Tag Archives: kakinada

కాకినాడలో దారుణం.. లాడ్జిలో వివాహిత దారుణ హత్య..

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. కాకినాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త చేతిలో భార్య హత్యకు గురయింది. విషయం తెలుసుకున్న లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమెది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో సుధారాణి ఫస్టియర్ డిప్లమో ఇన్ అనస్తీషియా చదువుతుంది. కొన్నాళ్ల క్రితం పశ్చిమగోదారి జిల్లా పెదపాడు మండల యాళ్లగూడెంకు చెందిన 21 ఏళ్ల గంగరాజుతో పరిచయం ఏర్పరచుకుంది. తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది.

కొన్నాళ్లు ఇలా ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటూ.. ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 10 నెలల క్రితం వీళ్లిద్దరికి ప్రేమ వివాహం జరిగింది. ఆమె హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తుంది. అయితే ఓ రోజు కాకినాడ ద్వారకా లాడ్జిలో ఇద్దరూ దిగారు. వీరిద్దరి మధ్య నిన్న విపరీతంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఘర్షణకు దారితీయడంతో రాజుకు విపరీతంగా కోపం వచ్చింది.

అతడు క్షణికావేశంలో కత్తి తీసుకొని సుధారాణిని విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత రాజు ఏలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో వాచరణ చేపడతామని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో బన్నీపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

ఒక వైపు మెగా హీరో ప్రమాదానికి గురై ఇబ్బందుల్లో ఉంటే.. ఓ వైపు అల్లు అర్జున్ సీటీమార్ సినిమాను వీక్షించేందుకు వెళ్లి.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 80 శాతం వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. కాకినాడలో మిగతా షూటింగ్ లో పాల్గొనేందుకు అల్లుఅర్జున్ అక్కడికి వెళ్లారు.

శనివారం ఉదయం అల్లు అర్జున్ టీం కాకినాడకు చేరుకోగా.. రెండు రోజుల పాటు కాకినాడ పోర్ట్ లోపల షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. షూటింగ్ చేస్తున్న సమయంలో ఖాళీ టైంలో అతడు గోపీచంద్ నటించిన ‘సీటీమార్’ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లారు. దీంతో ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గోపీ చంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సీటీమార్ సినిమాకు అల్లు అర్జున్ కాకినాడలోని పద్మప్రియ థియేటర్ లో మ్యాట్నీ షో చూశారు. సిటీమార్ అనే పదం.. అల్లు అర్జున్ నటించిన ఓ సినిమాలో వచ్చిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. అల్లు అర్జున్ ఇలా సినిమా షూటింగ్ లు పాల్గొంటూ.. సినిమాలు చూస్తుండగా.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే..సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ఉండగా.. ఇప్పటి వరకు ఎక్కడా స్పందించని బన్నీ.. ఇప్పుడు సీటీమార్ సినిమా థియేటర్‌లో కనపడటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బన్నీపై మెగా అభిమానులు కూడా ఆగ్రహంతో ఉన్నారు.