Tag Archives: director rajamouli

Ramgopal Varma: ఆ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ హీరోల పరువు తీసిన వర్మ.. వైరల్ అవుతున్న కామెంట్స్!

Ramgopal Varma: రాంగోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈయన ఎప్పుడు ఏం మాట్లాడినా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇలా రాంగోపాల్ వర్మ తాజాగా బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ పుండు పై కారం చల్లినట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న విషయం మనకు తెలిసిందే. భారీ బడ్జెట్ తో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈ సినిమాలు మాత్రం తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.

సాధారణ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో అందరిని కాస్త విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒకవైపు బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఎదుర్కోగా టాలీవుడ్ సినిమాలు మాత్రం హిందీలో డబ్ అవతూ థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సౌత్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన సినిమాలు హిందీలో కూడా సత్తా చాటుకున్నాయి. ప్రస్తుతం కార్తికేయ2 సినిమా కూడా బాలీవుడ్లో కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.

కేవలం నార్త్ ఇండస్ట్రీలో 50 థియేటర్లతో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం వెయ్యికి పైగా థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతుంది. విచిత్రం ఏమంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ వంటి సినిమాలను సైతం తొలగించి కార్తికేయ 2 సినిమా వేయడం గమనార్హం.

Ramgopal Varma: ఆ హీరోలను తీసి పారేసిన వర్మ..

ఈ క్రమంలోనే ఈ విషయంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ రక్షాబంధన్, రాజమౌళి త్రిబుల్ ఆర్, ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాల కన్నా కార్తికేయ 2 సినిమా మంచి సక్సెస్ అందుకుందని ఈ సందర్భంగా ఈయన నిఖిల్ సినిమాపై ప్రశంసల కురిపిస్తూ బాలీవుడ్ హీరోల పరువు తీశారు. ఇలా రాంగోపాల్ వర్మ ఇప్పుడే హిట్లు లేక సతమతమవుతున్న బాలీవుడ్ హీరోల గురించి ఇలా కామెంట్ చేస్తూ పుండు మీద కారం చల్లారని తెలుస్తోంది. ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anupama Parameswaran: రాజమౌళి కాళ్లపై పడిన అనుపమ పరమేశ్వరన్.. వైరల్ అవుతున్న వీడియో !

Anupama Parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళికి సినిమా అంటే ఎలాంటి ఫ్యాషన్ ఉందో మనకు తెలిసిందే. ముఖ్యంగా థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలంటే ఆయనకు ఎంతో ఇష్టమని ఇదివరకు ఎన్నోసార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఇక ఈ చిత్ర బృందం ఐమాక్స్ థియేటర్లో ఈ సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చుని వీక్షించారు.ఇదే సినిమాకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలాగే కీరవాణి కుటుంబ సభ్యులకు కూడా అదే థియేటర్లో సినిమా చూశారు.

సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రాజమౌళి కీరవాణి కుటుంబ సభ్యులు కారు పార్కింగ్ దగ్గర చేరుకోగానే అక్కడ వీరిని చూసిన అనుపమ పరమేశ్వర ఒక్కసారిగా వారి వద్దకు వెళ్లి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ ను ఆశీర్వదించిన రాజమౌళి సినిమా చాలా బాగుందని తన నటన మరింత అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.

Anupama Parameswaran: సినిమాపై ప్రశంసలు కురిపించిన జక్కన్న..

ఈ క్రమంలోనే పక్కనే ఉన్న కీరవాణి కుటుంబ సభ్యులను కూడా అనుపమ పరమేశ్వరన్ పరామర్శించారు. ఇక ఈ విషయాన్ని ఈమె తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇలా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనుపమ వ్యవహారంపై నేటిజన్ లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Rajamouli : ఎన్టీఆర్ ను కుంటి గుర్రంతో పోల్చిన రాజమౌళి… మండిపడుతున్న తారక్ ఫ్యాన్స్!

Rajamouli : సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత గతంలో జరిగిన కొన్ని విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా అశ్విని దత్ ప్రభాస్ నుహీరోగా అనుకున్నారట అయితే హరికృష్ణ ఫోన్ చేయడంతో ఆ అవకాశం ఎన్టీఆర్ కి వెళ్లిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ సినిమా విషయంపై రాజమౌళి గతంలో చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ మొదటి సినిమాకే ఇలాంటి వాడు హీరోగా దక్కాడేంటి, ఇది నా కర్మ అని భావించారట. అయినా కుంటి గుర్రంతో రేసులో నెగ్గితే ఇంకా గొప్పగా ఉంటుందని రాజమౌళి భావించారట.హీరో బాగా లేకపోయినా మనం సినిమా బాగా చేస్తే మనకే మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ సినిమాని తీశానని వెల్లడించారు.

Jr. NTR: ఆ కుంటి గుర్రమే పాన్ ఇండియా స్టార్ అయ్యారు…

ఇలా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఎంతో మంది ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పై తీవ్రస్థాయిలో మండిపడటమే కాకుండా ఆయనని ట్రోల్ చేస్తున్నారు.ఒకప్పటి ఆ కుంటి గుర్రమే ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యారు అంటూ పెద్ద ఎత్తున రాజమౌళి పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Director Rajamouli : దర్శకధీరుడు రాజమౌళికి – నటుడు హర్షవర్ధన్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

Director Rajamouli : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి సినిమా అంటే ఇష్టముండని వారుండగారు. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ఏదో కొంత విషయం ఉండడంతో పాటు అన్ని హంగులు కనిపిస్తాయి. రాజమౌళి సినిమాలో స్టార్ హీరో నటించినా.. హీరో కంటే ఎక్కువగా ఈ దిగ్గజ దర్శకుడికే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక ‘బాహుబలి’ సినిమాల తరువాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.

interesting details about relationship between rajamouli and actor harsha vardhan

విదేశాల్లోనూ రాజమౌళికి ప్రత్యేకంగా అభిమానులు ఉండడం విశేషం. అయితే అమృతం సీరియల్‌తో పాపులర్ అయిన హ‌ర్ష‌వ‌ర్ధన్‌కి సినిమాల్లో అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి నటుడై నిరూపించుకున్నా దర్శకుడు కావాలన్న ఆశ మాత్రం చావలేదు అని తెలుస్తుంది. తనలోని రైటర్‌ని కూడా నిద్ర లేపి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యింది వంటి చిత్రాలకు సంభాషణలు సమకూర్చారు హర్ష.

interesting details about relationship between rajamouli and actor harsha vardhan

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిన అది కుద‌ర‌లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న హర్షవర్ధన్ రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఏంటా అని ఆలోచిస్తున్నారా… హర్ష వర్ధన్ కి దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న సంబంధం.

అదే మా మధ్య ఉన్న బంధం అంటున్న హర్షవర్ధన్…

రాజమౌళి అప్పట్లో దర్శకత్వం వహించిన శాంతినివాసం అనే సీరియల్ కి హర్షవర్ధన్ రైటర్ గా పని చేశారని తాజాగా వెల్లడించారు. అలానే నా రైటింగ్ స్కిల్స్ అంటే రాజమౌళి కి ఎంతో ఇష్టం, దాదాపు 15 ఎపిసోడ్స్ కి పైగా ఆయన నాతో డైలాగ్స్ రాయించడమే కాకుండా, నాకోసం ఒక్క ప్రత్యేకమైన పాత్రని కూడా అద్భుతంగా డిసైన్ చేసారు అంటూ చెప్పుకొచ్చారు. అలా ఆ పాత్రకి నాకు ఎంతో పేరు వచ్చింది అని వారి మధ్య ఉన్న బంధం గురించి వివరించారు.