Tag Archives: jr ntr

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అర్ఆర్ఆర్” చిత్రంలో కొమురంభీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ గతంలో ఎంతో విలాసవంతమైన, ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి కారును బుక్ చేశారని అది త్వరలోనే హైదరాబాద్ చేరుతుందనే వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బుక్ చేసినటువంటి
ఇటాలియన్ లగ్జరీ లాంబొర్కిని కారు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. తారక్ ఎంతో ఇష్టంగా బుక్ చేసుకున్నటువంటి లగ్జరీ కారును ఏకంగా ఐదు కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన కొత్త కారును వేసుకుని తన స్నేహితుడు రామ్ చరణ్ ను కలవడం కోసం వెళ్లారని,ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన కొత్త కారును రామ్ చరణ్ ఇంటి ముందు పార్క్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త కార కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి “అర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరి మద్య స్నేహం పెరగడంతో ఎన్టీఆర్ తన కొత్త కారులో చెర్రీని కలవడం కోసం వెళ్లారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ “అర్ఆర్ఆర్” తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

అదిరిపోయిన “ఆర్ఆర్ఆర్” గర్జన.. వీడియో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమా క్రేజ్ ఏ విధంగా ఉంటుందో యావత్ దేశానికి చూపించారు. అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమాపై అందరి దృష్టి పడింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు,టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇప్పటికే ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. చిత్ర యూనిట్ సభ్యులకు గాయాలు కావడం,కరోనా మొదటి రెండవ దశ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కరోనా పరిస్థితులు కాస్త కుదుట పడటంతో తిరిగి చిత్రబృందం షూటింగ్లో పాల్గొన్నారు.

సుమారు మూడు నెలల తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ఒక అప్డేట్ ఇవ్వడానికి సన్నాహాలు చేశారు. కరోనా మొదటి వ్యక్తి తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్ అందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తాజాగా RRR గర్జన అంటూ మరో వీడియోను వదిలారు.

RRR గర్జన అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ దుమ్ములేపేశారు. ఇక ఈ వీడియోలో మిగతా నటీనటులు శ్రియా, అజయ్ దేవగణ్, అలియా భట్ ఇలా అందరినీ చూపించారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్‌లు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ వీడియో చిన్న ఉదాహరణగా చూపించారు. మొత్తానికి రాజమౌళి ఈ సినిమా ద్వారా తెరపై మరొక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారని RRR గర్జన ద్వారా తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం రాజమౌళి గర్జన ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి.

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త…బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న తారక్.. ఎప్పుడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అడుగుపెట్టి బిగ్ బాస్ రియాలిటీ షోను ఎంతటి విజయవంతం చేశారో మనకు తెలిసింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ వరుసగా నాలుగు సీజన్లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ కు ముస్తాబవుతోంది. బిగ్ బాస్ తర్వాత ఎన్టీఆర్ బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. జెమినీ టీవీలో ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరుడు? కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఎప్పుడో ఈ కార్యక్రమం ప్రసారం కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ఈ కార్యక్రమ షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చక్కపడుతుండడంతో మెల్లిగా అన్ని కార్యక్రమాలు షూటింగ్ లను జరుపుకుంటున్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న టువంటి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమై శరవేగంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల మధ్యలోనే తారక్ ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.”ఆట నాది గెలుపు మీది” అంటూ నయా షో తో రాబోతున్నట్టుగా ఇది వరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి సంబంధించి నేటి (జూలై 10) నుంచి జూలై 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం షూటింగ్లో పాల్గొననున్నారనే వార్త వినబడుతుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కాబోతోంది అని చెప్పవచ్చు.

ఆ రెండు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న.. ఆర్ఆర్ఆర్ ?

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో రాజమౌళి “ఆర్ఆర్ఆర్” ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా మొదటి దశ, రెండవ దశ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం ప్రకటించారు.త్వరలోనే ఈ రెండు పాటలు చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తుండగా అలియాభట్, ఒలివియా మోరీస్‌  హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ తండ్రి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించనున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పలు పోస్టర్లు, టీజర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుని ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి #RRR నుంచి అదిరిపోయే అప్డేట్.. ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తున్న స్టార్ హీరో..!?

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే ఈ సినిమాకు ప్యాకప్ చెప్పి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని గతంలో తెలియజేశారు. అయితే అతడు ఏ పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం గురించి చిత్రబృందం తాజా అప్డేట్ అందించారు.

