Tag Archives: husband

పూనమ్ పాండేను దారుణంగా కొట్టిన భర్త.. అసలు కారణం ఇదే!

బాలీవుడ్ నటి పూనమ్ పాండే తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి తన భర్త సామ్ బాంబే గురించి వార్తల్లో నిలిచారు. పూనమ్ పాండే, సామ్ బాంబే రెండు సంవత్సరాలుగా సహజీవనం చేసిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే సామ్ బాంబేకి వివాహం జరిగింది. ఈ క్రమంలోనే నటి పూనమ్ అతనితో సహజీవనం చేసి తనని రెండో పెళ్లి చేసుకుంది.

పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఎన్నో మనస్పర్ధలు రావడం వల్ల తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే ఒకసారి సామ్ తన పై చేయి చేసుకోగా పూనమ్ అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికి తను క్షమాపణ చెప్పడంతో కేసు వెనక్కి తీసుకున్న పూనమ్ ఆ తరువాత ప్రతిసారి వీరిద్దరి మధ్య ఏదో ఒక విషయం గురించి గొడవలు మొదలయ్యాయి.

తాజాగా సామ్ బాంబే నటి పూనమ్ నుజుట్టు పట్టుకొని తన మొహం మొత్తం రక్తస్రావాలు అయ్యేవిధంగా ఎంతో దారుణంగా ఆమెను చితకబాదాడు. ఈ క్రమంలోనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు తనను అరెస్టు చేశారు. అధిక రక్తస్రావంతో బాధపడుతున్న నటిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే సామ్ తన పై చేయి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

సామ్ బాంబే తన మొదటి భార్య అల్వీరాతో తరచూ ఫోన్ మాట్లాడుతూ ఉండేది. ఈ విషయం నచ్చని పూనమ్ తరచూ తన భర్తతో గొడవ పడేది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎంతో విసుగుచెందిన సామ్ ఏకంగా తన జుట్టు పట్టుకొని తన పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇలా తనపై దాడి జరగగానే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం సామ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే?

ప్రస్తుత కాలంలో ఒకరి భార్య మరొకరికి భర్తతో మరొకరి భార్య వేరొకరి భర్తతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అధికమయ్యాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వివాహేతర సంబంధాలు ఉండటం వల్ల రోజుకు ఎంతో మంది హత్యలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాజమహేంద్రవరంలోని బొమ్మూరు బత్తిన నగర్ కు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నగరంలోనీ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా వీరి పక్క వాడలో నివసిస్తున్న అటువంటి రమేష్ అనే వ్యక్తితో దుర్గాప్రసాద్ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి దుర్గాప్రసాద్ కు తెలిసింది.

ఈ క్రమంలోనే తన భార్య గురించి తెలుసుకున్న దుర్గాప్రసాద్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెతో తీవ్రంగా గొడవ పడ్డాడు.ఈ క్రమంలోనే తన భార్య పిల్లలను తన పుట్టింటికి పంపించిన దుర్గాప్రసాద్ ఎలాగైనా రమేష్ ను హత్య చేయాలని భావించాడు. దుర్గా ప్రసాద్ పథకం ప్రకారమే మరొక ఇద్దరి సహాయంతో రమేష్ హత్యకు ప్లాన్ వేశారు.

ఆదివారం దేవి చౌక్ ప్రాంతానికి వచ్చిన దుర్గాప్రసాద్ ను వెంబడించి లింగంపేట వాంబే కాలనీ వద్దకు రాగానే కత్తితో అతనిపై దాడి చేసి అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా అప్పటికే రమేష్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇక హంతకులు ఎవరు అనే విషయం గురించి పోలీసులు ఆరా తీస్తూ ఆ రోజు సాయంత్రానికి హంతకుడు దుర్గా ప్రసాద్ ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఆరువేల కోసం గొడవ పడిన భార్య భర్త.. చివరికి ఏం చేశారంటే?

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు మనస్పర్థలు రావడం సర్వసాధారణం.అయితే ఇలాంటి గొడవలు వచ్చిన సమయంలో ఎవరో ఒకరు సర్దుకుని ముందుకు వెళితే వారి సంసారం పదికాలాలపాటు పచ్చగా ఉంటుంది.కానీ ప్రస్తుత కాలంలో ఏ చిన్నపాటి గొడవ జరిగినా క్షణికావేశంలో ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకొని బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసాంగికాలనీకి చెందిన కోదండం సాయిలు, పోచవ్వ దంపతులకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు. ఈ క్రమంలోనే ఈ దంపతుల మద్య అక్టోబర్ 27వ తేదీ రాత్రి ఆరువేల డబ్బుల విషయంలో గొడవ చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే 28వ తేదీ ఉదయం మరోసారి డబ్బు గురించి గొడవ పడిన భార్య భర్తలు ఆ రోజు సాయంత్రానికి కనిపించకుండా వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే దంపతుల కోసం అన్ని చోట్ల గాలించిన బంధువులు చివరికి మిస్సింగ్ కేసు కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం సాయంత్రం రాజనగర్ ప్రాంతంలోని చర్చి కాలనీలో వీరి మృతదేహాలు బయటపడ్డాయి.

సాయిలు ఒంటికి పట్టించుకోని ఆత్మహత్యకు పాల్పడగా పోచవ్వ పక్కనే ఉన్న కొలనులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే అక్కడ వదిలేసినటువంటి వీరి చెప్పులు, దుస్తులు ఆధారంగా పోలీసులు వీరిని గుర్తించారు. ఇలా చిన్న విషయానికి గొడవపడి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్దఎత్తున విషాదఛాయలు అలుముకున్నాయి.

అదనపు కట్నం తీసుకురాకపోతే.. వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తానంటూ భర్త బెదిరింపులు..!

ఆమెకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పిల్లలు కాలేదు. దీంతో అత్తమామలు వేధింపులు ఎక్కువ అయ్యాయి. దానికి తోడు తన భర్త పొట్టి దుస్తులు వేసుకొని తన ముందు నిలబడి ఫొటోలు దిగాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ వేధింపులు భరించలేక ఆమె బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2016 సంవత్సవరంలో ఎంబీఏ పూర్తి చేసిన సదరు మహిళ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11 లో నివాసం ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఆసక్తి ఉండటంతో ఆ కోర్సులో చేరింది. అందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న మహ్మద్‌ ఫర్హాన్‌(26) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడినే 2017 సంవత్సరంలో పెళ్లి కూడా చేసుకుంది.

ఆ సమయంలో అతడికి రూ.కోటిన్నర విలువైన ఆభరణాలు, వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు ఖరీదైన బహుమతులు అందజేశారు. పెండ్లి అయిన తర్వాత చదువు మానేసి ఇంట్లో ఉండాలని అత్తామామలు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అలాగే ఆమె ఇంట్లోనే ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ ఉంది. తన భర్త లోదుస్తుల్లో తనకు కనిపించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.

అలా వీడియోలు, ఫొటోలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు. ఇంకా తనకు అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించడం.. లేకపోతే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తానని బెదిరించడం మొదలు పెట్టాడు. మరొ పక్క అత్తమామల పోరు భరించలేక ఆమె బంజారాహిల్స్ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తన అందంతో భర్తను ఆకట్టుకున్న భార్య… మూడో రోజే అంత దారుణానికి ఒడిగట్టింది.!

ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు అబ్బాయిలను వెతకడం కోసం ఎన్నో మ్యారేజ్ బ్యూరో లు వచ్చాయి. అదేవిధంగా మ్యారేజ్ బ్రోకర్లు కూడా పెద్ద ఎత్తున వివాహ సంబంధాలను తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలని భావించి ఒక బ్రోకర్ ని సంప్రదించాడు. అతడు చూపించిన కొన్ని ఫోటోలలో ఒక అమ్మాయి అందానికి ముగ్ధుడై, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని హుటాహుటిన పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి చేసుకున్న మూడు రోజులకే ఆ పెళ్లి కొడుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది ఆ భార్య. పూర్తి వివరాలలోకి వెళితే…

రాజస్థాన్ లోని కోట జిల్లా, కునాడి ప్రాంతానికి చెందిన రవి అనే యువకుడు పెళ్లి కోసం ఓ మ్యారేజ్ బ్రోకర్ ని సంప్రదించాడు.ఈ క్రమంలోనే అతను ఓ అందమైన యువతి ఫోటో చూయించడంతో ఆ అమ్మాయిని చేసుకోవడానికి రవి ఎంతో ఇష్టపడ్డాడు.అయితే ఆ అమ్మాయికి కేవలం ఒక అన్న సోనూ మాత్రమే ఉన్నాడని, పెళ్లి చేసుకోవాలంటే అతనిని సంప్రదించాలని చెప్పడంతో వీరిరువురు ఒక హోటల్లో కలిశారు.

ఈ క్రమంలోనే యువతి కోమల్, సోదరుడు తన చెల్లికి ఏ విధమైనటువంటి కట్నకానుకలు సమర్పించుకోలేనని చెప్పడంతో ఆమె అందానికి ముగ్ధుడైన రవి కట్నకానుకలు లేకపోయినా తనని వివాహం చేసుకోవడం తనకు ఇష్టమని తెలిపాడు. ఈ క్రమంలోనే వారిరువురికి ఒక ఆలయంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లి అయిన మూడు రోజులకే కోమల్ ఇంట్లో నగలు డబ్బును తీసుకొని కనిపించకపోవడంతో రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే మ్యారేజ్ బ్రోకర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలోనే బ్రోకర్ కోమల్,సోనూ అన్నా చెల్లెలు కాదని,వారిద్దరూ భార్యాభర్తలనే విషయం చెప్పడంతో రవి కంగుతిన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

ఎప్పుడు గొడవలే అంటూ సంసారం గుట్టు విప్పిన అనసూయ?

బుల్లితెర అందాల యాంకర్ గా, వెండితెర అద్భుతమైన నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక సందర్భాలలో అభిమానులతో ముచ్చటించారు. తన జీవితంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని,తన ప్రేమ పెళ్లి గురించి సినిమా తీయొచ్చని తెలిపిన సందర్భాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.ఎన్‌సీసీ క్యాంప్‌లోతన ప్రేమ మొదలైందని ముందుగా తన ప్రేమ గురించి కాకుండా పెళ్లి చేసుకుందాం అనే ప్రపోజల్ తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. తొమ్మిది సంవత్సరాల ప్రేమ తరువాత పెద్దలను ఒప్పించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యామని ఈ యాంకరమ్మ ఎన్నో సందర్భాలలో తెలిపారు.

ఈ క్రమంలోనే నేడు వాళ్ళ 11 వ వివాహ దినోత్సవం సందర్భంగా తన సంసారం గుట్టును విప్పారు.తన భర్త ఇంట్లో ఎలా ఉంటారు.. ఏంటి.. అనే విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ఇంట్లో తరచూ గొడవలు పడుతున్నాము. మా మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. గొడవలు జరిగిన సమయంలో ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలలో మా మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు మనస్పర్థలు కూడా తలెత్తుతుంటాయని తెలిపారు.

ఈ విధంగా మా ఇద్దరి మధ్య గొడవ జరిగిన వెంటనే ఒకరి చేతిని ఒకరు పట్టుకుని మా మధ్య జరిగిన గొడవలు అన్నింటిని మర్చిపోతాము. అందువల్లే మా ప్రయాణాన్ని ఇన్నిరోజులు కొనసాగించామని నేడు వివాహ దినోత్సవం అయినప్పటికీ ఈ రోజు కూడా పోట్లాడుకున్నామని అందుకే ఎలాంటి కొత్త ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయలేదని ఈ సందర్భంగా అనసూయ తెలియజేశారు.

వరుడికి ప్రియుడు ఫోటోలు పంపడంతో ఆగిపోయిన పెళ్లి..!

మనం సినిమాలలో కొన్ని సన్నివేశాలను చూస్తుంటాము. పెళ్లి జరిగే సమయానికి ఆపండి అనడం మనం వింటూ ఉంటాం. తాళి కట్టే సమయంలో ఏదో ఒక కారణాల వల్ల ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోవడం తరచూ మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి తరహాలోనే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వధువు ప్రియుడి నిర్వాకం వల్ల జరగాల్సిన పెళ్లి ఆగిపోయిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం,అనపర్తి మండలం మహేంద్రవాడలో ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. పెళ్లి కుమార్తె ఒక వ్యక్తిని ప్రేమిస్తున్న సంగతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెకు మరొక వివాహం నిశ్చయించారు. అయితే తాను ప్రేమించిన యువతికి మరొక వ్యక్తితో పెళ్లి జరుగుతుందని కోపంతో నాకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే ఉద్దేశంతో ఆ ప్రియుడు వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను వరుడికి పంపించాడు. ఈ ఫోటోలను చూసిన వరుడు, అతని కుటుంబ సభ్యులు ఈ పెళ్లి జరగడానికి అంగీకరించలేదు.

వరుడు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వధువు కుటుంబ సభ్యులకు తెలియజేసి ఈ పెళ్ళి జరగడానికి ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లి ఆగిపోయింది. వధువు కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి ఎంత చెప్పినా వరుడి కుటుంబ సభ్యులు వినక పోవడంతో ఈ పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ విధంగా పెళ్లి ఆగిపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు కుటుంబ సభ్యులు, బంధువులు వధువు ప్రియుని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఆ ప్రియున్ని అనపర్తి పోలీస్ స్టేషన్లో అప్పగించి అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సునీత, ఆమె భర్త మధ్య ఎంత ఏజ్ గ్యాపో తెలుసా?

తెలుగులో ఎన్నో మధురమైన పాటలు పాడుతూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సింగర్ సునీత తాజాగా రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈమె పెళ్లిపై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరి కొందరు పెళ్లి చేసుకోవడం తప్పేంటి అన్నట్లు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సింగర్ సునీత పెళ్లి చేసుకున్నారు ఇంతకీ ఆమె వయసు ఎంత ఉంటుంది? తను పెళ్లి చేసుకున్న వ్యక్తి రామ్ వయస్సు ఎంత ఉంటుందనే ఆలోచన అందరికీ కలిగింది. ఈ వయసులో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం పట్ల ఒక్కొక్కరు ఒక అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.అయితే రెండో పెళ్లి చేసుకున్న వీరి వయసు ఎంత ఉంటుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సునీత పెళ్లి చేసుకున్న వ్యక్తి రామ్ సూరపనేని డిజిటల్ మ్యాంగో మీడియా కంపెనీకి ఓనర్. ఒక విధంగా చెప్పాలంటే డిజిటల్ మీడియాకు రామ్ ఒక మొగల్ లాంటివాడు. ఇక ఆస్తి విషయంలో రామ్ వందల కోట్లు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అయితే రామ్ తన జీవితంలో ఇది రెండో పెళ్లి అని చెప్పవచ్చు. సునీత ఇద్దరూ కూడా ఈ వయసులో ఒంటరి జీవితంతో గడుపుతున్న నేపథ్యంలో వీరిద్దరూ ఒక్కటై కొత్త జీవితం ప్రారంభించాలని భావించి పెళ్లి వైపు అడుగులు వేశారు.

రామ్ వీరపనేని మే 26, 1974న జన్మించారు. అంటే ఆయన వయసు ప్రస్తుతం 47 ఏళ్ళు. ఇక సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇద్దరి మధ్య కేవలం ఐదు సంవత్సరాల గ్యాప్ మాత్రమే ఉంది. 1995 గులాబీ చిత్రంలో “ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో”అని పాట ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తాను పాడిన పాటకి మంచి స్పందన లభించడంతో వరుస అవకాశాలు వచ్చాయి.ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలానికి తన భర్త నుంచి విడిపోయిన సునీత ప్రస్తుతం తన పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా ఉన్న సునీత ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకున్నారు. సునీత కొడుకు ఆకాష్ ప్రస్తుతం ఢిల్లీలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కూతురు శ్రేయ ఇప్పటికే సినిమాల్లో పాటలు పాడుతూ తల్లికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు.

బట్టతల విషయాన్నీ దాచి పెళ్లి చేసుకున్నాడు… భార్య ఊహించని శిక్ష?

సాధారణంగా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూసి పెళ్ళి నిశ్చయించుకుంటారు. అలాగే అబ్బాయిల విషయంలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అతని గురించి విచారణ చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. అలా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లి చూపులప్పుడు పెళ్ళికొడుకు తనకు బట్టతల ఉందన్న విషయం దాచి పెళ్లి చేసుకోవడం వల్ల అతనిపై పరువునష్టం కేసు వేయడం తాజాగా ముంబై నగరంలో చోటు చేసుకుంది.

ముంబై నగరంలోని మీరా రోడ్లో నివాసముండే 29 ఏళ్ల వ్యక్తి నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ వ్యక్తి గత నెల క్రితం చార్టెడ్ అకౌంట్ గా ఉద్యోగం చేసే 27ఏళ్ల మహిళతో వివాహం జరిపించారు. ఆ వ్యక్తికి బట్టతల ఉండడంతో గత కొద్ది సంవత్సరాల నుంచి విగ్గును పెట్టుకొని మేనేజ్ చేస్తూ వచ్చాడు. అదేవిధంగా తన పెళ్లి చూపులప్పుడు కూడా తనకు బట్టతల ఉన్న విషయం అమ్మాయి వారితో చెప్పకుండా వివాహం జరిపించారు. వివాహమైన కొద్ది రోజులకు అసలు విషయం బయటపడడంతో తన భార్య మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని ఆరోపించింది.

అబ్బాయిలకు బట్టతల ఉండడం సర్వసాధారణమేనని అబ్బాయి తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఆమె వినకుండా, నయా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్న భర్త పై తగిన చర్యలు తీసుకోవాలని, అతడికి సహకరించిన తన తల్లిదండ్రుల పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బట్టతల ఉందన్న విషయం ముందుగా తెలిసి ఉంటే పెళ్ళికి అంగీకరించేది కాదని బాధిత మహిళ పోలీసుల దగ్గర తన గోడును వెల్లడించింది. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నందుకు గాను పరువు నష్టం కింద తన భర్త, అత్త,మామల పై కేసు నమోదు చేశారు.