Tag Archives: dhee show

Actress Nandita: ఢీ వేదికపై కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిన జడ్జి నందిత శ్వేతా… వీడియో వైరల్!

Actress Nandita: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న ఢీ డాన్స్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్న ఈ కార్యక్రమం వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమో లో భాగంగా కంటెస్టెంట్ లు తమ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.

Actress Nandita: ఢీ వేదికపై కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిన జడ్జి నందిత శ్వేతా… వీడియో వైరల్!

ఇక ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి నటి నందితా శ్వేత ఢీ వేదికపై కన్నీళ్ళు పెట్టుకొని ఎమోషనల్ అయినట్టు ప్రోమోలో చూపించారు. ఇలా ఈమె ఎమోషనల్ అవడానికి గల కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే..

Actress Nandita: ఢీ వేదికపై కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిన జడ్జి నందిత శ్వేతా… వీడియో వైరల్!

నటి నందితా శ్వేత పుట్టినరోజు కావడంతో ఢీ వేదికపై ఈమెకు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ప్రదీప్ ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకువచ్చి నందితకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

గిఫ్ట్ చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న నందిత…

ఇక ప్రదీప్ చేతుల మీదుగా బహుమతి అందుకున్న నందిత ఢీ వేదికపైనే ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. ఇలా ఈమె కంటతడి పెట్టుకోవడంతో అక్కడున్న వారందరూ షాకయ్యారు. అయితే గిఫ్ట్ బాక్స్ లో ఏముంది? అది చూడగానే నందిత ఎందుకు అంత ఎమోషనల్ అయింది అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sudheer-Rashmi: సుడిగాలి సుధీర్, రష్మీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.. అమాంతం పడిపోయిన రేటింగ్స్..!

Sudheer Rashmi: సుడిగాలి సుధీర్, రష్మీ బుల్లితెరపైన ఎంత ఫేమసో తెలియంది కాదు. ముఖ్యంగా ఈ జంటను చూసేందుకే పలువురు వీరి షోలు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా సుధీర్- రష్మీ జోడి ఫేమస్ అయింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తోంది.

అయితే వీరిద్దరి మధ్య లవ్ ఉందా లేదా..? అన్నది తరువాత సంగతి. తెరపైన మాత్రం వీరిద్దరిని నిజమైన లవర్లుగానే చూస్తున్నారు ఫ్యాన్స్, ఆడియన్స్.  ‘జబర్థస్త్’, ‘ఢీ’ షోల్లో వీరిద్దరికి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఢీ షోలో డాన్సుల కన్నా వీరిద్దరి మధ్య వచ్చే ఫన్నీ చూడటానికే చాలా మంది ఇష్టపడుతారు.

Sudheer-Rashmi: సుడిగాలి సుధీర్, రష్మీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది..అమాంతం పడిపోయిన రేటింగ్స్..!

ఇక జబర్ధస్త్ లో వీరిద్దరిపై పంచ్ లేకుండా దాదాపుగా స్కిట్ లేకుండా ఉండదు. ఇంతలా ఈ రెండు షోలకు కీలకంగా మారారు సుధీర్- రష్మీ. అయితే అంత నార్మల్ గా ఉన్న సమయంలో వీరిద్దరికి షాక్ ఇచ్చింది మల్లెమాల, ఈటీవీ యాజమాన్యాలు.

Sudheer-Rashmi : వారులోనే షో చూడటం అవసరమా..?

తాజా వస్తున్న ’ఢీ‘ షో నుంచి వీరిద్దరిని తప్పించారు. దీంతో షో రేటింగ్స్ అమాంతంగా పడిపోయాయి. గతంలో వీరిద్దరు ఉన్నప్పుడు షో ఫుల్లుగా రేటింగ్స్ సంపాదించుకునేది. సుధీర్, రష్మీని ఢీ నుంచి తప్పించడంతో షో రేటింగ్ అమాంతం పడిపోయింది. తాజాగా షో రేటింగ్ 4 కే పడిపోయింది. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ తో సుధీర్ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు, రష్మీ స్థానంలో టిక్ టాక్ బ్యూటీని తీసుకువచ్చారు. అయితే వీరిద్దరు ఉన్నా షోలో ఫన్ పండటం లేదు. ఇదిలా ఉంటే సుధీర్, రష్మీ లేకుండా ఢీ షోను చూడాలా అంటూ.. నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఢీ షోలో నరసింహ సినిమాని చూపించిన.. ప్రియమణి, సుధీర్ .. వీడియో వైరల్!

