ఒక వైపు మెగా హీరో ప్రమాదానికి గురై ఇబ్బందుల్లో ఉంటే.. ఓ వైపు అల్లు అర్జున్ సీటీమార్ సినిమాను వీక్షించేందుకు వెళ్లి.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 80 శాతం వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. కాకినాడలో మిగతా షూటింగ్ లో పాల్గొనేందుకు అల్లుఅర్జున్ అక్కడికి వెళ్లారు.
శనివారం ఉదయం అల్లు అర్జున్ టీం కాకినాడకు చేరుకోగా.. రెండు రోజుల పాటు కాకినాడ పోర్ట్ లోపల షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. షూటింగ్ చేస్తున్న సమయంలో ఖాళీ టైంలో అతడు గోపీచంద్ నటించిన ‘సీటీమార్’ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లారు. దీంతో ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గోపీ చంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సీటీమార్ సినిమాకు అల్లు అర్జున్ కాకినాడలోని పద్మప్రియ థియేటర్ లో మ్యాట్నీ షో చూశారు. సిటీమార్ అనే పదం.. అల్లు అర్జున్ నటించిన ఓ సినిమాలో వచ్చిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. అల్లు అర్జున్ ఇలా సినిమా షూటింగ్ లు పాల్గొంటూ.. సినిమాలు చూస్తుండగా.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే..సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉండగా.. ఇప్పటి వరకు ఎక్కడా స్పందించని బన్నీ.. ఇప్పుడు సీటీమార్ సినిమా థియేటర్లో కనపడటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బన్నీపై మెగా అభిమానులు కూడా ఆగ్రహంతో ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…