Tag Archives: khushboo

Star Actress: సమంతకు మాత్రమే కాకుండా అభిమానులు గుడి కట్టిన హీరోయిన్స్ వీళ్ళే!

Star Actress: సాధారణం సినిమా సెలెబ్రిటీలు అంటే ప్రేక్షకులకు అమితమైన అభిమానం ఉంటుంది. అయితే వివిధ రకాలుగా వారి అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా యువత తమ అభిమాన హీరోయిన్స్ కి ఏకంగా గుడి కట్టించి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ కి ఇలా గుడి కట్టించారు. తాజాగా సమంత అభిమాని ఒకరు తన ఇంట్లోనే ఆమెకు గుడి కట్టించి ఆమె మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన సందీప్‌ అనే వ్యక్తి సమంత మీద ఉన్న అభిమానంతో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు ఇంట్లోనే ఏర్పాటు చేసి గుడి కట్టించాడు. అయితే సమంత ఇలాగే మరికొందరు హీరోయిన్స్ కి కూడా అభిమానులు గుడి కట్టించారు . ఆ హీరోయిన్స్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

• ఖుష్బూ : భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అందాల నటి కుష్బూకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె మీద ఉన్న అభిమానంతో కొందరు తమిళనాడు తిరుచిరాపల్లిలో ఖుష్బూకు గుడి కట్టించి వారి అభిమానాన్ని చాటుకున్నారు.

Star Actress:

• హన్సిక : దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన హన్సిక తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈక్రమంలో కొందరు ఫ్యాన్స్‌ చెన్నై శివారులో హన్సిక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించారు.

• నగ్మా : టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌ లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందిన అలనాటి అందాల నటి నగ్మా కి యువతలో మంచి ఫాలోయింగ్ ఉండేది. దీంతో ఆమె అభిమానులు తమిళనాడులో పలు చోట్ల గుడులు కట్టించారు. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి.

• నమిత : తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నమిత కి తమిళనాట బోలెడు అభిమానులున్నారు. అందుకే కోయంబత్తూర్‌, తిరనవెల్లితో పాటు మరో మూడు చోట్ల నమితకు గుడి కట్టారు ఫ్యాన్స్‌.

Actress Khushbu: పవన్ కల్యాణ్ తల్లిగా నటించి తప్పు చేశాను… కుష్బూ కామెంట్స్ వైరల్!

Actress Khushbu: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అందం, అభిప్రాయంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న కుష్బూకి ప్రేక్షకులు గుడి కట్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక ప్రస్తుతం కుష్బూ ఒకవైపు సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా రాజకీయాలలో కూడా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రూపొందిన రామాబాణం సినిమాలో గోపీచంద్ కి తల్లిగా నటించింది.లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న చిత్రం రామబాణం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఖుష్బు గోపీచంద్ తల్లిగా నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ సినిమా గురించి, సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ ఇంటర్వ్యూ ఖుష్బూ మాట్లాడుతూ…” ఈ సినిమాలో కుటుంబ బంధాల గురించి చక్కగా వివరించారు. ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా.. కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యమని తెలిపే కథ ఇది అని తెలిపింది. ఇక ఈ సినిమాలో నా పాత్ర ఎంతో అద్భుతంగా ఉంది.మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, విలువలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుందని తెలిపింది.

Actress Khushbu:పవన్ కళ్యాణ్ తల్లిగా ఆదరించలేదు…

ఈ సినిమాలో నా పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది.గతంలో అజ్ఞాతవాసిలో మంచి పాత్ర పోషించాను. కానీ నన్ను, పవన్ కల్యాణ్ తల్లిలా ప్రేక్షకులు ఆదరించలేదు,ఈ సినిమా కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది అంటూ ఖుష్బూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం కుష్బూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్లిమ్ అయిన ఖుష్బు.. బరువు తగ్గడానికి సీక్రెట్ ఏమిటంటే?

అలనాటి తారల్లో చెప్పుకోదగిన హీరోయిన్ ఖుష్బు. అందాలనటిగా ఎంతో గుర్తిపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. బొద్దుగుమ్మగా అందరికీ తెలిసిన ఖుష్బూ ఇటీవల స్లిమ్ లుక్ లో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత బరువు తగ్గడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది.

తమిళంలో డ్యాన్స్ వర్సెస్ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఖుష్బూ ఆసక్తికర అంశాలు పంచుకుంది. మొదట తాను పెళ్లి చేసుకోవడం.. తర్వాత పిల్లలు కనడం లాంటివి జరగడంతో విపరీతంగా బరువు పెరిగానని.. అయితే, లాక్ డౌన్ వేళ ఖాళీ సమయం దొరకడంతో బరువు తగ్గడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 15 కిలోల వరకు తగ్గినట్లు చెప్పుకొచ్చారు.

తాను పెళ్లి చేసుకున్న సమయంలో ధరించిన దుస్తులు కూడా ఇప్పుడు సరిపోతున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. బరవు తగ్గడానికి తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీలు, ఐస్ క్రీములకను త్యాగం చేసినట్లు చెప్పారు. క్రమం తప్పకుండా యోగా చేశానని వివరించింది. రోజూ 40 నిమిషాల పాటు నడిచేదాన్నని వెల్లడించింది.

