Tag Archives: guppedantha manasu

Jyothi Rai: ఆ టాలీవుడ్ హీరో అంటే పిచ్చి అంటున్న జగతి మేడం.. ఆ హీరో ఎవరంటే?

Jyothi Rai: జ్యోతి రాయ్ అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ జగతి మేడం అంటే మాత్రం టక్కున ఈమె అందరికీ గుర్తుకు వస్తారు. బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడం పాత్రలో నటించినటువంటి ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం సీరియల్స్ కి దూరంగా ఉంటూ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.

సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి జగతి మేడం సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఇలా ఈమె అందాల ప్రదర్శన చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె అభిమానులతో ముచ్చటించారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగే ప్రశ్నలన్నింటికీ ఈమె సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని మీకు ఇష్టమైనటువంటి హీరో ఎవరు అంటూ ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. తనకు ఇండియాలోనే ఒకే ఒక హీరో అంటే చాలా ఇష్టం అంటూ ఈమె తన ఇష్టమైన హీరో ఎవరు అనే విషయాన్ని బయట పెట్టారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని జ్యోతి రాయ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jyothi Rai: నీ రాకతో నా జీవితం సంపూర్ణమైంది.. భర్త పై ప్రేమను కురిపించిన జగతి మేడం!

Jyothi Rai: జ్యోతిరాయ్ అంటే గుర్తుపట్టలేరేమో కానీ జగతి మేడం అంటే మాత్రం టక్కున ఈమె గుర్తుకు వస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు. సీరియల్లో చీరకట్టులో ఎంతో పద్ధతిగా కనిపించిన జ్యోతి బయట మాత్రం భారీ అందాలను ఆరబోస్తూ రచ్చ చేశారు.

ఇక వయసులో తనకంటే చిన్నవాడైన దర్శకుడితో ప్రేమలో పడి ఈమె పెళ్లి చేసుకున్నారు తరచూ తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే తాజాగా తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను మొత్తం బయట పెట్టారు. ఈమె డైరెక్టర్ సుక్ పూర్వజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పుట్టినరోజు కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

మనం కలిసి ఏడాది పూర్తి అయింది. ఇప్పుడు నా జీవితం ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. నువ్వు చూపిస్తున్న ప్రేమ, లవ్, ఇచ్చే హగ్స్, కిస్సులు, సపోర్ట్, ఎంకరేజ్ మెంట్, నీ పాజిటివ్ థాట్స్ ఇలా అన్నింటికి థాంక్స్.. నీ సహనం.. నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నింటికీ థాంక్స్..

భర్తగా రావటం నా అదృష్టం..

నీ రాకతో నా జీవితం సంపూర్ణమైంది. నువ్వు నా భర్తగా రావడం నా అదృష్టం హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. లవ్యూ అన్ కండీషనల్లీ అంటూ జ్యోతి రాయ్ వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇలా ఈమె తాను పెళ్లి చేసుకున్నాను అనే విషయాన్ని తెలియజేయకుండా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడం వీరి పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి తాజాగా ఈమె చేసిన పోస్ట్ చూస్తుంటే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని అర్థమవుతుంది.

serial Actress Madhavi: అయినవాళ్లే నమ్మించి మోసం చేశారు… ఆవేదన వ్యక్తం చేసిన గుప్పెడంత మనసు సీరియల్ దేవయాని!

serial Actress Madhavi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇందులో వసు రిషి క్యూట్ లవ్ స్టోరీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సీరియల్ ద్వారా రిషి పెద్దమ్మగా ఎంతో ఫేమస్ అయ్యారు నటి దేవయాని అలియాస్ మిర్చి మాధవి.

మిర్చి మాధవిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె ఈ సీరియల్లో దేవయాని పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తూ మెప్పించినటువంటి ఈమె నిజజీవితంలో మాత్రం అయిన వాళ్ల చేతిలో దారుణంగా మోసపోయిందని తాజాగా తాను మోసపోయిన విషయం గురించి బయట పెడుతూ ఎవరు కూడా ఇలా మోసపోవద్దు అంటూ అందరికీ హెచ్చరించారు.

అయినవాళ్లే తనని నమ్మించి సుమారు 5 లక్షల వరకు మోసం చేశారని ఈమె తెలియజేశారు.తనకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గురించి పెద్దగా అవగాహన లేదు అయితే తనకు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని చెప్పి సుమారు 5 లక్షల వరకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయించి నాకు తెలియకుండా ఆ డబ్బులు మొత్తం వాళ్లు సొమ్ము చేసుకుని తనని మోసం చేశారని తెలిపారు.

serial Actress Madhavi: ఐదు లక్షలు నష్టపోయాను…

ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తనకు డబ్బును నష్టపోయాననే బాధ కన్నా నమ్మిన వాళ్లే తనని దారుణంగా మోసం చేశారని ఈమె బాధపడ్డారు.ఇక స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేనటువంటి వారు ఇతరులను నమ్మి తనలాగా మోసపోవద్దని అందరికీ ఇది ఒక గుణపాఠం కావాలి అంటూ ఈ సందర్భంగా ఈమె తాను నష్టపోయిన డబ్బు గురించి తెలియజేశారు.ఇక ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హీరో సాయి కిరణ్ ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఎవరో తెలుసా?

హీరో సాయి కిరణ్ అనగానే అందరికీ “అనగనగా ఆకాశం ఉంది..”అనే పాట గుర్తుకు వస్తుంది.ఈ పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సాయికిరణ్ ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. నువ్వే కావాలి సినిమాలో నిజానికి హీరో తరుణ్ అయినప్పటికీ, అనగనగా ఆకాశం ఉంది అనే పాట ద్వారా సాయి కిరణ్ కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలో ఎన్నో మంచి సినిమాలు చేసినప్పటికీ ఆ విజయాన్ని ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఫ్లాప్ సినిమాలలో నటిస్తూ పూర్తిగా సినిమా అవకాశాలను కోల్పోయి ఇండస్ట్రీకి దూరమైన సాయి కిరణ్ ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

సాయికిరణ్ కు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సమయంలో ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారనీ, ఆ హీరోయిన్ మాయలో పడి సినిమాలపై దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులపాటు నిలవలేకపోయాడని పెద్ద ఎత్తున వార్తలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

ఈ విధంగా సినిమా అవకాశాలు రాకపోవడంతో వెండి తెరకు దూరమై బుల్లితెరకు మాత్రమే పరిమితమయ్యారు. ప్రస్తుతం బుల్లితెరపై తాను నటిస్తున్న సీరియల్స్ తనకు ఎంతో సంతృప్తినిస్తున్నాయని కిరణ్ తెలియజేశారు. ప్రస్తుతం మనసిచ్చి చూడు, గుప్పెడంత మనసు సీరియల్స్ ద్వారా ఎంతోమంది గుర్తింపును సంపాదించుకున్నారు సాయికిరణ్.