Tag Archives: crime news

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు..! భర్త, అత్తామామలు ఇచ్చిన బహుమానం ఇది..!

Crime News: పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది ఆ మహిళ. మొదట్లో భర్త, అత్తామామలు బాగానే చూసుకున్నా.. తర్వాత వారి వక్రబుద్ది బయటపడింది. అదనపు కట్నం తేవాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె ఆ వేధింపులకు తట్టుకోలేక తనవు చాలించింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో దొర్ల శోభ–వెంకట్‌ రెడ్డిలు దంపతులు. వీళ్లకు 28 ఏళ్ల ప్రవళిక అనే కుమార్తె ఉంది. ఆమె అదే గ్రామానికి చెందిన చామకూర మహేష్ ను ప్రేమించింది. మొదట వీరి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో.. పోరాడి ప్రేమను సాధించుకొని వివాహం చేసుకున్నారు.

ఐదేళ్ల క్రితం అతడికి అమ్మాయి తరఫు తల్లిదండ్రలు కట్న కానుకలు కూడా బాగానే ఇచ్చారు. వారిద్దరు ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవడంతో.. లాంఛనాలతో అన్ని అబ్బాయికి ఇవ్వాల్సినవి ఇచ్చారు.

పుట్టింటికి వచ్చిన ప్రవళిక తెల్లవారుజామున ..


బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి కూడా ఇచ్చారు. మొదట వీరి కాపురం ఎలాంటి ఆటంకాలు.. మనస్పర్థలు లేకుండా సాగింది. అయితే మహేష్ మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తుండేవాడు. తర్వాత అతడి ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి అతడు ఇంటి వద్దనే ఉంటున్నాడు.
అయితే అప్పటి నుంచి ఆమెను అదనపు కట్నం తీసుకురావాలని అటు భర్తతో పాటు.. అత్తమామలు వేధించడం సాగించారు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆరు నెలల క్రితం రూ.4లక్షలను అదనపు కట్నం కింద ముట్టజెప్పారు. అయినా ఆ దుర్మార్గుడికి ఆశ చావలేదు. ఇంకా కావాలని బలవంతం చేయడంతో.. భరించలేకపోయింది. పుట్టింటికి వచ్చిన ప్రవళిక తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను ఓ సూసైడ్ నోట్ రాసింది. అందులో ఏముందంటే.. తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని.. అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారని, తనకు న్యాయం జరగాలని, ‘అమ్మా నాన్న మిస్‌ యూ అంటూ’ ఆమె సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇక దీనిపై ఆ వివాహిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

Crime News: ఇంత దారుణమా..! భర్త లైంగిక దాడి.. భార్య వీడియో చిత్రీకరణ..!

Crime News: దేశంలో లైంగిక దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. తెలిసిన వారే మహిళలు, చిన్నారుల జీవితాన్ని చిదిమేస్తున్నారు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల తీరు మారడం లేదు. ఇదిలా ఉంటే విజయవాడలో జరిగిన అత్యాచార ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.

Crime News: ఇంత దారుణమా..! భర్త లైంగిక దాడి.. భార్య వీడియో చిత్రీకరణ..!

భర్త వేరే వారితో అక్రమసంబంధం కొనసాగిస్తే ఓర్చుకోలేని భార్య… ఈ ఘటనలో భర్తకు సహరించింది. ఏకంగా భర్త అత్యాచారం చేస్తుంటే వీడియో తీసింది. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలన కలిగించింది.

Crime News: ఇంత దారుణమా..! భర్త లైంగిక దాడి.. భార్య వీడియో చిత్రీకరణ..!

వివరాల్లోకి వెళితే.. విజయవాడలో ఈ అత్యాచార దారుణం చోటుచేసుకుంది. మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా.. వీడియో తీసి బెదిరంచాడు. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు. దీనంతటికి నిందితుడి భార్య కూడా సహకరించింది.


ఇలాగే బలవంతంగా మహిళపై ..

విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (25) భర్త, పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. అయితే సదరు మహిళ ఇంటి ముందు దిలీప్, తులసి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే దిలీప్ కన్ను సదరు మహిళపై పడింది. ఆమెను ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ వేశాడు. ఈ నెల8 తేదీన రాత్రి దిలీప్, తులసి మహిళ ఇంటికి వెళ్లి బలవంతంగా లాక్కొచ్చారు. దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను తులసి వీడియో తీసి భర్తకు సహకరించింది. మరో రెండు మూడు రోజుల పాటు ఇలాగే బలవంతంగా మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. చివరకు అత్యాచారం వీడియోను అడ్డం పెట్టుకుని తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ.. బెదిరించాడు. తన జీవితాన్ని నాశనం చేయవద్దని ఎంత వేడుకున్నా.. దిలీప్ వినలేదు. దీంతో ఏం చేయాలో తెలియక..చివరకు పోలీసులను ఆశ్రియంచింది. చివరకు దిలీప్, తులసిలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో ఇంతటి దారుణం జరగడంతో అంతటా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరతున్నాయి.

Crime News: పుట్టిన రోజు వేడుకల్లో భర్త స్నేహితులు.. భార్యపై కన్నేసిన కామాంధులు..! తర్వాత ఏమైందంటే..?

Crime News: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా.. కామాంధుల తీరు మారడం లేదు. నిర్భయ, ఫోక్సో, దిశ వంటి చట్టాలు తీసుకువచ్చినా… దేశంలో ఎక్కడో ఓ చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారానికి పాల్పడిన దుండగుల్లో మనకు ఏం కాదనే భావన ఉండటంతోనే ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు. 

Crime News: పుట్టిన రోజు వేడుకల్లో భర్త స్నేహితులు.. భార్యపై కన్నేసిన కామాంధులు..! తర్వాత ఏమైందంటే..?

వావీవరస, చిన్న పెద్దా, ఆడ మగ అన్న తేడాలు లేకుండా.. దారుణాలకు ఒడిగడుతున్నారు. ముఖ్యంగా తెలిసిన వారి నుంచే ఎక్కువగా లైంగిక దాడులకు గురవ్వడం కలవరాన్ని కలిగిస్తోంది. తాజాగా పూణేలో జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం కలిగించింది. భర్తతో వెళ్లిన భార్యను భర్త స్నేహితులే సామూహిక అత్యాచారం చేశారు.

Crime News: పుట్టిన రోజు వేడుకల్లో భర్త స్నేహితులు.. భార్యపై కన్నేసిన కామాంధులు..! తర్వాత ఏమైందంటే..?

వివరాల్లోకి వెళితే భర్త బర్త్ డే పార్టీని జరుపుకునేందుకు వెళ్లిన భార్య ఈ దారుణానికి బాధితురాలుగా మారింది. పుణేలో భర్త బర్త్ డే రోజు ఏకాంతం కోసం భార్యభర్తలు ఓ హోటల్ కి వెళ్లారు. ఇదే సమయంలో మాయమాటలు చెప్పిన భర్త స్నేహితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లిన కామాంధుడు ..

భర్త హోటళ్లో ఎంక్వయిరీకి వెళ్లిన సందర్భంలో.. అతని స్నేహితులు బాధితురాలి దగ్గరికి వచ్చి మీ సోదరుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని మాయమాటలు చెప్పారు. ఇది నమ్మిన ఆమె అతనితో మోటర్ సైకిల్ పై బయటకు వెళ్లింది. నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లిన కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత అతనితో వచ్చిన వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఐదుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ దురాగతానికి పాల్పడ్డ వ్యక్తులను పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు.

Crime News : ఆరు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి… ఒంటిపై పంటిగాట్లు గుర్తించి !

