Tag Archives: cost

Chiranjeevi: వామ్మో చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర అన్ని లక్షలా.. చూడటానికి సింపుల్ గానే ఉందే!

Chiranjeevi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు వస్తువులన్నీ కూడా చాలా ఖరీదైనవి అయ్యి ఉంటాయి. వాళ్లు వేసుకుని షూ నుంచి మొదలుకొని తిరిగే కార్లు ఉండే ఇల్లు వరకు చాలా ఖరీదైనవే ఉంటాయి. ఇక సెలబ్రిటీలు ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు స్పెషల్ గా కనిపిస్తే వారి చెప్పుల నుంచి మొదలుకొని డ్రెస్ వాచ్ ధరల గురించి పెద్ద ఎత్తున అభిమానులు సెర్చ్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి వాచ్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. ఈ వేడుకకు చిరంజీవి చాలా సింపుల్ లుక్ లో కనిపించారు.

ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవి చాలా సింపుల్ గా వచ్చినప్పటికీ ఈయన చేతి వాచ్ మాత్రం అందరిని ఆకర్షించింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేతికి కట్టుకున్నటువంటి వాచ్ ఖరీదు ఎంత అసలు అది ఏ బ్రాండ్ కు సంబంధించినది అనే విషయాల గురించి అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

అరకోటి రూపాయలు..
ఈ కార్యక్రమంలో చిరంజీవి చేతికి కట్టుకున్నటువంటి వాచ్ ఏ లాంజ్ అండ్ స్నోహే అనే బ్రిటిష్ కంపెనీకి సంబంధించినటువంటి వాచ్ ధరించారు అయితే ఈ వాచ్ ధర ఏకంగా 50,56,747 రూపాయలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాదాపు అరకోటి రూపాయలు ఖర్చు చేసి ఈ వాచ్ ను కొనుగోలు చేశారనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక సామాన్య ప్రజలకు ఇది చాలా పెద్ద విషయమైనప్పటికీ సెలెబ్రెటీలకు మాత్రం ఇది చాలా సింపుల్ విషయాలు అని చెప్పాలి.

అనుష్క చెప్పుల ఖరీదు తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే !!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినా అది వైరల్ గా మారుతుంది. అనుష్క శర్మ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ లందరూ ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో మూడున్నర నెలల పాటు సుదీర్ఘ పర్యటన చేయబోతున్న ఈ నేపథ్యంలో క్రికెటర్లు తమ వెంట వారి కుటుంబాన్ని తీసుకురావడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వంతో పాటు బీసీసీఐ అనుమతి తెలిపింది.

ఈ క్రమంలోనే క్రికెటర్లు అందరూ తమ కుటుంబంతో సహా ఇంగ్లాండ్ చేరుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లీ తోపాటు భార్య అనుష్కశర్మ ,కూతురు వామికా కూడా ఉన్నారు. ఇంగ్లాండ్ లో ఒక హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న కోహ్లీ కుటుంబం తాజాగా శనివారం సాయంత్రం అనుష్క హోటల్ గది నుంచి బయటకు వచ్చి రోజ్ బౌల్ స్టేడియం బాల్కనీలో నిల్చొని దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అనుష్క శర్మ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజనులకు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నచ్చగా మరికొందరు చూపు మాత్రం ఆమె వేసుకున్న చెప్పుల పై పడింది.అనుష్క శర్మ కొత్త రకం గూచీ చెప్పల్ వేసుకొని కనిపించింది. చెప్పులపై గూచీ లోగోతో పాటు పూల్ సైడ్ ధరించే మోడల్‌లా తీర్చి దిద్దారు.అనుష్క ఈ విధమైనటువంటి చెప్పులు ధరించడంతో నెటిజన్లు చెప్పులు ధర ఎంత ఉంటుంది అన్న వేటలో పడి వేతకసాగారు.

ఈ క్రమంలోనే అనుష్క వేసుకున్న చెప్పుల ధర ఏకంగా రూ. 31,892 అంటా. ఇంత ఖరీదైన చెప్పులు వేసుకోవడంతో నెటిజన్లు ఆ డబ్బులతో మనం ఎన్ని జతల చెప్పులు కొనుక్కోవచ్ఛో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనుష్క షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.