూయ పై సెటైర్ వేస్తారు. ఇక అనసూయ భర్తగా దొరబాబు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అనసూయ షాక్ అవుతుంది. దొరబాబు రావడం చూసిన అనసూయ రాముడు లాంటి నా భర్త పాత్రను దొరబాబు చేశారంటూనే ఇంతటితో స్కిట్ ఆపకపోతే వైలెన్స్ చూస్తారు అంటూ దొరబాబు టీమ్ కి అనసూయ స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

MS Raju: ఒట్టేసి చెబుతున్నా.. ప్రభాస్ మహేష్ డేట్స్ ఇచ్చిన సినిమా చేయను.. నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్!

MS Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, దేవి పుత్రుడు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాయి.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ప్రొడక్షన్ బ్యానర్ లో, ఆయనే దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం 7 డేస్‌ 6 నైట్స్‌ .

MS Raju: ఒట్టేసి చెబుతున్నా.. ప్రభాస్ మహేష్ డేట్స్ ఇచ్చిన సినిమా చేయను.. నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఒక మీడియాతో ముచ్చటించిన ఎమ్మెస్ రాజు ఇండస్ట్రీలో అగ్ర హీరోల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను స్టార్ హీరోలను ఏమాత్రం నమ్మనని కథను మాత్రమే నమ్ముతానని తెలిపారు. గతంలో రవితేజ, మహేష్, త్రివిక్రమ్, గుణశేఖర్ వంటి సెలబ్రిటీలు నాతో కలిసి సినిమా చేద్దాం అని అడిగారు.

MS Raju: ఒట్టేసి చెబుతున్నా.. ప్రభాస్ మహేష్ డేట్స్ ఇచ్చిన సినిమా చేయను.. నిర్మాత ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా సినిమా చేయమని అడిగితే నిర్మొహమాటంగా చేయనని సమాధానం చెప్పానని ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు వెల్లడించారు. ఒట్టేసి చెబుతున్నా… ప్రభాస్,మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు నాతో సినిమా చేస్తామని డేట్స్ ఇచ్చిన కూడా నేను వారితో సినిమా చేయను. కేవలం స్టార్ హీరోలని నమ్ముకుని నేను సినిమా చేయనని కథకు ప్రాధాన్యత ఇచ్చి కథ బాగుంటేనే సినిమా చేస్తానని తెలిపారు.

హీరోలను చూసి సినిమా చేయను..

నిజం చెప్పాలంటే తాను అగ్రహీరోలతో చేసిన సినిమాలకన్నా కథను నమ్ముకుని చేసిన మనసంతా నువ్వే సినిమాతో తనకు ఎక్కువగా లాభాలు వచ్చాయని,ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు నాకు నచ్చిన సినిమాలను మాత్రమే నేను చేస్తాను తప్ప హీరోలని చూసి సినిమా చేయనని ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Siva Parvathi : మోహన్ బాబు నా ముందే నటి శోభనను దారుణంగా తిట్టారు.. అలాంటి వారు ఇండస్ట్రీకి అవసరం.. నటి శివపార్వతి షాకింగ్ కామెంట్స్!

Actress Siva Parvathi : టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, హీరోగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రమశిక్షణకు మారుపేరు అని అందరికీ తెలిసిందే. ఇక షూటింగ్ లొకేషన్లో ఎవరైనా ఏ మాత్రం క్రమశిక్షణ పాటించకపోతే వారిని చెడామడా తిట్టేస్తారు.ఈ క్రమంలోనే నటి శివపార్వతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి ఒక సంఘటనను తెలియజేశారు.

Mohan Babu: మోహన్ బాబు నా ముందే నటి శోభనను దారుణంగా తిట్టారు.. అలాంటి వారు ఇండస్ట్రీకి అవసరం.. నటి శివపార్వతి షాకింగ్ కామెంట్స్!

లక్ష్మి ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్లో రౌడీ గారి పెళ్ళాం సినిమా చేస్తున్న సమయంలో తాను ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తెలిపారు.ఈ సినిమా ద్వారానే తాను లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్ బ్యానర్ లో మొట్టమొదటి సారిగా నటించానని తెలిపారు. ఇక ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ లో నటించాను. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శోభన నటించారని శివపార్వతి తెలిపారు. ఇక షూటింగ్ లొకేషన్ లో ఒక రోజు శోభన నాకు విష్ చేయకుండా వెళ్లిపోయారు.

Mohan Babu: మోహన్ బాబు నా ముందే నటి శోభనను దారుణంగా తిట్టారు.. అలాంటి వారు ఇండస్ట్రీకి అవసరం.. నటి శివపార్వతి షాకింగ్ కామెంట్స్!

ఈ విషయం గమనించిన మోహన్ బాబు శోభనను నా దగ్గరకు పిలిచి ఆవిడ ఎవరు అనుకుంటున్నావు ఆమె ఎక్స్లెంట్ ఆర్టిస్ట్ తనకి ఎందుకు విష్ చేయలేదు అని తన ఎదురుగానే శోభనను తిట్టారని ఈ సందర్భంగా శివ పార్వతి వెల్లడించారు. ఇలా ఆయన ఎందుకు చెబుతున్నారు అని అనుకున్నాను.ఇది తప్పు అంటూ ఆ రోజు మోహన్ బాబు శోభనను తిట్టారు. ఇక మోహన్ బాబు దృష్టిలో ఒకసారి ఆర్టిస్ట్ అని ఆలోచన వచ్చిందంటే వాళ్ళు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్ట్ అనే తేడాలు అతనికి ఉండవని తెలిపారు.

ఇలాంటి వాళ్లే ఇండస్ట్రీకి అవసరం..

ఇకపోతే మోహన్ బాబు క్రమశిక్షణ లేకపోతే ప్రతి ఒక్కరిని గట్టిగా అరుస్తారని అయితే ఇలా అరిచే వాళ్లే ఇండస్ట్రీకి కావాలని ఈమె తెలిపారు.ఒకప్పుడు ప్రతి ఒక్కరూ సరైన సమయానికి షూటింగ్ లొకేషన్ కి చేరుకొని సినిమాలలో నటించే వారు. అయితే ప్రస్తుతం ఉదయం 10 గంటలైనా అయినా ఒక షార్ట్ కూడా పూర్తి కావడంలేదని ప్రస్తుతం మన ఆర్టిస్టులలో సమయ పాలన లేదని, ఇలా క్రమశిక్షణలో పెట్టేవారు ఇండస్ట్రీకి అవసరం అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Actor Parvatheesam : నా డబ్బులు ఇవ్వలేదు సార్ అని డైరెక్టర్ మారుతికి ఫోన్ చేస్తే.. ఏమన్నాడో తెలుసా? : యాక్టర్ పార్వతీశం కామెంట్స్ వైరల్!

Director Maruthi: పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అనంతరం కేరింత సినిమాతో నటుడు పార్వతీశం పరిచయమయ్యారు.ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాలలో నటించారు. మారుతి దర్శకత్వంలోనూ రోజులు మారాయి, భలే మంచి చౌక బేరం వంటి రెండు సినిమాలలో నటించినట్టు ఈయన తెలిపారు.

Director Maruthi: డబ్బులు ఇవ్వలేదని మారుతి గారికి ఫోన్ చేస్తే.. ఆయన అలా మాట్లాడారు.. యాక్టర్ పార్వతీశం కామెంట్స్ వైరల్!

ఇకపోతే కేరింత సినిమాలో నటించడం కోసం పార్వతీశం దిల్ రాజుకు డబ్బులు ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి ప్రశ్నించగా దిల్ రాజు గారికి నేను డబ్బులు ఇవ్వడం ఏంటి అంటూ ఈయన ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇకపోతే మారుతి గారు మీకు పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టారు అని కూడా వార్తలు వచ్చాయని ప్రశ్నించగా ఈ విషయం గురించి పార్వతీశం క్లారిటీ ఇచ్చారు.

Director Maruthi: డబ్బులు ఇవ్వలేదని మారుతి గారికి ఫోన్ చేస్తే.. ఆయన అలా మాట్లాడారు.. యాక్టర్ పార్వతీశం కామెంట్స్ వైరల్!

ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలలో ఒక్కరు కూడా పేమెంట్ ఎగ్గొట్ట లేదని మారుతి గారు కూడా ఎప్పుడూ తనని పేమెంట్ కోసం ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక మారుతి గారి ప్రొడక్షన్ లో చేసిన ఈ రెండు సినిమాలకు కూడా ఆయన కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చారని తెలిపారు. ఇక సార్ పేమెంట్ కావాలని అతనికి చిన్న మెసేజ్ చేస్తే చాలు గంటలో నా అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయని తెలిపారు.

ఎప్పుడు పేమెంట్ కోసం ఇబ్బంది పెట్టలేదు…

ఒకవేళ క్యాష్ కనుక ఉంటే ఆఫీస్ కి వెళ్లి తీసుకో అంటూ తనకు సమాధానం చెబుతారు కానీ ఆయన పేమెంట్ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక చోటా కె నాయుడు గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో మంచివారని ఆయన స్టైల్, ఆయన డిగ్నిటీ ఎంతో బాగుంటుందని ఈ సందర్భంగా నటుడు పార్వతీశం చోటా కె నాయుడు గురించి తెలిపారు.తను ఒకసారి ఎవరైనా ఇష్టపడితే ఎంతో ప్రేమగా చూసుకుంటారని అంత మంచి మనస్తత్వం అని పార్వతీశం ఈ సందర్భంగా చోటా కె నాయుడు గురించి తెలిపారు.

Youtuber Harsha: అంత ఖర్చు పెట్టి వీడియోస్ తీయడానికి కారణం.. నా భవిష్యత్ లక్ష్యం అదే.. : యూట్యూబర్ హర్ష సాయి

Youtuber Harsha: మనిషి పుట్టినప్పుడు ఖాళీ చేతులతో పుట్టడం పోయేటప్పుడు వెంట ఏది తీసుకోని పోమని, ఉన్నప్పుడే ఎంతో సంతోషంగా బతకాలి అంటూ అందరిలోనూ ఒక స్ఫూర్తిని నింపుతున్నారు యూట్యూబర్ హర్ష. ప్రస్తుతం ఎంతోమంది పేరుప్రఖ్యాతులు గాంచిన యూట్యూబర్స్ సరికొత్త వీడియోలను చేస్తూ వారికంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం అదేవిధంగా పెద్దఎత్తున డబ్బు సంపాదించుకోవడం కోసం కష్ట పడుతున్నారు.

Youtuber Harsha: నా భవిష్యత్ లక్ష్యం అదే.. రానున్న రోజుల్లో తాను చేయబోయే పని అదే: యూట్యూబర్ హర్ష

ఇలాంటి వారందరికీ తాను ఎంతో భిన్నమని చెప్పకనే చెప్పేస్తున్నారు యూట్యూబర్ హర్ష. మన సంపాదించిన మొత్తంలో పేదలకు ఖర్చు చేస్తూ ఎంతో తృప్తి పొందుతున్నారు. ఎవరైనా సహాయం కోసం అతనిని అడిగితే తప్పకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అయితే ఈయన సహాయం వందలు, వేలల్లో కాదండోయ్ లక్షల్లో కూడా ఉంటుంది.

Youtuber Harsha: నా భవిష్యత్ లక్ష్యం అదే.. రానున్న రోజుల్లో తాను చేయబోయే పని అదే: యూట్యూబర్ హర్ష

హర్ష ఎంతో డబ్బు ఖర్చు చేసి యూట్యూబ్ వీడియోలను చేస్తుంటారు. అయితే ఈయన చేసే ప్రతి ఒక్క వీడియోలోనూ ప్రజలకు సహాయం చేయాలనే తపన కనబడుతుంది. అందుకు అనుగుణంగానే ఇతని వీడియోలు కూడా ఉంటాయి.ఎంతో సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చిన ఈయన చిన్న చిన్న ఆటలు ఆడిస్తూ పేదవారిని ధనవంతులుగా చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడ్డారు.

