Tag Archives: kodali nani

Tarakaratna: వైసీపీ నుంచి తారకరత్నను పోటీ చేయమని అడిగా… తారకరత్న అలాంటి సమాధానం చెప్పారు: కొడాలి నాని

Tarakaratna: నందమూరి తారకరత్న మరణించడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు.తన కెరియర్లో ఒక్క శత్రువు కూడా లేకుండా అందరితోనూ ఎంతో సన్నిహితంగా మెలిగిన తారకరత్న గురించి ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటి మాటలు కనుక వింటే ఆయన ఎంత గొప్పగా బతికాడో అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని తారకరత్న మరణం పై స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పించడమే కాకుండా తారకరత్న వ్యక్తిత్వం గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు.తారకరత్న ఎప్పుడూ కూడా ఎవరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి కాదు అన్న తమ్ముడు బాబాయ్ అంకుల్ ఆంటీ అంటూ ఏదో ఒక సంబంధం కలుపుకొని మాట్లాడే వ్యక్తిత్వం తనదని తెలిపారు.

ఇక తారకరత్నకు అత్తగారి ఇంటి వైపు నుంచి చూస్తే వైసిపి పార్టీ పుట్టింటి వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు ఆయనకు ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి.ఈ క్రమంలోని ఓ రోజు తారకరత్నతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయవచ్చు కదా అని అడిగాను అందుకు తారకరత్న సమాధానం చెబుతూ తెలుగుదేశం పార్టీ తాతగారు స్థాపించిన పార్టీ తాను ఈ పార్టీలోనే కొనసాగుతాను అంటూ సమాధానం చెప్పారు.

Tarakaratna:తాత స్థాపించిన పార్టీలోనే కొనసాగుతా….


తారకరత్న దేనికి ఆశపడకుండా తన కష్టాన్ని నమ్ముకుని తన తాతయ్య స్థాపించిన పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇలా మనకు అందనంత దూరానికి వెళ్లిపోయారని కొడాలి నాని తారకరత్న గొప్ప మనసు, ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇలా తారకరత్న గురించి కొడాలి నాని చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nara Lokesh: పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన లోకేష్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వంశీ, కొడాలి నాని..!

Nara Lokesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పదవ తరగతి విద్యార్థులతో రోజు మీటింగ్ నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ లో విడుదలైన పదో తరగతి ఉత్తీర్ణత ఫలితాలు చూసిన అనంతరం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది అంటూ టీడీపీ ప్రభుత్వం అధికార పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం కోసం లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.

Nara Lokesh: పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన లోకేష్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వంశీ, కొడాలి నాని..!

ఈ విధంగా పలువురు విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ మీటింగ్ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. వల్లభనేని వంశి ఆఫీస్ నుంచి ఒక విద్యార్థి ఈ జూమ్ మీటింగుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే వంశీ చాలా సులభంగా ఈ జూమ్ మీటింగ్ లో కనిపించారు.

Nara Lokesh: పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన లోకేష్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వంశీ, కొడాలి నాని..!

ఈ విధంగా వంశీ కనిపించిన కొంత సమయానికి మాజీ మంత్రి కొడాలి నాని కూడా కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విధంగా విద్యార్థులతో నిర్వహిస్తున్న జూమ్ మీటింగులో ఈ విధంగా వైఎస్సార్ సీపీ నేతలు కనిపించడంతో ఒక్కసారిగా టిడిపి శ్రేణులు వీరు వ్యవహారశైలిపై భగ్గుమంటున్నారు. నాని వంశీ ఈ విధంగా లోకేష్ తో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో వీరికి సంబంధించిన లైన్స్ కట్ చేశారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు.

పదోతరగతి విద్యార్థులలో మానసిక స్థైర్యం నింపడం కోసం లోకేష్ ఈ విధంగా జూమ్ మీటింగ్ నిర్వహించగా ఇలా వైసీపీ నేతలు అడ్డుకుంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ వారి శాడిజం బయటపెట్టారు అంటూ టిడిపి శ్రేణులు వీరి వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వీరు ఇలా జూమ్ మీటింగ్ లో కనిపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వీరు వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశారు.