అజయ్ దేవగన్ ఈ సినిమాలో కొమరం భీమ్ తండ్రి పాత్రలో అంటే ఎన్టీఆర్ తండ్రి పాత్రలో సందడి చేయనున్నారు. అజయ్ దేవగన్ పాత్ర సినిమాలో చాలా హైలెట్ కానుందట. అందుకే దర్శకుడు ఈ పాత్ర పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భ‌ట్‌ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నుంచి రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి లాంటి స్టార్స్ కూడా భాగమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఎన్టీఆర్ నటించిన ఇప్పటికి విడుదల కానీ సినిమాలో ఏదో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా తారక్ సంపాదించుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ హీరోగా అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సినిమాలకు చేరువయ్యాడు. ఎన్టీఆర్ తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి తాను నటించిన సినిమాలలో ఒక సినిమా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఇంతకీ ఆ సినిమా ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా రామాయణం సినిమాలో రాముని పాత్ర ద్వారా రంగప్రవేశం చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సారిగా కెమెరా ముందు కనిపించింది సీనియర్ ఎన్టీ రామారావు హిందీలో నటించిన”బ్రహ్మర్షి విశ్వామిత్ర” ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ భరతుడి పాత్రలో చేశారు.

బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తెలుగు వెర్షన్ లో బాలకృష్ణ హరిశ్చంద్రుడు, దుశ్యంతుడు పాత్రలలో నటించారు. హిందీలో కూడా బాలకృష్ణ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఈ దుశ్యంతుడు కొడుకు భరతుడి పాత్రలో తారక్ సందడి చేశారు. తెలుగులో విడుదలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో, ఈ సినిమా హిందీ వెర్షన్ లో విడుదల చేయకుండా సీనియర్ ఎన్టీఆర్ హోల్డ్ లో పెట్టారు.

కొన్ని రోజుల తర్వాత సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడంతో ఎంతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు సీనియర్ ఎన్టీఆర్ మరణించడంతో ఇప్పటికీ హిందీ వర్షంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా విడుదలకు నోచుకోలేదని చెప్పవచ్చు. ఈ విధంగా నందమూరి ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాకపోవడం గమనార్హం.

బిరుదులు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు..!!

సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల పేర్లకన్నా ఈ బిరుదులనే అభిమానులు అమితంగా ఇష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. తమ అభిమాన హీరో పేరు ముందు ప్రత్యేకంగా ఉండటానికి అభిమానులు కొన్నిసార్లు దర్శకులు ఇలా బిరుదులు ఇస్తుంటారు. అయితే కొందరు హీరోలు గతంలో వచ్చిన పేర్లను మారిపోయి కొత్త టైటిల్‌ పేర్లతో పలకరించిన సందర్భాలున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

1.ఐకాన్‌స్టార్‌గా.. అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్‌తో ఆయన తీస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’.ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ టీజర్‌తో పాటే, అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో తన పేరుకు ముందు ఐకాన్‌ స్టార్‌ అని ఉండటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ స్టైలిష్‌ స్టార్‌గా పిలుచుకునే అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా మారిపోనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

2.సుప్రీమ్‌ హీరో నుంచి మెగాస్టార్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి అభిమానులు ముద్దుగా మెగాస్టార్‌ అని పిలుచుకుంటారు. ఆ పేరు వెండితెరపై పడితే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తుంటాయి. అయితే మెగాస్టార్‌ కన్నా ముందు డైనమిక్‌ హీరో అని తెరపై పడేది. ఆ తర్వాత అంచెలంచెలుగా స్టార్‌ హీరోగా ఎదుగుతున్న క్రమంలో సుప్రీమ్‌ హీరో అని పిలుచుకునే వారు అభిమానగణం. ‘మరణమృదంగం’ సినిమా నుంచి చిరు మెగాస్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత కాలంలోనూ మెగాస్టార్‌గానే అభిమానుల గుండెల్లో నిండిపోయారు. ఇప్పటికీ.. ఎప్పటికీ చిరు మెగాస్టార్‌గానే గుర్తుండిపోతారని చెబుతారు మెగా అభిమానులు.

3.నటసింహం.. బాలకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. క్లాస్‌, మాస్‌, జానపదం, పౌరాణికం ఇలా పాత్ర ఏదైనా ఆయన బరిలోకి దిగనంత వరకే.. ఒకసారి అడుగు పెట్టారా? చరిత్ర సృష్టిస్తారు. కథానాయకుడిగా కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయనను యువరత్నగానే పిలుచుకునేవారు. అయితే బోయపాటితో తీసిన ‘సింహ’తో బాలకృష్ణ నటసింహంగా మారిపోయాడు.

4.మన్మథుడి పేరూ మారింది..

