ఆమెకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పిల్లలు కాలేదు. దీంతో అత్తమామలు వేధింపులు ఎక్కువ అయ్యాయి. దానికి తోడు తన భర్త పొట్టి దుస్తులు వేసుకొని తన ముందు నిలబడి ఫొటోలు దిగాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ వేధింపులు భరించలేక ఆమె బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2016 సంవత్సవరంలో ఎంబీఏ పూర్తి చేసిన సదరు మహిళ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11 లో నివాసం ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఆసక్తి ఉండటంతో ఆ కోర్సులో చేరింది. అందులో భాగంగానే సికింద్రాబాద్లోని గన్రాక్ ఎన్క్లేవ్లో ఉంటున్న మహ్మద్ ఫర్హాన్(26) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడినే 2017 సంవత్సరంలో పెళ్లి కూడా చేసుకుంది.
ఆ సమయంలో అతడికి రూ.కోటిన్నర విలువైన ఆభరణాలు, వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు ఖరీదైన బహుమతులు అందజేశారు. పెండ్లి అయిన తర్వాత చదువు మానేసి ఇంట్లో ఉండాలని అత్తామామలు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అలాగే ఆమె ఇంట్లోనే ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ ఉంది. తన భర్త లోదుస్తుల్లో తనకు కనిపించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.
అలా వీడియోలు, ఫొటోలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు. ఇంకా తనకు అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించడం.. లేకపోతే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తానని బెదిరించడం మొదలు పెట్టాడు. మరొ పక్క అత్తమామల పోరు భరించలేక ఆమె బంజారాహిల్స్ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…