Tag Archives: Covid vaccine

Covid Vaccine: భారత్ బయోటెక్ చుక్కల మందు టీకాకు డీసీజీఐ ఆమోదం..!

Covid Vaccine:దాదాపుగా గత రెండు సంవత్సరాల నుండి ప్రపంచ దేశాలు అన్నింటినీ ఇబ్బంది పెడుతున్న సమస్య కరోనా వైరస్. దీని ప్రభావం తగ్గుతుందనే లోపు ఏవో ఒక వేరియంట్లో రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఇప్పుడు మూడవ వేవ్ లో ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతోంది. అయితే రెండవ వేవ్ లో డెల్టా వేరియంట్ చేసిన నష్టాన్ని ఇప్పుడైతే ఇది చేయట్లేదు. మరణాల రేటు చాలా తక్కువగా నమోదు అవుతుంది.

ఇది ఒక రకంగా ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ వల్లనే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ల సంఖ్య 150 కోట్లు దాటింది. అయితే ఇప్పుడు హెల్త్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు, ఇంకా దరఖాస్తు చేసుకున్న వారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. దీనిని కరోనా ప్రికాషనరి డోస్ అని కూడా అంటారు.

ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న వేల భారత్ బయోటెక్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ 3 వారాల క్రితం బూస్టర్ డోస్ లాగా ఉపయోగపడే చుక్కల మందును అప్రూవల్ కోసం అప్లై చేయడం జరిగింది. భారత్ బయోటెక్ కనిపెట్టిన చుక్కల ముందుకు క్లినికల్ ట్రయల్స్ చేసుకునేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నారు.

బూస్టర్ డోస్ లో భాగంగా చుక్కల మందు..

ఈ ట్రయల్స్ ను దాదాపుగా 900 మంది మీద ప్రయోగించనున్నారు. ఫేస్ 3 బూస్టర్ డోస్ లో భాగంగా DCGI నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. ఈ అనుమతులు పొందిన రెండవ కంపెనీ ఇదే కావడం విశేషం. ఇదివరకే రెండు డోసుల కోవాక్సిన్ లేదా కోవిషిల్డ్ తీసుకున్న వారికి ఈ చుక్కల మందు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత్ బయోటెక్ వివరించింది. ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా త్వరగా ట్రయల్స్ జరిపి ఈ చుక్కల మందులను త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని భారత్ బయోటెక్ సంస్థ ఆలోచన.

కోవిడ్‌ టీకా గర్భధారణపై ప్రభావం చూపుతుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

కరోనా నుంచి తమకు తాను రక్షించుకోవాలటే వ్యాక్సిన్ ఒకటే మార్గం. అయితే టీకా తీసుకుంటే సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తుందా.. గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుందా.. గర్భధారణ అంశంలో సమస్యలు వస్తాయా.. వంటి సందేహాలు అనేక మందికి కలుగుతున్నాయి. అయితే ఇవి నిజం కాదని.. వాటి వల్ల ఎలాంటి హాని కలగదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వల్ల గర్భధారణపై ఎలాంటి ప్రభావం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ప్రభావం కనిపించలేదని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైందని చెప్పారు. ఆ అధ్యయనంలో భాగంగా ఒకే సంఖ్యలో రెండు వేర్వేరు బృందాలకు టీకాలను, డమ్మీ టీకాలను ఇచ్చారు. వ్యాక్సిన్‌ తీసుకోని బృందంలోని మహిళలతో సమానంగా తీసుకున్న బృందంలోని మహిళలు గర్భం దాల్చారని తేల్చారు.

టీకా తీసుకుంటే.. స్వల్పకాలం రుతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నాయన్న నివేదికలపై పరిశోధకులు దృష్టి సారించారు. సంతాన సౌభాగ్యంపై టీకాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని యేల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, గైనకాలజిస్టు డాక్టర్‌ మేరీ జేన్‌ మిన్‌కిన్‌ అన్నారు. కరోనా వ్యాక్సిన్ అనేది మామూలు వాళ్ల కంటే గర్భవతులు తీసుకోవడం చాలా మందచిదని.. ఎందుకంటే.. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భవతుల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని.. ఆక్సిజన్ అవసరం కూడా ఎక్కువగా ఏర్పడుతుందని
సీడీసీ నిపుణులు పేర్కొంటున్నారు.

అందుకే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు ధైర్యంగా టీకాలు వేసుకోవచ్చిన ఇమోరి యూనివర్సిటీ గైనకాలజీ శాఖ చీఫ్‌, డాక్టర్‌ డెనిస్‌ జేమిసన్‌ స్పష్టం చేశారు. ఆలస్యం అసలు చేయవద్దని సూచించారు.

వ్యాక్సిన్ తీసుకున్నారా.. అయితే ఈ బంపర్ ఆఫర్లు మీకోసమే..

