అలనాటి తారల్లో చెప్పుకోదగిన హీరోయిన్ ఖుష్బు. అందాలనటిగా ఎంతో గుర్తిపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. బొద్దుగుమ్మగా అందరికీ తెలిసిన ఖుష్బూ ఇటీవల స్లిమ్ లుక్ లో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత బరువు తగ్గడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది.
తమిళంలో డ్యాన్స్ వర్సెస్ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఖుష్బూ ఆసక్తికర అంశాలు పంచుకుంది. మొదట తాను పెళ్లి చేసుకోవడం.. తర్వాత పిల్లలు కనడం లాంటివి జరగడంతో విపరీతంగా బరువు పెరిగానని.. అయితే, లాక్ డౌన్ వేళ ఖాళీ సమయం దొరకడంతో బరువు తగ్గడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 15 కిలోల వరకు తగ్గినట్లు చెప్పుకొచ్చారు.
తాను పెళ్లి చేసుకున్న సమయంలో ధరించిన దుస్తులు కూడా ఇప్పుడు సరిపోతున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. బరవు తగ్గడానికి తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీలు, ఐస్ క్రీములకను త్యాగం చేసినట్లు చెప్పారు. క్రమం తప్పకుండా యోగా చేశానని వివరించింది. రోజూ 40 నిమిషాల పాటు నడిచేదాన్నని వెల్లడించింది.
ఇక లాక్ డౌన్ సమయంలో పనిమనిషి ఇంటికి రాలేని పరిస్థితి. దాంతో ఇంట్లో పని మొత్తం తానే చేసుకున్నానని. అంట్లు తోమడం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్ని పనుల చేశానని ఖుష్బూ పేర్కొంది. 2020 నవంబర్లో తన బరువు దాదాపు 92 కిలోలు ఉన్నానని.. ప్రస్తుతం 77 కిలోలకు వచ్చినట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నానని.. దాని కోసం కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నానని చెప్పుకొచ్చింది ఖుష్బు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…