వందల కుటుంబాలకు సహాయ సహకారాలు…

ఈ విధంగా ఇప్పటికే వందల కుటుంబాలకు సహాయం చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టిన హర్ష తన భవిష్యత్ ప్రణాళిక గురించి తెలిపారు. తనకు భవిష్యత్తులో మన దేశంలో ఉన్నటువంటి పేదవారిలో కనీసం 50 శాతం మందికి తాను సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఈ సందర్భంగా హర్ష తెలిపారు. త్వరలోనే తన యూట్యూబ్ ద్వారా మరికొంత మందికి సహాయం చేయబోతున్నట్లు ఆయన తెలియజేశారు.

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

Sri Reddy:వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా సంచలనం సృష్టించారు. ఈ వివాదంతో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి ప్రస్తుతం సినిమాలకు దూరమై యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈమె సినిమాల పరంగా రాజకీయ పరంగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను తెలియచేస్తూ ఉన్నారు.

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

ఇకపోతే రాజకీయంగా పవన్ కళ్యాణ్ పైతోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టే శ్రీ రెడ్డి జగన్ పార్టీకి ఎప్పుడూ మద్దతుగా ఉంటూ ఆయనపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తనదైన శైలిలో తిప్పికొడుతూ ఉంటుంది.ఇలా వైయస్సార్సీపి పార్టీకి మద్దతుగా నిలిచిన శ్రీ రెడ్డి తాజాగా పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఫేస్ బుక్ వీడియో ద్వారా ఈమె ఒక వీడియో షేర్ చేస్తూ పార్టీ వ్యవహారశైలి గురించి తెలియజేశారు.

Sri Reddy: జగనన్న పార్టీని నమ్ముకున్నా ఒరిగిందేమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

తాను ఇన్నిరోజులు పార్టీలో ఎంతో చురుగ్గా ఉంటూ జగన్ పార్టీకి మద్దతు తెలపడంతో తన అకౌంట్లో డబ్బులు పడతాయని చాలామంది భావిస్తారు నిజానికి వైయస్ఆర్సిపి పార్టీని నమ్ముకున్నందుకు తనకు రూపాయి ఆదాయం లేదని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలిపారు.అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని వచ్చే ఎన్నికలలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తే చిక్కుల్లోపడతారని సూచించారు.

గతంలో వచ్చిన సీట్ల కన్నా పది లేదా 20 సీట్లు తక్కువ వచ్చినా కానీ ప్రజలలో అసంతృప్తి ఉందని అర్థం. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారిని గుర్తించకుండా అర్హత లేని వారికి పదవులు కట్టబెడుతూ ప్రభుత్వం తప్పు చేస్తోందని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి వెల్లడించారు. ఇక పోతే తన సొంత ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి తన తండ్రితో పాటు ఈమె ఎంతో కష్టపడుతోంది. గత ప్రభుత్వం హయాంలో గుడి నిర్మాణానికి రావాల్సిన నిధులు వచ్చాయని అయితే ఈ ప్రభుత్వ హయాంలో గుడికి ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదని శ్రీరెడ్డి ఆరోపించారు.

పార్టీ వల్ల ఏ ప్రయోజనం లేదు..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కల నెరవేరబోతుందని ఎంతో సంతోషపడ్డాను అయితే ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిన, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిన గుడికి రావాల్సిన నిధులు మాత్రం రాలేదని, జగనన్న పార్టీని నమ్ముకున్నందుకు తనకు రూపాయి లాభం లేకపోయినా కనీసం తన గుడి నిర్మాణానికి డబ్బులు అందుతాయని భావించాను చివరికి అది కూడా నెరవేరలేదని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి వైయస్సార్ సీపీ పార్టీ గురించి కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ప్రభుత్వం గుడి నిర్మాణానికి కావలసిన నిధులను ఏర్పాటు చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Hero Nani: టిక్కెట్ల రేట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. వాళ్లంతా తెలివితక్కువ వాళ్లే!

Hero Nani: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాని మరోసారి టికెట్ రేట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈయన సినిమా టికెట్ల రేట్లు గురించి మాట్లాడుతూ థియేటర్ కలెక్షన్ కన్నా కిరాణాకొట్టు కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు.

Hero Nani: టిక్కెట్ల రేట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. వాళ్లంతా తెలివితక్కువ వాళ్లే!

ఈ విధంగా నాని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో వైసీపీ మంత్రులు సైతం నాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.అయితే తాను మాట్లాడిన మాటలను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

Hero Nani: టిక్కెట్ల రేట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. వాళ్లంతా తెలివితక్కువ వాళ్లే!

తాజాగా అంటే సుందరానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మరోసారి నాని సినిమా టికెట్లు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను విమర్శించే వారు అందరూ కూడా తెలివితక్కువ వాళ్లే. 20..40..60 రూపాయ‌ల టికెట్ ధ‌ర‌ల‌తో సినిమా ఇండ‌స్ట్రీ మ‌నుగ‌డ సాధించ‌లేద‌ని అన్నాను. అంతేకానీ తాను సినిమా టికెట్ల రేట్లను 500 రూపాయలు పెంచమని అడగలేదు. అది కూడా తప్పు అయితే ఇది కూడా తప్పే అంటూ ఈయన టికెట్ల రేట్లు గురించి మరోసారి స్పందించారు.

రాజకీయ పరిణామాలకు కారణం అవుతుందా….

ఈ క్రమంలోనే నాని సినిమా టికెట్ల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా జూన్ 10వ తేదీ విడుదల కావడంతో జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నిర్వహించనున్నారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరు కానున్నారని తెలియడంతో మరోసారి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేదికగా రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

Chiranjeevi:తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దవల సత్యం దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. ధవళ సత్యం దాసరి గారి జూనియర్ కావడంతో ఆయన సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఇద్దరూ కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాళ్లమని అనంతరం దాసరి సహాయంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

ఇకపోతే దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన శివరంజని సినిమా కోసం ధవళ సత్యం కో-డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఈ సినిమాకి నలుగురు హీరోలు ఆప్షన్ గా ఉన్నారు. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్, ఇంకొక హైదరాబాద్ చెందిన ఒక అబ్బాయి నలుగురు హీరోలు ఆప్షన్ గా ఉన్నారు. నా ఒపీనియన్ అయితే నేను శివరంజని సినిమా కోసం చిరంజీవిని తీసుకోవాలని దాసరి గారికి చూపించాను. ఇక పద్మజా వదిన సుధాకర్ పేరు ప్రస్తావించారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

ఇకపోతే హైదరాబాద్ నుంచి కొందరు రాజకీయ నాయకుల హరిప్రసాద్ ను హీరోగా తీసుకోవాలని ఫోన్లు చేసేవారు. ఇక ఈ విషయంలో బాగా ఆలోచించిన దాసరిగారు ఈ సినిమాకి హరి ప్రసాద్ ను ఫైనల్ చేశారు.అదేంటి అన్నయ్య అలా చేసావంటే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని విషయాలలో ఇలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. నువ్వు ఎలా చేస్తావో తెలియదు హరి ప్రసాద్ ని హీరోగా అద్భుతంగా చూపించాలి అంటూ దాసరి గారు చెప్పారు.

రాజకీయ నాయకుల ఒత్తిడే కారణం….

ఈ విధంగా శివరంజని సినిమా కోసం హీరోగా హరి ప్రసాద్ ను సెలెక్ట్ చేయగానే నేను బయటకు వెళ్లి పోయాను.అయితే బయట చిరంజీవి గారు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను కనబడితే నాకు చెప్పేసి వెళ్లిపోవాలని ఆయన ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయంలో నేను చిరంజీవి మొహం చూడలేకపోయానని ఈ సందర్భంగా దవళ సత్యం శివరంజని సినిమా సమయంలో జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదని హరిప్రసాద్ స్థానంలో చిరంజీవిని పెట్టి ఉంటే సినిమానే వేరే ఉండేది అంటూ ఆయన తెలిపారు. ఇకపోతే తాను డైరెక్టర్ అయిన తర్వాత జాతర సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవిని హీరోగా సెలెక్ట్ చేశానని, ఆ విషయంలో ఎవరు చెప్పినా వినకుండా చిరంజీవి హీరోగా పెట్టి జాతర సినిమా చేశానని తెలిపారు.