ప్రతి బుధవారం బుల్లితెరపై ప్రసారమయ్యే”ఢీ”షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఇందులో సుధీర్, హైపర్ ఆది, దీపిక పిల్లి, రష్మీ కింగ్ అండ్ క్వీన్స్ టీమ్ లకు లీడర్ గా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూర్ణ, ప్రియమణి గణేష్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఈవారం టీమ్ లీడర్లు, జడ్జీలు సూపర్ సెలబ్రిటీల పాత్రలో అద్భుతంగా చేశారు.ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ నరసింహ సినిమాలోని రజినీకాంత్ పాత్రలో సందడి చేయగా పూర్ణ రమ్యకృష్ణ పాత్రను ఎంతో అద్భుతంగా చేసింది. వీళ్లిద్దరు రజనీకాంత్ రమ్యకృష్ణ పాత్రలలో నరసింహ సినిమాను చూపించారు.

ఈ క్రమంలోనే ప్రియమణి సుధీర్ దగ్గరకు వచ్చి రమ్యకృష్ణ స్టైల్లో నువ్వు ఎంతో అదృష్టవంతుడివి.. నాకే నచ్చావు. రేపు మీ చెల్లి మా అన్నయ్య నిశ్చితార్థం రోజు నీ అభిప్రాయాన్ని చెప్పు. ఓకే నేనే చెప్తా నువ్వు సిగ్గు పడతావు అంటూ ప్రియమణి అక్కడినుండి వెళుతుండగా సుధీర్ రజిని స్టైల్ లో “మేడం జస్ట్ మినిట్‌..” మీరు మీ ఇష్టాన్ని చెప్పారు.నా ఇష్టాన్ని వినలేదు మీరు నాకు నచ్చలేదు అని చెప్పడంతో రమ్యకృష్ణ పాత్రలో ఉన్న ప్రియమణి కళ్ళజోడు తీయగా రజిని పాత్రలో ఉన్న సుధీర్ కళ్ళజోడును పెట్టుకోవడం ఎంతో స్టైల్ గా ఉంది.

అదేవిధంగా పూర్ణ శృంగార వీర..అనే పాటకు అద్భుతంగా డాన్స్ చేయగా సుధీర్ మరోసారి రజిని స్టైల్ లో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాలి.

ఆ ఫీలింగ్ ఆపుకోలేక ఆ డాన్సర్ బుగ్గను కొరికేసిన జడ్జ్ పూర్ణ..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీఈ కార్యక్రమానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ షోలో న్యాయనిర్ణేతలుగా పూర్ణ, ప్రియమణి వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి జడ్జిమెంట్ పలు వివాదాలకు కారణమవుతోంది. సాధారణంగా కంటెస్టెంట్ లకు జడ్జిలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.వారు డాన్స్ బాగా చేస్తే వారు ఫర్ఫార్మెన్స్ కు తగ్గట్టుగా మార్కులు ఇవ్వడం జడ్జిగా వ్యవహరిస్తున్న వారి పని. కానీ డీ షోలో మాత్రం కంటెస్టెంట్ లకు హగ్గులు,ముద్దులు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది.

అదేవిధంగా యాంకర్ ప్రదీప్, ఆదితో కూడా రొమాంటిక్ సన్నివేశాలు చేయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి గతంలో ఢీ అంటే కేవలం రష్మి, సుధీర్ మధ్య మాత్రమే రొమాంటిక్ సన్నివేశాలు ఉండేవి. ప్రస్తుతం ఈ రొమాంటిక్ సన్నివేశాలను పూర్ణ ప్రియమణి ఇద్దరు యాంకర్ తో కూడా రొమాన్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది.

ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ డాన్సర్ చేసిన డాన్స్ కి ఫిదా అయిన పూర్ణ ఏకంగా తన బుగ్గపై కొరకడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా ఓ డాన్సర్ బేబీ గెటప్ లో వస్తూ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన” మాటేరాని చిన్నదాని.. కళ్ళు పలికే ఊసులు”.. అనే సూపర్ హిట్ పాటకు ఎంతో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేశారు.

ఈ విధంగా డాన్సర్ చేసిన డాన్స్ కి ఫిదా అయిన పూర్ణ తన సీట్ నుంచి వెళ్లి ఏకంగా ఆ డాన్సర్ బుగ్గపై గట్టిగా కొరకడంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు వీరి వ్యవహారం హగ్గుల నుంచి కిస్ లు వరకు వెళ్లి ప్రస్తుతం బుగ్గ కొరకడం వరకు వెళ్ళారంట తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెకండ్ ఇన్నింగ్స్‌ సూపర్‌ సక్సెస్‌‌కు సీక్రెట్‌ ఏంటో చెప్పేసిన ప్రియమణి?

