మనం ఏదైనా దుకాణం దగ్గరకు వెళ్లి ఏదైనా కొన్నప్పుడు తిరిగి డబ్బులను అతడికి ఇస్తాం. దుకాణాదారుడు వాటిని విక్రియించుకుంటూ డబ్బులను సంపాదించుకుంటాడు. ఇలో ఓ వ్యక్తి సిగరెట్ తీసుకొని.. దుకాణాదారుడు డబ్బులు అడిగినందకు చితకబాదాడు. అంతేకాదు.. నలుగురు వ్యక్తులు వచ్చి విచక్షణారహితంగా కొట్టారు.అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగానే కొద్దిసేపటికి చనిపోయాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సెహదోల్ లో చోటు చేసుకుంది. మృతుడ్ని అరుణ్ సోనిగా గుర్తించిన అధికారులు.. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. సెహదోల్ జిల్లా కేంద్రానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో డియోలాండ్ లో రాత్రి ఘటన జరిగింది.
రాత్రి 9 గంటల ప్రాంతంలో నలగురు వ్యక్తులు మనుఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్, సందీప్ సింగ్ లు వచ్చి.. అరుణ్ సోనీ అనే వ్యక్తి దుకాణం వద్దక సిగరెట్ అడిగి తీసుకున్నారు. ఆ నలుగురు కూడా సిగరెట్ తీసుకొని డబ్బులు కట్టకుండా వెళ్లిపోసాగారు. సోని గట్టిగా అడిగాడు.
సిగరెట్ కు డబ్బులు కట్టండి అని. ఇక వాళ్లకు కోపం కట్టలు తెంచుకుంది. అక్కడే నలుగురు కలిసి దుకాణాదారుడిని తీవ్రంగా గాయపరిచారు. పక్కన ఉన్న సోనీ కుమారులు అతడ్ని కాపాడేందుకు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న కొద్దిసేపటికే సోని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరు తప్పించుకోగా.. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…