Tag Archives: jobs

Telangana Jobs: తెలంగాణలో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు..! మొదలైన కొలువుల జాతర!

Telangana Jobs: తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఖాళీల జాబితా కేబినేట్ ముందుకు రానుంది. అన్ని కుదిరితే ఈ నెలాఖరులోగా నిరుద్యోగులకు తీపి కబురు అందనుంది. ఉద్యోగాల భర్తీపై రాష్ర్టంలోని నిరుద్యోగులు దాదాపుగా నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వారి ప్రిపరేషన్ కూడా ప్రారంభించారు.

Telangana Jobs: తెలంగాణలో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు..! మొదలైన కొలువుల జాతర!

సుమారు 60వేల ఖాళీలను గుర్తించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడింది. నిధులు, నీటిపారుదల ప్రాజెక్టుల సంగతి ఎలా ఉన్నా.. నియామకాల విషయంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటి వరకు గ్రూప్-1, 3 నోటిఫికేషన్లే రాలేదు. మరోవైపు గ్రూపు-2 పోస్టులను ఒక్కసారే భర్తీ చేసింది.

Telangana Jobs: తెలంగాణలో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు..! మొదలైన కొలువుల జాతర!

రమారమీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 1.30లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. వీటిల్లో ఎక్కువగా పోలీస్, విద్యుత్తు, టీఎస్పీఎస్పీ, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల్లోనే ఖాళీలను భర్తీచేసింది. ఉపాధ్యాయుల ఖాళీలకు సంబంధించి టీఆర్టీ నోటిఫికేషన్ సుమారు 9వేల పోస్టులతో 2016లో వచ్చింది. నాటినుంచి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయలేదు. దీనికోసం పెద్ద సంఖ్యలో బీఈడీ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ఇది భవిష్యత్తులో తెరాస ప్రభుత్వానికి రాజకీయంగా..

దీనికి సంబంధించి టెట్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం సర్కారు జారీ చేయనున్న ఉద్యోగ ప్రకటనల్లో ఎక్కువ సంఖ్యలో పోలీస్, విద్యా, ఆరోగ్య రంగాలకు చెందిన శాఖల్లోనే ఎక్కువ భర్తీ చేసే అవకాశముంది. ఇప్పటికి భర్తీ చేసిన ఖాళీల్లో పోలీసు ఉద్యోగాలే అధికంగా ఉండటం విశేషం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నియామకాలపై సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దుబ్బాక ఉపఎన్నిక నుంచి ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల సమయాల్లో తెరాస అగ్రనాయకత్వం ఉద్యోగ ఖాళీల భర్తీపై హామీలు ఇస్తూ వచ్చింది. అయినా నేటికీ నియామక ప్రకటన రాలేదు. ఇది నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. ఇది భవిష్యత్తులో తెరాస ప్రభుత్వానికి రాజకీయంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా, మల్టీ, బహుళ జోన్లు ఖరారు చేస్తూ రాష్ర్టపతి ఉత్తర్వులు వచ్చాయి. ఆయా జోన్లకు సంబంధించిన ఖాళీల వివరాలు సీఎంవో కార్యదర్శి శేషాద్రి వద్ద ఉంది. దీనికి ఆయన కేబినేట్ కు సమర్పించనున్నారు. ఈ పరిణామాలన్నీ సజావుగా జరిగితే ఈ నెలాఖరులో నిరుద్యోగులకు శుభవార్త అందనుంది.

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

Budget Session: పార్లమెంట్ లో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా విమర్శించారు. 

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు తమ విభజన డిమాండ్ల సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు.

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

రాజ్యసభలో జీరో అవర్ లో రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలంటూ.. టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవతున్నా… కేంద్ర ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఢిల్లీలో తెలంగాణ భవన్ కు భూమి, గిరిజన యూనివర్సీటీని ఏర్పాటు చేయలేదని కేంద్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.


విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని ..

మరోవైపు ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభలో జీరో అవర్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలని కేంద్రాన్ని కోరారు. పేపర్ లీక్, కోర్ట్ కేసులతో ఒక పరీక్ష మూడేళ్ల పాటు నడుస్తోందని… దీని వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Cognizant: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ! కాగ్నిజంట్‌లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

Cognizant: రెండేళ్ల క్రితం మొదలైన కరోనా మహమ్మారి… ప్రపంచ దేశాలను ఇప్పటికీ పట్టి పీడిస్తోంది. వరస లాక్ డౌన్లు, కరోనా వేవ్ లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయ్యాయి. దీంతో పలు రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడింది.

Cognizant: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ! కాగ్నిజంట్‌లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

దీంతో చాలా రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇటీవల ఇండియా ఎకనామిక్ సర్వేలో కూడా ఒక్క వ్యవసాయ రంగంం తప్పితే.. మిగతా రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడిందని తెలిపింది. ఇదిలా ఉంటే కొత్త ఉద్యోగాలు కూడా రాలేదు.

Cognizant: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ! కాగ్నిజంట్‌లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పలు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఆశించి స్థాయిలో లాభాలు రాకపోవడంతో పలు ఐటీ కంపెనీలు రిక్రూట్ మెంట్ కు దూరంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రెషర్స్ ని రిక్రూట్ చేసుకునేందుకు సన్నద్ధం అవుతున్నాయి. 

2021లో కాగ్నిజెంట్ సుమారు రూ. 1.39 లక్షల కోట్ల ..

తాజాగా ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ 2022లో ఏకంగా 50 వేల మంది ప్రెషర్స్ ని తీసుకోనుంది. కాగ్నిజెంట్ చరిత్రలోనే ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యగులను రిక్రూట్ చేసుకోవడం తొలిసారి. గతేడాది ఇదే సంస్థ 33 వేల మంది ప్రెషర్లను తీసుకుంది. దీంతో 2021 అక్టోబర్ నాటికి కాగ్నిజెంట్ లో ఉద్యోగుల సంఖ్య మొత్తం 3,30,600కు చేరింది. ఇదిలా ఉంటే 2021లో కాగ్నిజెంట్ సుమారు రూ. 1.39 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. 2020తో పోలిస్తే ఇది రెండు అంకెల వృద్ధి రేటు కావడం విశేషం. ఇక వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 10.2 శాతం నుంచి 11.2 శాతానికి ఆదాయం పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది.

Jobs In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తిరుపతి ఐఐటీలో ఖాళీలు..!

Jobs In AP: ఐఐటీలో చదవాలనేది ప్రతి విద్యార్థి కోరికగా ఉంటుంది. అంతటి ప్రతిష్టాత్మక యూనివర్సీటీలో ఉద్యోగాలు చేయాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటుంది. అటువంటి వారికి ఓ సదవకాశం. ఏపీలోని తిరుపతి ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఔట్ సోర్సింగ్  ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 

Jobs In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తిరుపతి ఐఐటీలో ఖాళీలు..!

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి దరకాస్తులు కోరతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలనను భర్తీ చేయనున్నారు.   భర్తీ చేయనున్న పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఆఫీసర్లు 3, ప్రాజెక్ట్ అసిస్టెంట్లు 3 ఖాళీలు ఉన్నాయి. వెబ్ డెవలప్మెంట్, నెట్వర్క్ విభాగాల్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. 

Jobs In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తిరుపతి ఐఐటీలో ఖాళీలు..!

ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలను కూడా నోటిఫికేషన్ లో పొందుపరిచారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు పోస్టులకు అర్హులు. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. 

నెలకు రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ..

సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ప్రాజెకట్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ, బీఎస్సీ సీఎస్, బీసీఏ డిగ్రీలు కలిగిన వారు అర్హులు. అయితే కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంట్లో కూడా అనుభవం, టెక్నికల్ నైపుణ్యత కలిగి ఉండాలి. నెలకు రూ. 20,000 నుంచి రూ. 30000 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 27 ఏళ్లకు మించరాదు. ఎంపిక విధానానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్షప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజిల్లో జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 11,2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు  https://www.iittp.ac.in/ వెబ్ సైట్ లో చూడాలి.

Good News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

Good News: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగాల భర్త చేపడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఖాళీల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్ పై కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో కూడా త్వరలోనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయనే హింట్ ఇచ్చారు.

Good News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

దీంతో ఎన్నాళ్ల నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం రానుంది.  కొత్త జోనల్ విధానంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగానే డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2018 రాష్ట్రపతి ఉత్తర్వలుకు లోబడి… కొత్తజోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టారు.

Good News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

దీంతో ఉద్యోగులు తమ స్థానికత మేరకు ఆయా జిల్లాలకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం పరస్పర అంగీకారంతో ఉద్యోగులు బదిలీ అయ్యేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రక్రియ కూడా త్వరలోనే ముగిసే అవకాశం ఉంది.


