interesting details about relationship between rajamouli and actor harsha vardhan
Director Rajamouli : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి సినిమా అంటే ఇష్టముండని వారుండగారు. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ఏదో కొంత విషయం ఉండడంతో పాటు అన్ని హంగులు కనిపిస్తాయి. రాజమౌళి సినిమాలో స్టార్ హీరో నటించినా.. హీరో కంటే ఎక్కువగా ఈ దిగ్గజ దర్శకుడికే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక ‘బాహుబలి’ సినిమాల తరువాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
విదేశాల్లోనూ రాజమౌళికి ప్రత్యేకంగా అభిమానులు ఉండడం విశేషం. అయితే అమృతం సీరియల్తో పాపులర్ అయిన హర్షవర్ధన్కి సినిమాల్లో అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి నటుడై నిరూపించుకున్నా దర్శకుడు కావాలన్న ఆశ మాత్రం చావలేదు అని తెలుస్తుంది. తనలోని రైటర్ని కూడా నిద్ర లేపి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యింది వంటి చిత్రాలకు సంభాషణలు సమకూర్చారు హర్ష.
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిన అది కుదరలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న హర్షవర్ధన్ రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఏంటా అని ఆలోచిస్తున్నారా… హర్ష వర్ధన్ కి దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న సంబంధం.
రాజమౌళి అప్పట్లో దర్శకత్వం వహించిన శాంతినివాసం అనే సీరియల్ కి హర్షవర్ధన్ రైటర్ గా పని చేశారని తాజాగా వెల్లడించారు. అలానే నా రైటింగ్ స్కిల్స్ అంటే రాజమౌళి కి ఎంతో ఇష్టం, దాదాపు 15 ఎపిసోడ్స్ కి పైగా ఆయన నాతో డైలాగ్స్ రాయించడమే కాకుండా, నాకోసం ఒక్క ప్రత్యేకమైన పాత్రని కూడా అద్భుతంగా డిసైన్ చేసారు అంటూ చెప్పుకొచ్చారు. అలా ఆ పాత్రకి నాకు ఎంతో పేరు వచ్చింది అని వారి మధ్య ఉన్న బంధం గురించి వివరించారు.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…