Tag Archives: indraja

కాస్టింగ్ కౌచ్ పై నటి ఇంద్రజ సంచలన వ్యాఖ్యలు.. ఆమె ఏం చెప్పారంటే..

మూడు సంవ‌త్స‌రాలుగా కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండ‌స్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది. 2018 లో మీటూ అంటూ ఈ ఉద్యమం దేశం మొత్తం షికార్లు కొట్టింది.

ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రీ కాస్టింగ్ కౌచ్ గురించి చెపుతున్నారు. ఎవరు తమను ఇబ్బంది పెట్టారో చెబుతున్నారు. టాలీవుడ్ లో కూడా కొంతమంది నటీమణులు బయటకు వచ్చి చెప్పినప్పటికీ .. ప్రత్యేకంగా వాళ్లు ఎవరు అనేది బయట పెట్టలేదు. ఇదే విషయమై నటి శ్రీ రెడ్డి పెద్ద యుద్దమే చేసిన విషయం తెలిసిందే.

ఆ ఘటన తర్వాతే చాలామంది హీరోయిన్లు బయటకు వచ్చి తాము కూడా కాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు చెప్పారు. ఈ విషయంలో కొంతమంది లొంగిపోవడంతో వేధింపులు ఎదురు కాలేదు అంటూ సెటైర్లు కూడా వేశారు. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా అలనాటి తార ఇంద్రజ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇక ఇదంతా కామ‌న్ అని చెప్పిన ఇంద్రజ.. తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండ‌డంతో క్యాస్టింగ్‌ కౌచ్‌ నుంచి త‌ప్పించుకోగ‌లిగామని ఆమె తెలిపింది.

ప్రతీ రంగంలోనూ ఇలాంటిది ఉంటుందన్నారు. ఇది కామన్ అంటూ చెప్పుకొచ్చారు. ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ఎక్కడకు వెళ్తున్నారు.. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను గమనించి.. ఏదైనా సమస్య ఉంటే.. పరిష్కరించుకోవాలని సూచించారు.

యమలీలకు ఒక్క నంది అవార్డు రాకపోవడంపై ఇప్ప‌టికీ తీవ్ర అసంతృప్తితో అలీ!

ఎస్. వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘యమలీల’ అనేది అతడి కెరీర్ లోనే మైలురాయని చెప్పుకోవచ్చు. ఇందులో అలీని హీరోగా పరిచయం చేస్తూ పెద్ద ప్రయోగం చేశాడు. కానీ అతడు తీసుకున్న నిర్ణయం సరైందేనని.. సినిమా విడుదల అయిన తర్వాత అందరికీ తెలిసింది. సగటు ప్రేక్షకుడు సైతం.. అతడు చూపించిన సెంటిమెంట్ కు ఫిదా అయిపోయారు.

అందులో సంగీత దర్శకుడిగా ఎస్. వీ కృష్ణారెడ్డి అందించిన బాణీలు సినిమాకు పెద్ద హైలెట్ గా నిలిచాయి. 1994 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఇదంతా ఇలా ఉండగా.. సినిమాకు ఎక్కువగా నంది అవార్డులు రాలేదని అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.

ఆ సంవత్సరంలో ప్రకటించిన అవార్డుల్లో ఈ సినిమాకు కేవలం ఒకే ఒక్క అవార్డు వరించింది. అదే బెస్ట్ సినమాటోగ్రఫి అవార్డు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఇంద్రజ, అలీ మాట్లాడుతూ.. ఆ సినిమాకు బెస్ట్ ఫిలింతో పాటు.. బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్ అవార్డులు రావాల్సింది.. కానీ ఆ అవార్డుల ప్రధానోత్సం తీవ్ర నిరాశను కలిగించిందని అలీ అన్నారు.

దీనిపై ఇంద్రజ స్పందిస్తూ.. అవునా.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అన్నా ఇవ్వాల్సింది.. అందులోని పాటలు అంత మధురంగా ఉంటాయని చెప్పుకొచ్చింది ఇంద్రజ. ఇక అప్పటినుంచే అవార్డులపై ఇంట్రెస్ట్ పోయిందని.. వాటిపై ఎలాంటి ఆసక్తి లేదని.. అలీ అసహనం వ్యక్తం చేశాడు. యముడిగా కైకాల సత్యనారాయణ ఆ సినిమాలో ఎంతో ఒదిగిపోయి నటించారు. ఇలా మొత్తానికి సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.

“ఊహ తెలిసినప్పటి నుంచి అన్నీ నాన్నే.!” ఎమోషనల్ అయిన ఇంద్రజ.. వైరల్ గా మారిన వీడియో..!


బుల్లితెరపై ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న షో అనగానే చాలామందికి టక్కున చెప్పే సమాధానం జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ కామెడీ షో. ఎందుకంటే దాని టీఆర్ పీ రేటింగ్ ఆవిధంగా ఉంటుంది మరి. ఇందులో వచ్చి పాల్గొన్న ప్రతీ ఒక్కరు పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినీ నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో జడ్జిగా పరిచయమైన ఇంద్రజ.. బుల్లితెరపై అతి తక్కువ సమయంలో ప్రేక్షకులను మెప్పించింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా అందరినీ మెప్పించిన ఇంద్రజ తర్వాత ఈటీవీలోనే ప్రసారం అవుతున్నా మరో ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కూడా పాల్గొని తన డాన్సులతో, నవ్వులతో బాగా సందడి చేస్తుంది. ఇలా తెలుగు ఆడియెన్స్ కు టచ్ లో ఉంటూ ఇంద్రజ పలు షోలో కనిపిస్తుంది.

