ప్రతి బుధవారం బుల్లితెరపై ప్రసారమయ్యే”ఢీ”షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఇందులో సుధీర్, హైపర్ ఆది, దీపిక పిల్లి, రష్మీ కింగ్ అండ్ క్వీన్స్ టీమ్ లకు లీడర్ గా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూర్ణ, ప్రియమణి గణేష్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా ఈవారం టీమ్ లీడర్లు, జడ్జీలు సూపర్ సెలబ్రిటీల పాత్రలో అద్భుతంగా చేశారు.ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ నరసింహ సినిమాలోని రజినీకాంత్ పాత్రలో సందడి చేయగా పూర్ణ రమ్యకృష్ణ పాత్రను ఎంతో అద్భుతంగా చేసింది. వీళ్లిద్దరు రజనీకాంత్ రమ్యకృష్ణ పాత్రలలో నరసింహ సినిమాను చూపించారు.
ఈ క్రమంలోనే ప్రియమణి సుధీర్ దగ్గరకు వచ్చి రమ్యకృష్ణ స్టైల్లో నువ్వు ఎంతో అదృష్టవంతుడివి.. నాకే నచ్చావు. రేపు మీ చెల్లి మా అన్నయ్య నిశ్చితార్థం రోజు నీ అభిప్రాయాన్ని చెప్పు. ఓకే నేనే చెప్తా నువ్వు సిగ్గు పడతావు అంటూ ప్రియమణి అక్కడినుండి వెళుతుండగా సుధీర్ రజిని స్టైల్ లో “మేడం జస్ట్ మినిట్..” మీరు మీ ఇష్టాన్ని చెప్పారు.నా ఇష్టాన్ని వినలేదు మీరు నాకు నచ్చలేదు అని చెప్పడంతో రమ్యకృష్ణ పాత్రలో ఉన్న ప్రియమణి కళ్ళజోడు తీయగా రజిని పాత్రలో ఉన్న సుధీర్ కళ్ళజోడును పెట్టుకోవడం ఎంతో స్టైల్ గా ఉంది.
అదేవిధంగా పూర్ణ శృంగార వీర..అనే పాటకు అద్భుతంగా డాన్స్ చేయగా సుధీర్ మరోసారి రజిని స్టైల్ లో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాలి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…