ఇక లాక్ డౌన్ సమయంలో పనిమనిషి ఇంటికి రాలేని పరిస్థితి. దాంతో ఇంట్లో పని మొత్తం తానే చేసుకున్నానని. అంట్లు తోమడం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్ని పనుల చేశానని ఖుష్బూ పేర్కొంది. 2020 నవంబర్లో తన బరువు దాదాపు 92 కిలోలు ఉన్నానని.. ప్రస్తుతం 77 కిలోలకు వచ్చినట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నానని.. దాని కోసం కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నానని చెప్పుకొచ్చింది ఖుష్బు.

నరకం చూపించిన ఖుష్ బూ తండ్రి.. ఆ కష్టాలు పగవాడికి కూడా రావద్దు..

ఖుష్‌బూ అంటే తెలియని వాళ్లకు కూడా 1991 సంవత్సరంలో అందరికీ తెలిసిపోయింది. తమిళంలో ఆమె నటించిన చిత్రం ‘చిన్నతంబి’ అప్పట్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. దీంతో ఆమెకు విపరీతంగా అభిమానులు అయ్యారు. గుడులు కూడా కట్టారు. రక్తంతో ఉత్తరాలు కూడా రాశారు. త‌మిళ ద‌ర్శ‌కుడు సి. సుంద‌ర్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్ద‌రు కుమార్తెలు.. అవంతిక‌, ఆనందిత‌. అయితే చిన్నతనంలో ఖుష్ బూ ఎన్నో కష్టాలను అనుభవించింది.

తండ్రి చేతుల్లో చాలా హింస ఎదుర్కొన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె తల్లిని కూడా ఎక్కువగా హింసించేవాడు. అందుకే తండ్రి అంటే ఖుష్ బూకు ద్వేషం ఎక్కువగా ఉండేది. తన తండ్రిని చూసి ఆమె 35 ఏళ్లు అయిందంట. దీనిని బట్టే అర్థం అవుతుంది..తండ్రి అంటే ఖుష్ బూకు ఎంత ద్వేషమో. ఖుష్ బూ అసలు పేరు ‘నఖత్ ఖాన్’. న‌ఖత్ అంటే ఉర్దూలో సువాస‌న అని అర్థం. హిందీలో దానికి అర్థం ఖుష్‌బూ. అందుకే ఖుష్‌బూ అనే పేరు పెట్టారు.

1978 సంవత్సరంలో ద బ‌ర్నింగ్ ట్రైన్ చిత్రంలో బాలనటిగా కేరీర్ ను మొదలు పెట్టారు. అప్పట్లో ఆమె సంపాదించిన డబ్బుతో తండ్రి ఆనందం చెందేవాడు. డబ్బు లేకపోతే ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు.. వాళ్ల తల్లికి.. ఖుష్ బూ కు నానా నరకం చూపించేవాడు. అందుకే ఆమె తండ్రి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదు. ఒక్కోసారి షూటింగ్ లో ఉన్న సమయంలో సెట్స్ మీద‌కు వ‌చ్చి అంద‌రి ముందే కొట్టేవాడ‌ని ఖుష్‌బూ చెప్పారు. డబ్బు విలువ తెలుసుకున్న ఖుష్ బూ వాళ్ల తండ్రిని 16 ఏళ్ల వయస్సులో అడిగేసింది. డబ్బులు ఏం చేస్తున్నావు అని..దీంతో కోపం తెచ్చుకున్న వాళ్ల తండ్రి ముంబై నుంచి చెన్నైకు తీసుకొని వ‌చ్చాడు. అప్పుడే ‘క‌లియుగ పాండ‌వులు’ సినిమా చేస్తోంది.

ఆర్‌.ఎ. పురంలోని 6వ రోడ్డులో ఓ అద్దె ఇంట్లో వాళ్ల‌ను దించేసి, తండ్రి ముంబై వెళ్లిపోయాడు. వెళ్తూ.. వెళ్తూ ఖుష్ బూ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులను అన్నీ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ బాధ్యత అంతా ఆమె చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక తండ్రితో సంబంధం లేకుండా సినిమా చేస్తూ.. రెమ్యూన‌రేష‌న్ అమౌంట్‌ను జగ్రత్తగా దాచుకునేది. ఓ రోజు చెన్నైలో వాళ్లు నివాసం ఉంటున్న ఇంటికి వచ్చిన తండ్రికి కొత్త కారు కనిపించింది. అతడు కోపంతో దాని విండ్‌షీల్డ్‌ను ప‌గ‌ల‌గొట్టాడు. ముంబైకి మళ్లీ నా అవసరం కోసం వస్తావు.. అని తండ్రి అంటే.. ఇంట్లో వాళ్లను చంపి నేను చస్తాను కానీ.. నీ దగ్గరకు అస్సలు రానే రాను అంటూ చెప్పింది ఖుష్‌బూ. ఆ రోజు నుంచి తండ్రి మొహం చూడనే లేదు.