Crime News : కాలం గడుస్తున్న కొద్దీ మహిళలు, ఆడపిల్లలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. కౌమార దశలో ఉండే పదమూడు సంవత్సరాల మైనర్ బాలిక శారీరంగా వచ్చే మార్పులు ఆమెను ఓ దారుణానికి వాడుకున్నాయి. తాను ఏం చేస్తున్నానో తెలియని చిన్న వయస్సు ఒకవేళ తెలిసినా.. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చేసుకోని వయస్సులో ఉంది ఆ చిన్నారి. అయితే ఓ కామ పిశాచికి ఇవే అనుకూలంగా మారాయి.

minor girl sexually attacked from past six months in hyderabad

ఆ చిన్నారీలో వచ్చే శారీరక మార్పులకు తీయని మాటలు చెప్పి తనకు కావాల్సిందేదో తీసుకునేందుకు శతవిధాల ప్రయాత్నాలు చేశాడు. వాడి ప్రయత్నాలకు ఆ బాలిక లొంగిపోయింది. తనకు కావల్సిన విధంగా ప్రవర్తించింది. దీంతో ఆమెను శారీరంగా వాడుకున్నాడు. అదే క్రమంలో శరీరంపై కొరికాడు… కాని ఆ పంటిగాట్లు వాడి పైశాచికత్వాన్ని బయటపెట్టాయి. రెండు రోజుల క్రితం బాలిక ఒంటిమీద పంటిగాట్లను చూసిన తల్లి ఏమైందని అడిగారు. దీంతో జరిగిన విషయాన్ని ఆ బాలిక పూసగుచ్చినట్టు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.

minor girl sexually attacked from past six months in hyderabad

జహిరాబాద్‌కు చెందిన మహ్మద్ మోహిజ్‌కు 20 సంవత్సరాలు. అతను నగరంలోని ఎమ్‌ఎస్ మక్తాలోని తన సోదరీ నివాసంలో ఉంటూ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నాడు. అయితే వారు ఉండే ఇంటిలోనే మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక ఉండడంతో మోహిజ్ ఆ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమెను బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి లైంగిక చర్యకు పాల్పడుతున్నాడు.

ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందంటే ?

ఇలా ఆరు నెలలుగా తన వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఇటివల ఆ బాలిక శరీరంపై పంటి గాట్లు ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఏం జరిగిందని నిలదీయడంతో ఆసలు విషయం చెప్పింది. దీంతో మోహిజ్ చేసిన దురాగతంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆతర్వాత స్థానిక పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Murder Attempt : అనంతపురంలో మళ్ళీ భగ్గుమన్న పాత కక్షలు… కాపుకాసి దాడి చేసిన ప్రత్యర్ధులు !

Murder Attempt : రాయలసీమలో పాత కక్షలు మళ్ళీ భగ్గుమన్నాయి. అనంతపురం జిల్లా లోని బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన వెంకట రమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డి లను టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు.

faction rivalries again raised in anathapuram district

అయితే ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి హత్యకు ప్రతీకారంగా అతని కుమారుడు నాగలింగేశ్వర్‌ రెడ్డి, అనుచరుడు పవన్‌కుమార్‌రెడ్డి ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గతంలో మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి, వెంకటరమణారెడ్డి మధ్య రస్తా విషయంలో గొడవ జరిగింది. దీంతో సోమిరెడ్డిపై వెంకట రమణారెడ్డి, అతని కుమారులు పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌ రెడ్డి మొద్దుతో దాడి చేశారు. ఆ దాడిలో సోమిరెడ్డి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

faction rivalries again raised in anathapuram district

దీంతో వెంకటరమణారెడ్డి, అతని కుమారులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వీరి కుటుంబాల మధ్య కక్షలు కొనసాగుతున్నాయి. సోమిరెడ్డి హత్య కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు వెంకటరమణారెడ్డి , పెద్ద కుమారుడు పుల్లారెడ్డి, రెండో కుమారుడు గరుడ శేఖర్‌ రెడ్డి పల్సర్‌ బైక్‌ పై సోమవారం ఉదయం 9.30 గంటలకు రేగడికొత్తూరు నుంచి అనంతపురం కోర్టుకు బయలుదేరారు.

అదును చూసుకొని ప్రత్యర్థులపై దాడి…

విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు పామురాయి – సోములదొడ్డి మధ్య పెద్దమ్మ ఆలయ సమీపంలో బైక్‌ను వెనుక నుంచి టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ గాల్లోకి ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పుల్లారెడ్డి, గరుడ శేఖర్‌రెడ్డి అపస్మారకస్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు బెంగళూరుకు రెఫర్‌ చేశారు. అయితే సఫారీ తో గుద్దిన వాహనాన్ని నాగలింగేశ్వర్‌ రెడ్డి ఇటీవల ఉరవకొండకు చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పై తగిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

Crime News: సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా చికెన్, మటన్ , చేపలు ఇలా తెచ్చుకొని ఇంటిల్లిపాది తింటారు. అయితే కొన్ని పల్లెటూర్లలో ఒక నలుగురు.. ఐదుగురు కలిసి.. ఒక గొర్రెను కొనుక్కొని.. దానిని కోసుకొని.. భాగాలు వేసుకొని.. తీసుకుంటారు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

ఇలా ఆ గ్రామంలో ఆ గ్రామస్తులంతా పొట్టేలును కొనుక్కొని దానిని ఎల్లమ్మ గుడి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ దానికి మొక్కలు చెల్లించుకొని.. అమ్మారికి ఆ పొట్టేలును బలి ఇచ్చేందుకు అన్నీ రెడీ చెసేశారు. ఇక బలి కార్యక్రమంలో అతడు పొట్టేలును నరకబోయి.. పక్కనే ఓ వ్యక్తి తలను నరికేశాడు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

ఆ యువకుడు అక్కిడిక్కడే గిలగిల కొట్టుకొని చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే.. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని వలసపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి పశువుల పండుగ నిర్వహించారు.

కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా..

గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి చుట్టుప‌క్క‌ల ప్ర‌జ‌లంతా వెళ్లి పూజ‌లు నిర్వ‌హించారు . మొక్కుల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు సురేష్ అనే యువ‌కుడు పొట్టేలును తీసుకొని వ‌చ్చాడు. అదే గ్రామానికి చెందిన చలపతి పొట్టేలుని నర‌క‌బోయి.. మద్యం మత్తులో సురేష్ తలను నరికేశాడు. దీంతో సురేష్ కు తీవ్ర రక్తస్రావం కాగా.. అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చ‌ల‌ప‌తిపై హత్య కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటన కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగు బంధువులు, కొత్త అల్లుళ్లతో అంగరంగ వైభవంగా జరగాల్సింది పోయి.. ఇలా విషాదంలో గ్రామం మునిగిపోయింది. ఇక బాధితుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల ఆర్తనాధాలు వర్ణించలేకుండా ఉన్నాయి. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కన్నీళ్లు తెప్పిచ్చింది.

Crime News: కన్న కూతురుపై.. కసాయి తండ్రి అఘాయిత్యం..! నోరు నొక్కి రెండు సార్లు…!

Crime News: ఆస్తి కోసం సొంత రక్త సంబంధికుల మధ్య గొడవలు.. చంపుకోడాలు.. హత్యలు జరుగున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. ఇది ఆర్థికపరమైన అంశం కావునా.. ఇటువంటి పగలు, ప్రతీకారాలు ఎక్కువగా అవుతున్నాయి.

Crime News: కన్న కూతురుపై.. కసాయి తండ్రి అఘాయిత్యం..! నోరు నొక్కి రెండు సార్లు…!

బంధువల మధ్య కేవలం ఆర్థిక పరమైన విషయాల్లోనే కాదు.. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాల విషయాల్లో కూడా ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఇక కొన్ని కుటుంబాల్లో పైన చెప్పిన రెండు విషయాల్లో కాకుండా.. కన్న కూతురుపై తండ్రి అఘాయిత్యాలకు పాల్పడటం చూస్తున్నాం.

Crime News: కన్న కూతురుపై.. కసాయి తండ్రి అఘాయిత్యం..! నోరు నొక్కి రెండు సార్లు…!

ఇలాంటి దారుమైన ఘటన ఒకటి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. కన్న కూతరుపైనే తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జీవనాధారం కోసం అతడు ఆటో డ్రైవర్ గా చేస్తున్నాడు.


ఆ బాలిక తన తమ్ముడికి చెప్పగా..

తన భార్యకు ఆరోగ్యంగా బాగాలేకపోవడంతో.. సోదరుడితో కలిసి పిల్లలను తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అయింది. కానీ ఆమె భర్త మాత్రం.. పిల్లలను ఇక్కడే ఉంచు.. నువ్వు మాత్రం వెళ్లు అంటూ చెప్పాడు. దీంతో ఆమె పిల్లలను ఇంటిదగ్గరే ఉంచి.. సోదరుడితో కలిసి మహబూబ్ నగర్ వెళ్లిపోయింది.ఇక ఆటో డ్రైవర్ గా ఆ రోజు అతడు సర్వీస్ చేసి.. ఎప్పటిలాగే అతడు ఇంటికి వచ్చాడు. అప్పటికే అర్థరాత్రి కావడంతో పిల్లలు ఇద్దరూ పడుకున్నారు. ఇదే అదునుగా భావించిన ఆ కసాయి తండ్రి తన కుమార్తె నోరు నొక్కి.. రెండుసాల్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆ బాలిక తన తమ్ముడికి చెప్పగా..వారిద్దరు అక్కడ నుంచి తన తల్లి దగ్గరకు వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. మహంకాళి అమ్మవారి పాదల వద్ద మొండెం లేని తల ప్రత్యక్షం..!

Crime News నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని మెట్టు మహంకాళి ఆలయంలో మహంకాళి అమ్మవారి విగ్రహం పాదాల వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మొండెం లోని తలను స్థానికులు గుర్తించారు.

Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. మహంకాళి అమ్మవారి పాదల వద్ద మొండెం లేని తల ప్రత్యక్షం..!

ఈ ఇన్సిడెంట్ కాలనీలో భయాందోళనలు రేపింది. మైసమ్మ గుడి ముందు మెడలో బొమ్మ తలల దండతో ఉన్న పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి శరీరం నుంచి వేరుచేసిన తలను వదిలి వెళ్లారు దుండగులు. దీంతో ఆ ప్రాంతమంతా ఈ ఘటన పెద్ద కలకలం రేపింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. మహంకాళి అమ్మవారి పాదల వద్ద మొండెం లేని తల ప్రత్యక్షం..!

బాధితులు ఎవరో ఇంకా గుర్తు పట్టలేదు. కానీ అతని వయస్సు దాదాపు 35 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. ఇది నరబలి కేసు అయి ఉండొచ్చని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వ్యక్తిని హత్య చేసి తలను అమ్మవారి పాదాల చెంత ఉంచి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు..


హత్యా చేశారా.. ఆత్మహత్య చేసుకున్నారా ..?

వివాహేతర సంబంధంపై కొద్ది రోజుల క్రితం సంఘటనా స్థలానికి సమీపంలోని కుర్మేడు వద్ద పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కూలీల మధ్య ఘర్షణ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక దీనిపై స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతర శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు. అసలు ఇది ఎలా జరిగింది.. హత్యా చేశారా.. ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ తల ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

Crime News: రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలకు సంబంధించి వార్తలు వింటూనే ఉన్నాం. దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా… కామాంధుల్లో మార్పులు రావడం లేదు. దిశ, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చానా… కామాంధుల్లో భయం లేకుండా ఉంది.

Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

వావీ వరసలు మరచి, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగానే జరిగాయి. ముఖ్యంగా మనకు దగ్గరగా ఉండే వారి నుంచే లైంగిక వేధింపులు ఎదురుకుంటున్నారు. బాలికల దగ్గర నుంచి యువతుల దాకా దుర్మార్గుల చేతిలో పడుతున్నారు. 

Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

ఇదిలా ఉంటే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ దుర్మార్గుడు. మామ అయి ఉండి కోడలను కోరిక తీర్చాలని వేధించసాగాడు. చివరకు ఆమె పాలిట యముడిగా మారాడు. అత్తామామలు అంటే తల్లిదండ్రులతో సమానం అంటారు.. కానీ ఈ దుర్మార్గుడు మాత్రం సొంత కోడలినే చెరబట్టాలని చూశారు. చివరకు కోరిక తీర్చలేదని కోడలును దారుణంగా హతమార్చాడు. 