తెలుగు నటి కన్నడ ముద్దుగుమ్మ ప్రియమణి రీ ఎంట్రీతో బాగా బిజీగా మారింది. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ భాషలలో కలిపి 26కి పైగా సినిమాలలో నటించింది. 2017లో ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకున్న ప్రియమణి అప్పటినుండి ఇండస్ట్రీకి దూరమైంది. విరాటపర్వం సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బుల్లితెర షో జడ్జిగా కూడా మెప్పిస్తుంది.ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ కు అసలు సీక్రెట్ ఏంటంటే.. తన భర్త ఓకే చేసిన క్యారెక్టర్ లోనే నటిస్తుందట. ఆయన స్టోరీ సెలక్షన్ సూపర్బ్ అంటూ, తన సపోర్ట్ వల్లే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తుందట.

తెలుగు నటి కన్నడ ముద్దుగుమ్మ ప్రియమణి రీ ఎంట్రీతో బాగా బిజీగా మారింది.

ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ భాషలలో కలిపి 26కి పైగా సినిమాలలో నటించింది. 2017లో ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకున్న ప్రియమణి అప్పటినుండి ఇండస్ట్రీకి దూరమైంది

 

 

 

 

 

 

విరాటపర్వం సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. 

బుల్లితెర షో జడ్జిగా కూడా మెప్పిస్తుంది.ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ కు అసలు సీక్రెట్ ఏంటంటే..

తన భర్త ఓకే చేసిన క్యారెక్టర్ లోనే నటిస్తుందట.

 ఆయన స్టోరీ సెలక్షన్ సూపర్బ్ అంటూ, తన సపోర్ట్ వల్లే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తుందట.

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

టాలీవుడ్ సినీ నటి ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు..

‘బాబా భాస్కర్’కు వార్నింగ్ ఇచ్చిన సుధీర్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోలకు ఏ విధంగా అభిమానులు ఉంటారో బుల్లితెర స్టార్స్ కు కూడా అదే విధంగా అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు తమకు ఇష్టమైన వారిపై ఎవరైనా కామెంట్లు చేస్తే అస్సలు తట్టుకోలేరు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే బుల్లితెరపై టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసినా, పలు షోలకు యాంకర్ గా చేసినా తన ఆటిట్యూడ్ తో సుధీర్ అభిమానులను పెంచుకుంటున్నారు.

సుధీర్ ఫ్యాన్స్ కు ఆయనంటే విపరీతమైన గౌరవం, అభిమానం. ఎవరైనా సుధీర్ ను పల్లెత్తు మాట అన్నా అతని ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరు. ఇటు బుల్లితెరపై పేరు, గుర్తింపు తెచ్చుకుంటూనే సినిమాల్లో కూడా నటిస్తూ సుధీర్ కెరీర్ లో ఎదుగుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సుధీర్ పై కామెంట్లు చేస్తూ ఆ కామెంట్లనే కామెడీ పేరుతో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢీ షోలో బాబా భాస్కర్ సుధీర్ పై వేస్తున్న పంచులు ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

సుధీర్ పై ఇష్టానుసారం పంచులు వేస్తే ఊరుకోబోమని గతంలోనే సుధీర్ ఫ్యాన్స్ పలువురు సెలబ్రిటీలపై సీరియస్ అయ్యారు. కెరీర్ లో ఎన్నో కష్టాలను అనుభవించి సుధీర్ ఈ స్థాయికి చేరుకున్నారు. సోషల్ మీడియాలో సుధీర్ ఫ్యాన్స్ పేరిట ప్రత్యేక గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుధీర్ ను వేస్ట్ అని చేస్తున్న కామెంట్లపై సీరియస్ అవుతున్నారు. బాబా భాస్కర్ లాంటి మాస్టర్ సుధీర్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అవతలి వ్యక్తులపై పంచులు వేసే సమయంలో వాళ్ల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలని బాబా భాస్కర్ ను అతని ఫ్యాన్స్ సున్నితంగా హెచ్చరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ విధంగా ఎప్పుడూ కామెంట్లు చేయలేదని శేఖర్ మాస్టర్ ను చూసి బాబా మాస్టర్ నేర్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ కు బాబా భాస్కర్ సారీ చెప్పాలని అతని ఫ్యాన్స్ కోరుతుండటం గమనార్హం.