Income Plan: రూ.165 పొదుపు చేస్తే..! రూ.11 లక్షలు సొంతం చేసుకోవచ్చు..!
Income Plan: భవిష్యత్ అవసరాల కోసం చాలా మంది డబ్బులను పొదుపు చేసుకోవాలని అనుకుంటుంటారు. కొంతమంది ఆ డబ్బులను ఇన్వెస్ట్ మెంట్ రూపంలో బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే.. మరికొంత మంది వాటిని ఫ్లాట్ లేదా.. భూమి కొనుగోలులో పెడుతుంటారు.
అయితే ఏది ఏమైనా.. దేనిలో ఎన్వెస్ట్ చేసినా రిస్క్ అనేది ఉంటుంది. అయితే బ్యాంక్ లో డిపాజిట్ కు ఎలాంటి రిస్క్ లేకపోయినా.. వడ్డీ అనేది చాలా తక్కువగా వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు పొందాలనుకున్నే వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..
మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిలో సిప్ రూపంలో డబ్బులను డిపాజిట్ చేయవచ్చు. దీంతో మనం ఊహించని రీతిలో లాభాలను పొందొచ్చు. ఉదాహరణకు దీనిలో రోజుకు రూ.165 ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత దాదాపు రూ.11లక్షల వరకు రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది.
దీనిలో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు 12 శాతం నుంచి 20 శాతం వరకు రాబడి లభిస్తుంది. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తంలో మార్పులు ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. దీనిలో ఇన్వెస్ట్ చేసే ముందు.. ఆ ఫండ్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో చేరాలంటే కనీసం రూ.500 లతో చేరవచ్చు. దీనిలో చేరే వారు ఈక్విటీ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిదని చెబతున్నారు. రిస్క్ కు సిద్ధపడి డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిదని నిపుణుల సూచన. ఆసక్తి ఉన్నవాళ్లు సమీప బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏజెంట్లను సంప్రదిస్తూ పూర్తి వివరాలను వెల్లడిస్తారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…