కరోనా నుంచి మనకు మనం రక్షించుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అంటూ వైద్య నిపుణులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. దానినే ప్రపంచంలోనే అన్ని దేశాలో ప్రగాఢంగా విశ్వ‌సిస్తున్నాయి కూడా. దీంతో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా దేశాలు 50 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నాయి. మరిన్ని దేశాల్లో మందకొడిగా సాగుతోంది. అయితే, అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ప్ర‌జ‌లు ముందుకు రావ‌డంలేదు.

దీంతో అక్క‌డి ప్ర‌భుత్వాలు వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలను ప్రొత్సహించేందుకు కొత్త స్కీమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. బ్రిట‌న్‌లో ఇప్పుడు ఇదే చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాపింగ్ వోచ‌ర్లు, పిజ్జా డిస్కౌంట్‌లు, ప్ర‌యాణాల్లో రాయితీల పేరుతో వ్యాక్సిన్ వోచర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఇప్పటికే అనేక రైడ్‌-హెయిలింగ్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌లు టీకా తీసుకున్న వారికి ప్రయాణ, భోజన రాయితీలు కల్పిస్తున్నాయి.

బ్రిట‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వ్యాక్సిన్ వోచ‌ర్స్ లో ఉబెర్‌, బోల్ట్, డెలివెరూ, పిజ్జా పిలిగ్రిమ్స్ సంస్థ‌లు భాగ‌స్వాములుగా ఉన్నాయి. అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ఇలాంటి ప‌థ‌కాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ప్ర‌భుత్వం ఆశాభావం వ్య‌క్తం చేస్తుంది. ఇప్పటికే పలు కంపెనీలు, ఫుడ్ డెలివరీ యాప్ లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నాయి.

వినియోగదారులకు వివిధ రాయితీలు ప్రకటిండచమే కాకుండా వారు మొదటి, రెండో డోసు టీకా వేసుకునేందుకు తమ వంతుగా సహాయపడతామని పిజ్జా పిలిగ్రిమ్స్‌ వ్యవస్థాపకుడు థామ్‌ ఇలియట్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ప్ర‌భుత్వం కూడా ఈ విధానం ప్ర‌వేశ పెట్ట‌డంతో మ‌రికొంత వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ది. తప్పకుండా ఈ ప‌థ‌కం వినియోగ‌దారుల‌కు చేరువ అవుతుందని ఆయా సంస్థ‌లు చెబుతున్నాయి.

టీకా వేసుకోలేదా..? అయితే జీతాలు కట్!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడం కోసం మన ముందున్న ఒకే ఒక మార్గం వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా బారిన పడినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం ఉండదని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.సాధారణ ప్రజలను అలా ఉంచితే ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదని, ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కీలక నిర్ణయాన్ని పాకిస్తాన్ లోని సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్అలీ షా ఉపక్రమించారు.

రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉంటారో అలాంటి వారికి వచ్చే నెల నుంచి జీతాలు కట్ చేయనున్నట్లు మురాద్అలీ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలలో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులు వెనకడుగు వేయడంతో ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సింధ్ ప్రావిన్సుల కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనే సీఎం ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రధాన కార్యదర్శి, వైద్య నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా ప్రభుత్వ ఉద్యోగులు టీకా వేయించుకోవడానికి ఒక నెల సమయం ఇచ్చారు. ఈ లోగ వ్యాక్సిన్ వేయించుకోకపోతే వారికి జీతాలు కట్ చేయాల్సిందిగా ఆర్థిక శాఖకి ఆదేశాలు జారీ చేసింది.

జూన్ 7వ తేదీ నుంచి పాఠశాలలో తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ 5వ తేదీలోగా ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సింధ్ సర్కారు ఆదేశించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,550,553 మందికి టీకా వేయగా.. 4,29,000 మంది రెండు డోసుల వేయించుకున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగించడం కోసం అదనంగా మూడు వందల వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు,అదేవిధంగా ఒక్కో తాలూకాకు 5 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రెండు నెలలో 25 కోట్ల వ్యాక్సిన్లు టార్గెట్: కేంద్రం?

ప్రస్తుతం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం అన్ని దేశాలు శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించి కరోనాను కట్టడి చేస్తున్నాయి. కానీ మన దేశంలో జనాభా అధికంగా ఉండి, వ్యాక్సిన్లు కొరత తక్కువగా ఉండటం చేత వాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. ఈ క్రమంలోనే రెండవదశ భారతదేశంపై పంజా విసిరి ఎంతో మందిని బలితీసుకుంది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 45 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జూలై చివరి నాటికి దేశ వ్యాప్తంగా 20 నుంచి 25 కోట్ల వ్యాక్సిన్లు పొందేలా టార్గెట్ పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఆగస్ట్-సెప్టెంబర్ సమయంలో… అదనంగా మరో 30 కోట్ల వ్యాక్సిన్లను పొందాలనేది కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మే నెలలో కేంద్ర ప్రభుత్వం 7.9 కోట్ల వ్యాక్సిన్ ను సప్లై చేసింది. ఈ క్రమంలోనే జూన్ నెలలో 6.09 కోట్ల వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇండియాలో జనవరి నుంచి మే వరకూ… 5 నెలల్లో 21కోట్ల 31లక్షల 54వేల 129మందికే వ్యాక్సిన్ వేశారు. ఈ క్రమంలోనే కరోనా రెండవ తీవ్రత దేశవ్యాప్తంగా విజృంభించి సృష్టించింది.ప్రస్తుతం పరిస్థితులు కాస్త చెక్కబడి ఉన్న నవంబర్ నెలలో థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ వ్యాప్తిచెందే లోపు దేశవ్యాప్తంగా 70 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ పూర్తి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గడిచిన 5 నెలల్లో 21కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే… నెక్ట్స్… 5 నెలల్లో 70 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే పెద్ద సవాల్ అని చెప్పవచ్చు.అంచనా వేసినట్లు 2 నెలల్లో 25 కోట్ల వ్యాక్సిన్లు,ఆ తర్వాత 2 నెలల్లో 30 కోట్ల వ్యాక్సిన్లు పొందగలిగితే… 4 నెలల్లో 55 కోట్ల వ్యాక్సిన్లు పొందినట్లవుతుంది. ఈ విధంగా దేశం మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మనదేశంలో థర్డ్ వేవ్ బలహీనంగా మారుతుందని, లేకపోతే మరొక ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ అందుకున్న వ్యక్తి మృతి.. కాకపోతే?

ప్రస్తుతం యావత్ భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం మన ముందున్న మార్గం వ్యాక్సిన్ మాత్రమే. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా కరోనా బారిన పడినప్పటికీ మన పై అధిక ప్రభావం చూపుదని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోని వ్యాక్సిన్ పై అధికారులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

అయితే ఈ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా వ్యాక్సింగ్ చేయించుకున్న 81 సంవత్సరాల విలియం షేక్స్‌పియర్‌  అనే వృద్దుడు మృత్యువాత పడ్డాడు. అయితే అతను కరోనా బారిన పడి మృతి చెందాడా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది.81 సంవత్సరాల విలియం షేక్ స్పియర్ గత ఏడాది డిసెంబర్ నెలలో వార్‌విక్‌షైర్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌లో కావెంటర్రీలో తొలి ప్ఫిజెర్ – బయోటెక్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ వేయించుకున్న విలియం గత గురువారం మృతిచెందినట్లు అతని సన్నిహితులు తెలియజేశారు. ఏ ఆసుపత్రిలో అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారో అదే ఆస్పత్రిలో విలియం మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే విలియం కరోనా బారినపడి మృతి చెందడం లేదని.. అతను గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ప్రపంచంలోని తొలిసారిగా పురుషులలో విలియం షేక్స్పియర్ కరోనా వ్యాక్సిన్ తీసుకోగా.. మహిళలలో మొట్ట మొదటి వాక్సిన్ మార్గరేట్‌ కీనన్‌ అనే 91 సంవత్సరాల మహిళ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ క్రమంలోనే తొలి వేయించుకున్న వారిగా విలియం, మార్గరేట్‌ కీనన్‌ గుర్తింపును పొందారు.

వ్యాక్సిన్ కొనడంలో కేంద్రం తప్పు చేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన టాప్ వైరాలిజిస్ట్..?

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. వ్యాక్సిన్ కొనుగోలు, వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కేంద్ర ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యం వల్లనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమైందని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వ్యాక్సినేషన్ కొనుగోలు విషయంలో ఎంతో ఆలస్యం చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలు ఒక ఏడాదికి సరిపడా వ్యాఖ్యలను కొనుగోలు చేసింది. ఇలాంటి సమయంలో మనం వెళ్లి వ్యాక్సిన్ కొనుగోలు చేయాలన్న మార్కెట్ లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపించి ఉంది. మరికొద్ది రోజుల్లో మూడవ దశ కూడా వ్యాపించి ఉందని అధికారులు హెచ్చరిస్తున్న సమయంలో పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రయత్నిస్తున్నాయి.అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొరత తీవ్రంగా ఉండటంతో పలు రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ కేంద్రాలు మూత పడ్డాయి. అమెరికా వంటి దేశాలు వ్యాక్సిన్ కోసం గత ఏడాది మార్చి లోని 10 బిలియన్ డాలర్లు కేటాయించింది. కానీ, భారత్ మాత్రం వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయక పోవడమే కాకుండా వ్యాక్సిన్ కొనుగోలు చేయలేకపోయింది.

