Anupama Parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళికి సినిమా అంటే ఎలాంటి ఫ్యాషన్ ఉందో మనకు తెలిసిందే. ముఖ్యంగా థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలంటే ఆయనకు ఎంతో ఇష్టమని ఇదివరకు ఎన్నోసార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఇక ఈ చిత్ర బృందం ఐమాక్స్ థియేటర్లో ఈ సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చుని వీక్షించారు.ఇదే సినిమాకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలాగే కీరవాణి కుటుంబ సభ్యులకు కూడా అదే థియేటర్లో సినిమా చూశారు.
సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రాజమౌళి కీరవాణి కుటుంబ సభ్యులు కారు పార్కింగ్ దగ్గర చేరుకోగానే అక్కడ వీరిని చూసిన అనుపమ పరమేశ్వర ఒక్కసారిగా వారి వద్దకు వెళ్లి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ ను ఆశీర్వదించిన రాజమౌళి సినిమా చాలా బాగుందని తన నటన మరింత అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలోనే పక్కనే ఉన్న కీరవాణి కుటుంబ సభ్యులను కూడా అనుపమ పరమేశ్వరన్ పరామర్శించారు. ఇక ఈ విషయాన్ని ఈమె తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇలా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనుపమ వ్యవహారంపై నేటిజన్ లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…