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ దర్శకులను ప్రోత్సహిస్తూ, ప్రయోగాలకు ఆసక్తి చూపే అగ్ర కథానాయకుడు నాగార్జున. అక్కినేని నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయనను అభిమానులు ‘యువ సామ్రాట్‌’ అని పిలుచుకునేవారు. ‘కింగ్‌’ సినిమా తర్వాత ఆయన పేరు ముందు ‘కింగ్‌’ టైటిల్‌ వచ్చి చేరింది.

5.సూపర్‌స్టార్‌ అలా..

కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మహేశ్‌బాబు. బాలనటుడిగానే తనదైన ముద్రవేశారు. కృష్ణ స్టార్‌డమ్‌తో పాటు టైటిల్‌నూ కొనసాగిస్తున్నారాయన. మొదటి చిత్రం నుంచే ఆయన ప్రిన్స్‌గా పరిచయం అయ్యారు. ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ‘దూకుడు’ చిత్రం నుంచి ‘ప్రిన్స్‌’ కాస్తా సూపర్‌ స్టార్‌గా మారిపోయాడాయన. అది మహేశ్‌ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

6.ఎన్టీఆర్‌ ఏ1 స్టార్‌

 

నూనుగు మీసాల వయసులో టాలీవుడ్‌కి ఇండస్ట్రీ హిట్టు అందించారు ఎన్టీఆర్‌. తాత నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకని డైలాగ్‌లు, డ్యాన్స్‌లతో వెండితెరపై చిరుతపులిలా దూకుడుగా కనిపిస్తారు తారక్‌. అందుకే ఆయన్ను ‘యంగ్‌టైగర్‌’ అని అభిమానులు పిలుచుకుంటున్నారు. ‘శక్తి’ సినిమా సందర్భంగా ‘ఏ1 స్టార్‌’గా మారినా ఆ తర్వాత ‘యంగ్‌టైగర్‌’టైటిల్‌తోనే కంటిన్యూ అవుతున్నాడు…!!

మే 20 న అదిరిపోయే సర్ ప్రైజ్ రాబోతోంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి..!!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి దశకు వచ్చేసింది.ఇక ఈ సినిమా తర్వాత తన 30వ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నాడు తారక్. అనూహ్య పరిణామాల మధ్య ఈ చిత్రానికి దర్శకుడు మారాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఈ సినిమానే చేయబోతున్నట్లుగా ధ్రువీకరిస్తూ ఇటీవల ప్రకటన ఇచ్చారు.

ఐతే తారక్ అభిమానుల దృష్టి ఉన్నది మాత్రం వేరే చిత్రం మీద. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తారక్ ఎప్పుడు సినిమా చేస్తాడు.. దీని గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అని వాళ్లు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు.దర్శకుడు ప్రశాంత్, మైత్రీ సంస్థ అధినేతలు.. అలాగే తారక్ వేర్వేరు సందర్భాల్లో ఈ సినిమా గురించి సంకేతాలు ఇచ్చారు.కానీ అధికారికంగా ఘనమైన ప్రకటన ఎప్పుడు వస్తుందన్న దాని మీదే అభిమానుల దృష్టి ఉంది.

మధ్యలో అనుకోకుండా ప్రశాంత్ సలార్ సినిమాను తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్లీ ఇలా ఇంకో సినిమా ఏదైనా వచ్చి పడుతుందేమో అన్న కంగారు కూడా వారిలో లేక పోలేదు.ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చి.. ఆ సినిమా ఎప్పుడు మొదలై, ఎప్పుడు విడుదలవుతుందో ఒక క్లారిటీ వస్తే బాగుండని అనుకుంటున్నారు. ఐతే ఇందుకు ఇప్పుడు ముహూర్తం కుదిరినట్లు సమాచారం.

ఈ నెల 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేయనున్న సినిమా గురించి ఒక పోస్టర్ ద్వారా ఘనంగా అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతోందట మైత్రీ సంస్థ.సినిమా ఎప్పుడు మొదలయ్యేది.. ఎప్పుడు రిలీజయ్యేది కూడా ఈ పోస్టర్లో ప్రకటిస్తారని అంటున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ టీం నుంచి తారక్ పుట్టిన రోజు నాడు కొత్త పోస్టర్ కూడా వదలనున్నారట.అంతేకాదు కొరటాల సినిమా నుంచి కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉండే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి..!!

తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ పాన్ ఇండియా డైరెక్టర్ తో ‘ఎన్టీఆర్’ సినిమా ఫిక్స్..!!

టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. అయితే ఈ సినిమా దతర్వాత తారక్ ఫ్యూచర్ సినిమాల లైనప్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముందుగా తనకు ‘జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయబోతున్నాడు.

