General News

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు..! భర్త, అత్తామామలు ఇచ్చిన బహుమానం ఇది..!

Crime News: పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది ఆ మహిళ. మొదట్లో భర్త, అత్తామామలు బాగానే చూసుకున్నా.. తర్వాత వారి వక్రబుద్ది బయటపడింది. అదనపు కట్నం తేవాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె ఆ వేధింపులకు తట్టుకోలేక తనవు చాలించింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో దొర్ల శోభ–వెంకట్‌ రెడ్డిలు దంపతులు. వీళ్లకు 28 ఏళ్ల ప్రవళిక అనే కుమార్తె ఉంది. ఆమె అదే గ్రామానికి చెందిన చామకూర మహేష్ ను ప్రేమించింది. మొదట వీరి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో.. పోరాడి ప్రేమను సాధించుకొని వివాహం చేసుకున్నారు.

ఐదేళ్ల క్రితం అతడికి అమ్మాయి తరఫు తల్లిదండ్రలు కట్న కానుకలు కూడా బాగానే ఇచ్చారు. వారిద్దరు ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవడంతో.. లాంఛనాలతో అన్ని అబ్బాయికి ఇవ్వాల్సినవి ఇచ్చారు.

పుట్టింటికి వచ్చిన ప్రవళిక తెల్లవారుజామున ..


బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి కూడా ఇచ్చారు. మొదట వీరి కాపురం ఎలాంటి ఆటంకాలు.. మనస్పర్థలు లేకుండా సాగింది. అయితే మహేష్ మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తుండేవాడు. తర్వాత అతడి ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి అతడు ఇంటి వద్దనే ఉంటున్నాడు.
అయితే అప్పటి నుంచి ఆమెను అదనపు కట్నం తీసుకురావాలని అటు భర్తతో పాటు.. అత్తమామలు వేధించడం సాగించారు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆరు నెలల క్రితం రూ.4లక్షలను అదనపు కట్నం కింద ముట్టజెప్పారు. అయినా ఆ దుర్మార్గుడికి ఆశ చావలేదు. ఇంకా కావాలని బలవంతం చేయడంతో.. భరించలేకపోయింది. పుట్టింటికి వచ్చిన ప్రవళిక తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను ఓ సూసైడ్ నోట్ రాసింది. అందులో ఏముందంటే.. తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని.. అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారని, తనకు న్యాయం జరగాలని, ‘అమ్మా నాన్న మిస్‌ యూ అంటూ’ ఆమె సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇక దీనిపై ఆ వివాహిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

20 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

21 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago