Tag Archives: jobs

నిరుద్యోగులకు శుభవార్త.. 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 200 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హెటిరో డ్రగ్స్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కాగా 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2016 నుంచి 2020 లోపు బీఎస్సీ కెమిస్ట్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

https://www.apssdc.in/ ద్వారా ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆధ్యర్యంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలరోజుల పాటు శిక్షణా తరగతులు ఉంటాయి. విజయవంతంగా శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. బీఎస్సీ కెమిస్ట్రీ కాకుండా ఇతర కోర్సులు చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోకూడదు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 11,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ప్రొడక్షన్ అలవెన్స్, ప్రొడక్షన్‌ ఎక్స్‌పెన్స్, నైట్ ఫిఫ్ట్ అలవెన్స్ కింద మొత్తం 16,800 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఏపీకి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తివివరాలు ఉంటాయి. వేతనం తక్కువ అయినప్పటికీ ఉద్యోగులకు అనుభవాన్ని బట్టి వేతనం పెరిగే అవకాశం ఉంటుంది.

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ వయస్సులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలనే వారికి ఈ ఉద్యోగాలు మంచి అవకాశమని చెప్పవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా సార్టింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌, లోయర్ డివిజనల్ క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం ఉందని సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉండగా 200 మార్కులకు 100 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ఒక్కో విభాగానికి 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి.

ఈ పరీక్ష ద్వారా ఎంపికైన వారు టైర్ 2 కు, టైర్ 2 పరీక్షలో ఎంపికైన వారికి టైర్ 3 పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం ఉద్యోగాలలో జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, లోయన్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలు 1538 ఉండగా సార్టింగ్‌ అసిస్టెంట్‌ లేదా పోస్టల్‌ అసిస్టెంట్ ఉద్యోగాలు 3181 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా డిసెంబర్ 15, 2020 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

‘ :https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2021 సంవత్సరం ఏప్రిల్ నెల 12 నుంచి 27వ తేదీ వరకు టైర్ 1 పరీక్ష జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. అరబిందో ఫార్మాలో ఉద్యోగాలు..?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 150 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

బీ.ఫార్మసీ, డిప్లొమా చదివిన అభ్యర్థులతో పాటు మెకానికల్, ఫిట్టర్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ చదివిన ఐటీఐ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్లు సైతం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఉత్తీర్ణులైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 150 ఉద్యోగాలలో బీ ఫార్మసీ చదివిన వాళ్లకు 30 ఖాళీలు, డిప్లొమా చదివిన వాళ్లకు 50 ఖాళీలు ఉన్నాయి.

ఐటీఐ ఉద్యోగాలకు 50 ఖాళీలు ఉండగా బీఎస్సీ కెమిస్ట్రీ 20 ఖాళీలు ఉన్నాయి. అర్హత, అనుభవం ఆధారంగా వేతన చెల్లింపులు ఉంటాయి. టెక్నికల్ రౌండ్, హెచ్. ఆర్ రౌండ్ ద్వారా ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట మండలంలోని కంపెనీ కార్యాలయంలో ఎంపికైన అభ్యర్థులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఓఎన్జీసీలో 75,000 వేతనంతో ఉద్యోగాలు..?

ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆసక్తి ఉంటే కాంట్రాక్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎన్జీసీ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచి భవిష్యత్తును పొందవచ్చు.

ఈ ఉద్యోగాలకు మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 15వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. https://www.ongcindia.com/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

బ‌్యాచిల‌ర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిల‌ర్ ఆఫ్ స‌ర్జ‌రీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. 1 : 10 ప‌ద్ధ‌తిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ లో 70 శాతం మార్కులకు, 30 శాతం ఇంటర్వ్యూకు మార్కులు కేటాయించడం జరుగుతుంది. మొత్తం 8 ఉద్యోగాలు ఉండగా కాంట్రాక్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ – ఫీల్డ్ డ్యూటీ ఉద్యోగాలు ఆరు ఉన్నాయి.

కాంట్రాక్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ – జ‌న‌ర‌ల్ డ్యూటీ ఒక ఉద్యోగ ఖాళీ ఉండగా మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ ఆక్యుపేష‌న‌ల్ హెల్త్ ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 72,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఉద్యోగాలు..?

ఏపీ ప్ర‌భుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 31 ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదలైన నోటిఫికేషన్ లో డీఈఓ, హౌజ్‌కీప‌ర్, లైబ్రేరియ‌న్‌, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. https://spsnellore.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు నెల్లూరులోని ప్ర‌భుత్వ న‌ర్సింగ్ కాలేజీకి దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 2020 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కౌన్సెలింగ్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు ఉద్యోగ ఖాళీలను బట్టి అర్హతలో మార్పులు ఉన్నాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ, పీజీడీసీఏ వరకు ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో అర్హత ఉంది. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం బట్టి వేతనం లభిస్తుంది. ఈ నెల 5వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాతపరీక్ష లేకుండా ఆర్‌సీఎఫ్ఎల్ లో ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యేవి. అయితే ఈ సంవత్సరం మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 358 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, అటెండెంట్ ఆప‌రేట‌ర్‌, స్టెనోగ్రాఫ‌ర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా డిసెంబర్ 22 దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. https://www.rcfltd.com/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. విభాగాలను బట్టి 8వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఉద్యోగాన్ని బట్టి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఉంటుంది. 50 శాతం ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగాలకు వయస్సు అర్హతను బట్టి ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఉద్యోగాలకు సంబంధించి వయో సడలింపులు ఉంటాయి.

అయితే ఈ ఉద్యోగాలకు వేతనం తక్కువగా ఉండటం గమనార్హం. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 7,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అయితే ఉద్యోగంలో చేరిన తరువాత అనుభవం ఆధారంగా వేతనాల పెంపు జరుగుతుంది.

డిప్లొమా చదివిన వాళ్లకు గుడ్ న్యూస్.. 24,000 రూపాయల వేతనంతో ఉద్యోగాలు..!

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిప్లొమా చదివిన వాళ్లకు శుభవార్త చెప్పింది. 70 డిప్లొమా ఇంజనీర్‌‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. https://ntpccareers.net/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఎన్టీపీసీ మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.

ఇంజనీరింగ్ లో డిప్లొమా పాసైన వాళ్లు సైతం ఈ ఉద్యోగాల కోసం భర్తీ చేసుకోవచ్చు. 70 శాతం మార్కులతో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 25 సంవత్సరాల లోపు వయస్సు ఈ ఉద్యోగాలకు అర్హత కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడు సంవత్సరాలు వయో సడలింపులు ఉన్నాయి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 23, 2020 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు.

ఉద్యోగ ఖాళీలను పరిశీలిస్తే మైనింగ్ విభాగంలో 40 ఉద్యోగాలు, ఎలక్ట్రికల్ విభాగంలో 12 ఉద్యోగాలు, మెకానికల్ విభాగంలో 10 ఉద్యోగాలు, మైన్ సర్వే విభాగంలో 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్ పాసైన వాళ్లకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2021 సంవత్సరం ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే రెండు భాగాలు ఉంటాయి.

ఒకటి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కాగా రెండోది అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయడం. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సహాయంతో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫోటో, సంతకం అప్ లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఫీజును ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా చెల్లించే అవకాశం ఉంటుంది.

ఏపీలో పది పరీక్ష కేంద్రాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మూడు పరీక్ష కేంద్రాలను ఈ పరీక్షల కొరకు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

నిరుద్యోగులకు ఐఓసీఎల్ శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 493 ఉద్యోగాల భర్తీ కోసం ఐఓసీఎల్ దరఖాస్తులను కోరుతోంది. సౌత్ ఇండియాలోని ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ఐఓసీఎల్ ఈ ఉద్యోగా లను భర్తీ చేస్తోంది. 493 అప్రెంటీస్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌-ఫ్రెష‌ర్, అకౌంటెంట్, ఐటీఐ చదివిన వాళ్లు, స్కిల్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఓసీఎల్ అభ్యర్థులకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 12, 2020 సంవత్సరం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సర్టిఫికెట్ ను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ మొత్తంలో వేతనం లభిస్తుంది. మార్కెటింగ్ డివిజ‌న్ స‌ద‌ర‌న్ రీజియ‌న్ లో జరుగుతున్న ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం ఖాళీలు ఉండటంతో ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేయడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది.

అయితే అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు పొందే ప్రయోజనాలను మాత్రం పొందలేరు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు, కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచి భవిష్యత్తును పొందవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 56 వేల జీతంతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు..?

ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా 56 వేల రూపాయల వేతనం పొందవచ్చు. మొత్తం 235 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. https://careerindianairforce.cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2020 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలలో ఎయిర్ ఫోర్స్ క్యాట్ ఎంట్రీ పోస్టులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండగా మిగిలిన విభాగాలను దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్), గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఫ్లైయింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ ఉండటంతో పాటు నిర్దేశించిన శారీరక ప్రమణాలు, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జ‌న‌వ‌రి 1, 2022 నాటికి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఫ్లైయింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.

మిగిలిన ఉద్యోగాలకు మాత్రం 26 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేయవచ్చు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష , పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.