రజితపై కోపం పెంచుకున్న మామ..

వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కురవి మండల కేంద్రం శివారులోని సోమ్లా తండాలో జరిగింది. భూక్యా హచ్చ తన కొడుకు భార్య కోడలు రజితపై కన్నేశాడు. పలుసార్లు తన కోరిక తీర్చాలని ఒత్తడి చేస్తూ  వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని రజిత తన కుటుంబ సభ్యులతో చెప్పడంతో వాళ్లు మామ భూక్యా హచ్చను హెచ్చరించారు.  ఈనేపథ్యంలోనే రజితపై కోపం పెంచుకున్న మామ.. ఎవరూ లేని సమయంలో దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. హత్య సమయంలో రజిత భర్త కూలి పనులకు వెళ్లగా, కూతుళ్లు గురుకులంలో చదువుకుంటున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.

Crime News: జూనియర్ ఒంటిపై బట్టలు విప్పి.. వీడియో తీసిన సీనియర్లు.. ట్రిమ్మర్ తో వెంట్రుకలు కట్ చేస్తూ దాడి!

Crime News: సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థి తనపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్త సంవత్సరం రోజు సీనియర్లు తనపై ర్యాంగింగ్ చేశారని.. ఒంటిపై బట్టలు విప్పించి.. ఫొటోలు తీసి.. సెల్ఫీలు దిగారని.. అంతే కాకుండా.. తన వెంట్రుకలను ట్రిమ్మర్ తో కట్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించాడు.

Crime News: జూనియర్ ఒంటిపై బట్టలు విప్పి.. వీడియో తీసిన సీనియర్లు.. ట్రిమ్మర్ తో వెంట్రుకలు కట్ చేస్తూ దాడి!

అయితే ఎలాగోలా అతడు సీనియర్ల నుంచి తప్పించుకొని.. తన రూంకి వెల్లి.. తండ్రికి కాల్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే బాధితుడి తండ్రి డయల్ 100కి సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితుడిని రక్షించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి సూర్యాపేటలోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు.

Crime News: జూనియర్ ఒంటిపై బట్టలు విప్పి.. వీడియో తీసిన సీనియర్లు.. ట్రిమ్మర్ తో వెంట్రుకలు కట్ చేస్తూ దాడి!

శనివారం ఇంటి నుంచి బయలుదేరి రాత్రి కళాశాల హాస్టల్‌కు వచ్చాడు. ఆ సమయంలో ఉన్నత పాఠశాలలకు చెందిన 25 మంది విద్యార్థులు అతడిని బలవంతంగా తమ గదిలోకి తీసుకెళ్లారు. అతని బట్టలు విప్పి సెల్ ఫోన్లలో వీడియో తీశారు. వారంతా మద్యం మత్తులో ఉండడంతో అప్పటికే స్పృహ తప్పి విద్యార్థిపై దాడికి పాల్పడ్డాడు. ట్రిమ్మర్‌తో షేవింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా బాధితుడు తప్పించుకుని తన గదిలోకి వెళ్లాడు.

వారిపై చర్యలు తీసుకోండి.. మంత్రి హరీశ్ రావు..

అక్కడి నుంచి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో కంగారుపడిన అతను వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. సూర్యాపేట పోలీసులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని బాధితుడి తండ్రి ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి స్పందిస్తూ.. విద్యార్థులు చెప్పిన మాట వాస్తవమేనన్నారు. ఘటనపై విచారణకు నలుగురు హెచ్‌వోసీలను నియమించామని.. సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడితే కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. విద్యార్థినిపై సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటనపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు సోమవారం విచారణకు ఆదేశించారు. ర్యాగింగ్‌ ఘటనలు చోటుచేసుకోకుండా వైద్య విద్య సంచాలకులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.