ఉద్యోగ భర్తీకి కసరత్తు ..

ఉద్యోగులు పూర్తి స్థాయి విభజన, బదిలీల తరువాత ఏయే డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై ప్రభుత్వానికి క్లారిటీ రానుంది. ఖాళీలకు అనుగుణంగా ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈనెలలోనే కొన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు కూడా ఉద్యోగ భర్తీకి కసరత్తు మొదలుపెట్టారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే… నిరుద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి వేచి చూస్తున్నవారి కల తీరనుంది.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

Andhrapradesh: ఏపీలో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. కొత్తగా ప్రకటించిన పీఆర్సీ తమకు సమ్మతం కాదని.. ఉద్యోగులు నిరసన బాట పట్టారు. తమ నిరసనలను కొనసాగిస్తూ… ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

మరోవైపు తమ డిమాండ్ల నెరవేరకపోతే ఈ నెల 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఇదివరకే హెచ్చరించారు. 
మరోవైపు ప్రభుత్వం ఉద్యోగులను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు తమ సమస్యలను మంత్రుల కమిటీకి చెప్పాలని చర్చలకు ఆహ్వానించారు.

Andhrapradesh: ఓ వైపు నిరసనలు, ఆందోళనలు..! మరోవైపు తమ పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం..!

అయితే ఉద్యోగుల మాత్రం చాలా సార్లు కమిటీ ఆహ్వానానికి స్పందించలేదు. అయితే నిన్న మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. కాగా ముఖ్యంగా మూడు డిమాండ్లపై ఉద్యోగులు పట్టుబట్టడంతో చర్చలు విఫలం అయ్యాయి. 


ఉద్యోగులు నిరసనలు, ఆందోళనతో..

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు నిరసనలు, ఆందోళనతో ఏమాత్రం భయపడటం లేదు. తాజాగా ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. ఓ వైపు నిరసనలు, ఆందోళనలను పట్టించుకోకుండా… రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అకౌంట్లలో వేతనాలను జమచేసింది. పదకొండవ పీఆర్సీ ప్రకారం ఉద్యో గుల అకౌంట్లలో ఉదయం నుంచే వేతనాలు పడిపోయాయి. ప్రతి నెలా ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు అందుతుండగా.. ఈ నెలలో మాత్రం బుధవారం ఉదయం లోపు అందరికీ వేతనాలు పడ్డాయి. ఇదిలా ఉంటే ట్రెజరీ ఉద్యోగులకు మాత్రం వేతనాలు ఇంకా పడలేదు. వేతన బిల్లులు ప్రాసెస్ చేయకపోవడంతో.. ట్రెజరీ ఉద్యోగులపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు.

గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. విషయం ఏంటంటే..?

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జీతాల పెంపురానే వచ్చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్షణ, కస్తూరిభాగాంధీ విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రాతి పదికన పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ సంస్థల్లో పని చేస్తున్న ప్రతీ ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జీతాలు పెంచుతన్నట్లు పేర్కొన్నారు. ఆ ఉద్యోగులకు జీతాలు మొదట 20 శాతం వేతనాలు పెంచాలనే ఆలోచన ఉండగా.. మరికొన్ని ఎలిమెంట్స్ ను దృష్టిలో ఉంచుకొని..30 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు. అంతే కాకుండా మరో బొనాంజాను ప్రకటించారు.

ఈ పెంచిన జీతాలను ఈ నెల నుంచి కాకుడా 2021 జూన్ మాసం నుంచి అమలు చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. అంటే ఆరు నెలల జీతం అదనంగా రానుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. సమర్థవంతంగా పని చేస్తున్నారాని కితాబిచ్చారు. ఇక ముందు కూడా ఇలాంటి పనితనమే చూపించాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇక వర్క్ విషయంలో గానీ.. పని చేసే ప్రదేశంలోగానీ ఎమైనా సమస్యలు ఉంటే.. వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ.. కృతజ్ఞతలు తెలియజేశారు. మరి కొంతమంది అయితే స్వీట్స్ పంచి పెట్టారు.

నిరుద్యోగులకు శుభవార్త.. 18 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్..?