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అతను ఓ సినిమా చేయాల్సి ఉంది. ఐతే ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అప్పుడప్పుడూ అప్‌డేట్లు వస్తున్నాయి కానీ.. దీని గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మాట్లాడింది లేదు.’కేజీఎఫ్-2′ పూర్తవగానే ఎన్టీఆర్‌తో సినిమా అనుకుంటే ప్రశాంత్ ఉన్నట్లుండి ‘సలార్’ను ముందుకు తీసుకురావడం, మధ్యలో అల్లు అర్జున్ సైతం ప్రశాంత్‌తో ఓ సినిమా కోసం చర్చలు జరపడంతో ఎన్టీఆర్-ప్రశాంత్ సినిమా మీద కొంత సందేహాలు నెలకొన్నాయి.

ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ తొలిసారిగా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా గురించి నోరు విప్పాడు. ప్రస్తుతం కరోనా బారిన పడి ఇంట్లో కోలుకుంటున్న తారక్.. అంతర్జాతీయ ఫిలిం ట్రేడ్ పబ్లికేషన్ ‘డెడ్ లైన్’కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తారక్ కరోనా పాజిటివ్‌గా తేలడానికి ముందు ఇచ్చాడా, తర్వాతా అన్నది తెలియదు. ఐతే ఆ ఇంటర్వ్యూ మాత్రం తాజాగా పబ్లిష్ అయింది.ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. తన తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలోనే అని తారక్ ధ్రువీకరించాడు.

‘జనతా గ్యారేజ్’ తర్వాత తమ కలయికలో రానున్న సినిమా కోసం ఉత్సాహంగా ఉన్నానని.. ఐతే ఈ సినిమాకు ఇంకా స్క్రిప్టు పూర్తి కాలేదని ఎన్టీఆర్ చెప్పాడు. ఈ సినిమా కోసం ఒక ఐడియా అనుకున్నామని, అది తనకెంతో నచ్చిందని, దాని మీద వర్క్ జరుగుతోందని తారక్ తెలిపాడు. ఈ చిత్రం తర్వాత తాను ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో నటించబోతున్నట్లు చెప్పాడు.దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు..!!

‘RRR’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. తగ్గేదే లేదట..!!

సినిమా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘RRR’. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఇప్పటికే విడుదల కావలసింది.. కానీ గత ఏడాది కరోనా వచ్చి షూటింగ్‌ ఆగిపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు. మళ్లీ షూటింగ్ మొదలై జోరుగా పని నడిచాక చిత్ర బృందంలో కాన్ఫిడెన్స్ వచ్చింది.

అక్టోబరు 13న రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చారు.ఈసారి బాగా ఆలోచించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే విడుదల తేదీ ప్రకటించారు. కానీ ఆ డేట్ ఇచ్చాక పరిస్థితులు మళ్లీ ఇబ్బందికరంగా తయారయ్యాయి. షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం సాగలేదు. ఆలియా కరోనా బారిన పడటం సహా వేరే కారణాలు తోడయ్యాయి. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ కూడా వచ్చి పడింది. షూటింగ్ ఆపేయక తప్పలేదు.చిత్ర బృందం ప్రకటించిన విడుదల తేదీకి ఇంకో ఐదు నెలలే మిగిలున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.

అది అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. వివిధ భాషలకు డబ్బింగ్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో అక్టోబరు 13 అనే కాదు.. ఈ ఏడాది చివరికి కూడా ‘ఆర్ఆర్ఆర్’ రాకపోవచ్చనే అభిప్రాయంతోనే అందరూ ఉన్నారు. కానీ ఈ చిత్ర కథానాయకుల్లో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయడంపై ఆశావహ దృక్పథంతో ఉండటం విశేషం.’డెడ్ లైన్’ అనే అంతర్జాతీయ పబ్లిషింగ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ విశేషాలపై తారక్ మాట్లాడాడు.

ఈ సినిమాకు సంబంధించి తమ ప్రయాణం 2018 నవంబరులో మొదలైందని.. ఐతే కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు తాము పని మానేసి ఖాళీగా ఉండాల్సి వచ్చిందని.. ఆ సమయాన్ని మినహాయిస్తే ఇప్పటిదాకా 19 నెలల పాటు ఈ సినిమా మీద పని చేశామని తారక్ తెలిపాడు.’ఆర్ఆర్ఆర్’ ప్రమాణాల ప్రకారం చూస్తే ఇంత సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదని.. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ ఘట్టాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని తారక్ అన్నాడు. అక్టోబరులో ఈ సినిమాను రిలీజ్ చేయడం పట్ల తాము ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు తారక్ చెప్పడం విశేషం….!!