తమిళ సినిమాకు చెందిన పలువురు హీరోలు తెలుగు సినీ అభిమానులకు పరిచయం కావడం వెరీ కామన్. వీరు నటించే పలు సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ రూపంలో వస్తుంటాయి. తెలుగు జనాలు కూడా వీరి సినిమాలను బాగానే ఆదరిస్తారు. తెలుగు హీరోలతో సమానంగా వీరి సినిమాలు కూడా చూస్తారు. ఇక సూర్య లాంటి హీరోల సినిమాలు వస్తే మాత్రం ఒక తెలుగు సినిమా లాగానే భావిస్తారు.
సూర్య మాత్రమే కాదు.. తమిళ హీరోలు విజయ్, అజిత్, కమల్ హాసన్, రజనీకాంత్ కు కూడా తెలుగులో మంచి ఆదరణ, గుర్తింపు ఉంది. తాజాగా పలువురు తమిళ హీరోలు కూడా తెలుగులోకి నేరుగా వస్తున్నారు. ఇక్కడ సినిమాలు చేస్తూ తమ మార్కెట్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఓ తమిళ హీరో నేరుగా తెలుగులో సినిమా చేశాడు. ఇంతకీ తను ఎవరు? ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గతంలో వాన అనే తెలుగు సినిమాలో నటించాడు వినయ్ రాయ్. ఈ సినిమాకు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేదు. కానీ పాటలు మాత్రం మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన పాటలు బాగా వినిపడుతాయి. వాస్తవానికి వినయ్ చాలా తమిళ సినిమాలు చేశాడు. ఆయన నటించిన పలు సినిమాల్లో ఓ తమిళ సినిమా తెలుగులో డబ్బై నీవల్లే నీవల్లే అనే పేరుతో విడుదల అయ్యింది. తెలుగులో వినయ్ నటించిన ఒకే సినిమా అయిన వాన సినిమా జనాల మదిలో నిలిచిపోయింది.
ఈ సినిమా తర్వాత మళ్లీ వినయ్ కనిపించలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ అంతగా కనిపించలేదు. చాలా సంవత్సరాల తర్వాత మరో డబ్బింగ్ సినిమా ద్వారా వినయ్ ఎంట్రీ ఇచ్చాడు. విశాల్ హీరోగా చేసిన డిటెక్టివ్ లో వినయ్ విలన్ రోల్ చేశాడు. అలాగే శివ కార్తికేయన్ హీరోగా చేసిన డాక్టర్ సినిమాలోనూ నెగెటివ్ రోల్ చేశాడు. డాక్టర్ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం విలన్ గా సెటిల్ కాబోతున్నాడు వినయ్. ఇక వినయ్ రాయ్ తనలోని నటుడిని డాక్టర్, డిటెక్టివ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీ కి అయితే చూపించాడు. మరి రానున్న రోజుల్లో మంచి విలన్ గా, లిడఁటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా అవకాస్లు వస్తాయో లేదో వేచి చూడాలి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…