తాజాగా ఇంద్రజ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ కామెడీ షోలో పాల్గొని ఎమోషనల్ అయ్యారు. ఇందులో ఓంకార్ హోస్టింగ్ చేస్తూ.. వచ్చిన సెలబ్రిటీలను టెన్షన్ లో ముంచుతాడు. దీంతో ఈ వారం ఎపిసోడ్ లో ఇంద్రజ పాల్గొంది. ఆమెతో పాటు సుడిగాలి సుధీర్ కూడా పాల్గొన్నాడు. షో మధ్యలో ఇంద్రజ కుటుంబానికి సంబంధించి ఒక ఫొటోను ఓం కార్ డిస్ ప్లే లో చూపించారు.

అందులో ఆమె తన నాన్నతో పాటు కుటుంబసభ్యులు ఉన్నారు. దాంతో తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు షోలో పంచుకుంది. తన తండ్రి అంటే ఇష్టమని చిన్నప్పటి నుంచి అన్నీ ఆయనే అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది. తండ్రి ప్రేమ ఎంతో స్వచ్చమైనదంటూ.. తండ్రి లేకుంటే కుంటుంబం అనేది ఉండదని ఆమె చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

వానలో చిందులేస్తూ రచ్చ చేసిన ఇంద్రజ.. ఆమె డాన్స్ చూసి అంతమాటన్న సుడిగాలి సుదీర్?

బుల్లితెరపై సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమం “శ్రీదేవి డ్రామా కంపెనీ”.అన్ని రకాల ప్రేక్షకులకు వినోదం పంచుతూ ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ కార్యక్రమం తాజాగా 25వ ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ వారం ప్రసారమయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ హీరోయిన్లు ఇంద్రజ లైలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ క్రమంలోనే ఇంద్రజ స్టేజి మీద వానలో “మెరిసింది మేఘా మేఘా” అంటూ చిందులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఇంద్రజకు తోడుగా లైలా కూడా కాలు కదిపారు. ఈ విధంగా స్టేజ్ పై ఇంద్రజ వేసిన స్టెప్పులు చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.

ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ దాదాపు 18 సంవత్సరాల తర్వాత స్టేజ్ పై డాన్స్ వేశానని చెప్పడంతో సుడిగాలి సుదీర్ అందరూ చూస్తుండగానే…” 18 ఏళ్ల తర్వాత చేసినప్పటికీ, 18 ఏళ్ల పిల్లల డాన్స్ చేశారు” అని అనడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఇక ఈ ప్రోమోలో హైపర్ ఆది చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

జబర్దస్త్ గెస్ట్ గా వచ్చి.. రోజా పోస్ట్ కే ఎసరు పెట్టిన ఇంద్రజ!

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధిక రేటింగ్స్ దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి ఉన్న ఫాలోయింగ్ మరే షో కి లేదని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం మొదటి రోజులలో కొన్ని విమర్శలు తలెత్తిన ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో నవ్వులు వెల్లివిరుస్తాయి.

జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతోమంది ఆర్టిస్టులను ప్రస్తుతం సినిమాల్లో కూడా నటించే స్థాయికి తీసుకెళ్లింది. వారంలో రెండు రోజులు జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ పేర్లతో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి యాంకర్ లుగా రష్మి, అనసూయ వ్యవహరిస్తున్నారు.అదేవిధంగా జడ్జిగా మొదట్లో నాగబాబు, రోజా ఉన్నప్పటికీ నాగబాబు కొన్ని కారణాలవల్ల ఈ షో నుంచి తప్పుకున్నారు. అయితే నాగబాబు స్థానంలో సింగర్ మనోవచ్చినప్పటికీ ఈ షోకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.

మరొక జడ్జి రోజా తాజాగా అనారోగ్య కారణాల వల్ల తాత్కాలికంగా విరామం తీసుకోవడంతో రోజా స్థానంలో నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.జడ్జ్ గా ఇంద్రజకి ప్రారంభం నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా తన నవ్వులతో ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది. జబర్దస్త్ షోలో వచ్చే కామెడీ కన్నా ఈమె నవ్వు కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు.

ప్రతి ఎపిసోడ్ ప్రోమో ప్రారంభంలో ఇంద్రజ నవ్వులకు ఓట్లు అడగగా వేల సంఖ్యలో ఓట్లు వచ్చేవి, మరికొందరైతే జడ్జిగా ఇంద్రజ వ్యవహరిస్తే ఎంతో బాగుంటుందని కామెంట్లు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తక్కువ కాలంలోనే ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఇంద్రజ నవ్వులకు వేల సంఖ్యలో లైక్స్ రావటం ఎంతో విశేషం. ఈ క్రమంలోనే ఇంద్రజ ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే రోజా పోస్ట్ కి దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యంతో కొన్ని రోజుల పాటు వదిలేసిన రోజాను తిరిగి ఈ షోకు జడ్జీగా తీసుకు వస్తారా? లేక తక్కువ సమయంలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఇంద్రజను వదిలేస్తారా? అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి.