Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు..! భర్త, అత్తామామలు ఇచ్చిన బహుమానం ఇది..!
Crime News: పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది ఆ మహిళ. మొదట్లో భర్త, అత్తామామలు బాగానే చూసుకున్నా.. తర్వాత వారి వక్రబుద్ది బయటపడింది. అదనపు కట్నం తేవాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె ఆ వేధింపులకు తట్టుకోలేక తనవు చాలించింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో దొర్ల శోభ–వెంకట్ రెడ్డిలు దంపతులు. వీళ్లకు 28 ఏళ్ల ప్రవళిక అనే కుమార్తె ఉంది. ఆమె అదే గ్రామానికి చెందిన చామకూర మహేష్ ను ప్రేమించింది. మొదట వీరి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో.. పోరాడి ప్రేమను సాధించుకొని వివాహం చేసుకున్నారు.
ఐదేళ్ల క్రితం అతడికి అమ్మాయి తరఫు తల్లిదండ్రలు కట్న కానుకలు కూడా బాగానే ఇచ్చారు. వారిద్దరు ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవడంతో.. లాంఛనాలతో అన్ని అబ్బాయికి ఇవ్వాల్సినవి ఇచ్చారు.
బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి కూడా ఇచ్చారు. మొదట వీరి కాపురం ఎలాంటి ఆటంకాలు.. మనస్పర్థలు లేకుండా సాగింది. అయితే మహేష్ మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తుండేవాడు. తర్వాత అతడి ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి అతడు ఇంటి వద్దనే ఉంటున్నాడు.
అయితే అప్పటి నుంచి ఆమెను అదనపు కట్నం తీసుకురావాలని అటు భర్తతో పాటు.. అత్తమామలు వేధించడం సాగించారు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆరు నెలల క్రితం రూ.4లక్షలను అదనపు కట్నం కింద ముట్టజెప్పారు. అయినా ఆ దుర్మార్గుడికి ఆశ చావలేదు. ఇంకా కావాలని బలవంతం చేయడంతో.. భరించలేకపోయింది. పుట్టింటికి వచ్చిన ప్రవళిక తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను ఓ సూసైడ్ నోట్ రాసింది. అందులో ఏముందంటే.. తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని.. అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారని, తనకు న్యాయం జరగాలని, ‘అమ్మా నాన్న మిస్ యూ అంటూ’ ఆమె సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇక దీనిపై ఆ వివాహిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…