MS Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, దేవి పుత్రుడు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాయి.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ప్రొడక్షన్ బ్యానర్ లో, ఆయనే దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం 7 డేస్ 6 నైట్స్ .
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఒక మీడియాతో ముచ్చటించిన ఎమ్మెస్ రాజు ఇండస్ట్రీలో అగ్ర హీరోల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను స్టార్ హీరోలను ఏమాత్రం నమ్మనని కథను మాత్రమే నమ్ముతానని తెలిపారు. గతంలో రవితేజ, మహేష్, త్రివిక్రమ్, గుణశేఖర్ వంటి సెలబ్రిటీలు నాతో కలిసి సినిమా చేద్దాం అని అడిగారు.
ఈ విధంగా సినిమా చేయమని అడిగితే నిర్మొహమాటంగా చేయనని సమాధానం చెప్పానని ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు వెల్లడించారు. ఒట్టేసి చెబుతున్నా… ప్రభాస్,మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు నాతో సినిమా చేస్తామని డేట్స్ ఇచ్చిన కూడా నేను వారితో సినిమా చేయను. కేవలం స్టార్ హీరోలని నమ్ముకుని నేను సినిమా చేయనని కథకు ప్రాధాన్యత ఇచ్చి కథ బాగుంటేనే సినిమా చేస్తానని తెలిపారు.
నిజం చెప్పాలంటే తాను అగ్రహీరోలతో చేసిన సినిమాలకన్నా కథను నమ్ముకుని చేసిన మనసంతా నువ్వే సినిమాతో తనకు ఎక్కువగా లాభాలు వచ్చాయని,ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు నాకు నచ్చిన సినిమాలను మాత్రమే నేను చేస్తాను తప్ప హీరోలని చూసి సినిమా చేయనని ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…