తెలంగాణలో గత రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదు. దీంతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. కోచింగ్ లు తీసుకొని.. వేలల్లో ఖర్చు పెట్టి.. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నారు.

అయితే ఇన్ని చేస్తున్నా నోటిఫికేషన్ మాత్రం రాకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. జనరల్ నోటిఫికేషన్ ఒక్కటి కూడా విడుదల చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నాలుగు నెలల క్రితం టీఎస్పీఎస్సీ నుంచి ఓ నోటిఫికేషన్ విడుదల చేసినా.. అది అందరికీ ఎలిజిబిలిటీ లేనిదే. కామన్ నోటిఫికేషన్ అంటే గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 నోటిఫికేషన్లు వేయాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు.

ఈ మధ్య టీఎస్పీఎస్సీ దగ్గర నిరసనలు కూడా వ్యక్తం చేశారు. తాజా సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్త అందించింది. రాష్ట్రంలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 1.20 లక్షల టీచర్ పోస్టులకు గాను ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వీటిని కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా విభజించి.. కేటాయించనున్నారని తెలుస్తోంది.

దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారనే సమాచారం. వీటితో పాటు.. బోధనేతర సిబ్బంది 1500 పోస్టులు, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను సైతం కొత్త జిల్లాల వారీగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటిని కూడా త్వరలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

ఏపీ హైకోర్టులో జాబ్ లు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 174 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దానికి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ 2021 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కాగా.. చివరి తేదీగా సెప్టెంబర్ 30, 2021 గా నిర్ణయించారు.

అంటే దరఖాస్తుకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://hc.ap.nic.in/ వెబ్‌సైట్ చూసి.. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా దరఖాస్తులను నిపాలని సూచించారు. అందులో ముఖ్యంగా 71 అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 29 పోస్టులు ఎగ్జామినర్, 35 పోస్టులు టైపిస్టు, 39 పోస్టులు కాపీయిస్ట్ ఉన్నట్లు తెలిపారు.

దీనికి అర్హతగా ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు టైప్‌రైటింగ్ (ఇంగ్లీష్) హయ్యర్ గ్రేడ్‌లో ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామ్ పాస్ కావాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. 18 నుంచి 42 ఏళ్ల మద్య వయస్సుగల అభ్యర్థలు దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్ష ఆధారంగా ఎంపికచేయనున్నారు. దీనికి వేతనంగా

జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయని.. ఆసక్తి గల అభ్యర్థలు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు https://hc.ap.nic.in/ ను సందర్శించి అందులో నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకొని దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ మోడ్ లో మాత్రమే పంపాలని పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త.. 1500 వరకు ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు..

నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి.. ఈ నెల 9 న ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలకు జాబ్ మేళా ఉంటుందని.. రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిణి జయశ్రీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పూర్తి వివరాలకు 8309877396 నెంబర్‌లో సంప్రదించాలిని అధికారిణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటీ రంగంలోని పేరుగాంచిన జియో మార్ట్‌, స్విగ్గీ, అపోలో ఫార్మసీ, స్చైండర్‌ ఎలక్ట్రిక్‌, జేఎస్‌ఆర్‌ గ్రూప్‌, వేగారియస్‌ సొల్యూషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆక్సిస్‌ బ్యాంక్‌, బిగ్‌ సి, కార్వీ, ఓజాస్‌ ఇన్నోవేటివ్‌, టెక్నాలజీస్‌, విర్టస్‌ ఐటీ ఇండియా వంటి కంపెనీల పొల్గొటాయని పేర్కొన్నారు.

దీనిలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌, మ్యానుప్యాక్చరింగ్‌, మార్కెటింగ్‌, ఐటి, ఐటీఈఎస్‌, ఫార్మా,హెచ్‌పీ తదితర ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా ఉంటుందని వివరించారు. పదో తరగతి, బీటెక్, ఇంటర్, ఎంటెక్, గ్రాడ్యుయేట్‌, పీజీ , డిప్లామా చేసిన వాళ్లు దీనికి అర్హులుగా పేర్కొనాన్నారు.

18 ఏళ్ల నంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు. దీనిలో ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం ఉంటుందని.. మొత్తం 1500 కి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. హబ్సిగూడలోని ఓమేగా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఆవరణలో నిర్వహించే జాబ్‌మేళాలో ఈ నెల 9న అంటే గురువారం రోజున పాల్గొనాలని పేర్కొన్నారు.