అమెరికా ఐరోపా వంటి దేశాలు నవంబర్ నెలలోనే సుమారు 700 మిలియన్ డోస్ ల వ్యాక్సిన్ లను ముందుగా ఆర్డర్ చేశాయి. అయితే అప్పటికి భారత దేశంలో ఇంకా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతూ ఉన్నాయి. భారత దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే భారతదేశంలో లభిస్తున్న టువంటి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ 11 మిలియన్ డోస్‌లు, భారత్ బయోటెక్ 5.5 మిలియన్ డోస్‌లు తొలి దశలో సరఫరా చేశాయి. ఇప్పటికైనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పెద్ద మొత్తంలో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలియజేశారు.

గర్భంతో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుంది.. బిడ్డకు ప్రమాదమా?

ప్రపంచవ్యాప్తంగా ఏడాదిన్నర పాటు అన్ని దేశాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి మార్కెట్లోకి వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ 45 సంవత్సరాలు పైబడిన వారికి, ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇవ్వడం జరిగింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు పైబడిన వారి అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి.అయితే గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

వ్యాక్సిన్ కనుగొన్న సమయంలో అన్ని వయసుల వారి పై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. కానీ గర్భిణీ స్త్రీలలో మాత్రం ట్రయల్స్ నిర్వహించలేదు కనక ఈ వ్యాక్సిన్ ప్రభావం గర్భం దాల్చిన మహిళలు, కడుపులో బిడ్డ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ, కరోనా బారిన పడినప్పుడు కలిగే దుష్ప్రభావాలు కన్నా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కలిగే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తేలికపాటి దుష్ప్రభావాలు కలుగుతాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు సర్వసాధారణం. వ్యాక్సిన్ తీసుకోవటంవల్ల మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ యాంటీ బాడీస్ పిండంలో కూడా పెరగడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.

మొదటి దశ పోలిస్తే రెండవ దశలో ఎక్కువ భాగము గర్భిణీ స్త్రీలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ వైరస్ ను ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించిందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే సీడీసీ, ఎఫ్‌డీఏ, ఏ సీఓజీ, ఆర్‌సీఓజీ, ఎఫ్‌ఓజీఎస్‌ఐ వంటి సంస్థలు గర్భందాల్చిన మహిళలు కూడా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడం మంచిదని సూచనలు ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కూడా మాస్కు ధరించి, తరచూ చేతులు శుభ్రంగా కడగడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తల ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఆ దేశంలో ఫైజర్ టీకా తీసుకున్న వారికి గుండెల్లో మంట.. ఎందుకంటే?

ప్రస్తుతం కరోనా మహమ్మారిను అరికట్టడం కోసం ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ప్రక్రియలో ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా ఇజ్రాయిల్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాది డిసెంబర్ 19న ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఏప్రిల్ 20 నాటికి 65 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది.

ఇజ్రాయిల్ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జాబితాలో ఇజ్రాయేల్ టాప్‌లో ఉంది. అయితే, ఫైజర్- బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆ దేశం వినియోగిస్తున్నారు. ఈ టీకా వేయించుకోవడం వల్ల పలువురి గుండెల్లో మంట, కండరాల వాపు వంటి సమస్యలు తలెత్తడంతో ఈ కేసులపై ఇజ్రాయిల్ ఆరోగ్య అధికారులు పరిశోధనలు జరిపినట్లు కరోనా కమిషనర్ నచ్‌మన్ యాష్ వెల్లడించారు.

టీకా వేసుకున్న వారిలో దాదాపు 62 మందిలో ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తాయని, తాజాగా మరో 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు.30 సంవత్సరాలు ఉన్న వారిలో ప్రతి 20 వేల మందిలో ఒకరికి ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇద్దరు మృత్యువాత పడినట్లు తెలిపారు.

టీకా ప్రయోజనం చాలా గొప్పదిగా కనిపిస్తోంది. కొన్ని కేసులలో టీకాతో సంబంధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం సమర్ధనీయం కాదు’’ అని యాష్ తెలిపారు. ఇదే విషయం గురించి ఫైజర్ కంపెనీకు సమాచారం అందించగా వారు ఈ విషయంపై స్పందించి వ్యాక్సిన్ వల్ల కండరాలు నొప్పులు రావడం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు.

ఫైజర్ టీకా వల్ల సాధారణ జనాభాలో ఊహించిన దానికంటే ఎక్కువగా మయోకార్డియల్ రేటును గమనించలేదు. వ్యాక్సిన్ కు మయోకార్డియల్ రేటుకు ఏమాత్రం సంబంధం లేదని,వ్యాక్సిన్ వల్లే ఈ విధమైనటువంటి సమస్య ఏర్పడిందని చెప్పడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవని ఫైజర్ పేర్కొంది.