Poonam Kaur: రానా పాత్రలో మంత్రి కొడాలి నాని చేసి ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యేది… పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

Poonam Kaur: సినిమాల కన్నా వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూనమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ బాగా పాపులారిటీ దక్కించుకున్నారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక నుంచి ఈమె ఏదో ఒక సంచలన ట్వీట్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ప్రతిసారి ట్వీట్ చేయడం డిలీట్ చేయడంతో ఈమె చేసే ట్వీట్స్ గురించి నెటిజన్లు తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన తర్వాత మరోసారి పూనమ్ సంచలన ట్వీట్ ద్వారా వార్తల్లో నిలిచారు.

Poonam Kaur: ఆ పాత్రలో మంత్రి కొడాలి నాని చేసి ఉంటే బ్లాక్ బాస్టర్ అయ్యేది… పూనమ్ సంచలన ట్వీట్!

అయితే ఈ ట్వీట్ రామ్ గోపాల్ వర్మ నుంచి ఇన్ స్పైర్ అయ్యి ట్వీట్ చేశానని చెప్పడం గమనార్హం.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ శేఖర్ పాత్ర (మతం మార్చుకున్న క్రిస్టియన్) లో ఏపీ మినిస్టర్ మంత్రి కొడాలి నాని కనుక నటించి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది అంటూ ట్వీట్ చేశారు. అయితే కాసేపటికే ఆ ట్వీట్ ను తొలగించారు పూనమ్ కౌర్.

మంత్రి కొడాలి నానిని ఉద్దేశిస్తూ…

ఇలా ట్వీట్ చేయడమే కాకుండా జస్ట్ ఫర్ ఫన్ అంటూ హాష్ టాగ్ చేశారు. అయితే ఈ ట్వీట్ చేసిన వెంటనే డిలీట్ చేసింది. అయితే ఈమె ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ ఈ ట్వీట్ సోషల్ మీడియాలో అప్పటికే వైరల్ గా మారిపోయింది. అయితే ఈమె ప్రతిసారి ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేస్తుందో తెలియక తికమక పడేవారు కానీ ప్రస్తుతం మాత్రం ఏకంగా మంత్రి కొడాలి నానిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

RGV: ఏపీ మంత్రి కొడాలి నాని పై సెటైర్ వేసిన వర్మ.. గుడివాడలో గోవా కల్చర్ అంటూ ట్వీట్..!

RGV: వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఏ విషయం గురించి మాట్లాడినా పెద్ద వివాదం చెలరేగుతోంది.నిన్న మొన్నటి వరకు సినిమా టికెట్ల వ్యవహారం పై ఏపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన వర్మ తాజాగా ఐశ్వర్య ధనుష్ విడాకుల విషయంపై స్పందించారు.

RGV: ఏపీ మంత్రి కొడాలి నాని పై సెటైర్ వేసిన వర్మ.. గుడివాడలో గోవా కల్చర్ అంటూ ట్వీట్..!

ఇదిలా ఉండగా తాజాగా వర్మ మరోసారి ఏపీ మంత్రి కొడాలి నాని పై వర్మ సెటైర్లు వేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..గుడివాడలో గోవా కల్చర్ తీసుకురావడం గురించి మంత్రి కొడాలి నానిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

RGV: ఏపీ మంత్రి కొడాలి నాని పై సెటైర్ వేసిన వర్మ.. గుడివాడలో గోవా కల్చర్ అంటూ ట్వీట్..!

గుడివాడలో గోవా కల్చర్ ను తీసుకువస్తూ గుడివాడ ప్రజలకు గోవాలో ఉన్నామనే ఫీలింగ్ కల్పించారని మంత్రి పై వర్మ సెటైర్ వేశారు. గుడివాడ ప్రజలను గోవా తీసుకువెళ్ళవచ్చు కానీ, గోవా వారిని గుడివాడ తీసుకురాలేము అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాకు తెలిసిన నాని నాచురల్ స్టార్ నాని..

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ట్వీట్ పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.గతంలో సినిమా టికెట్ల విషయంలో కొడాలి నాని స్పందిస్తే వర్మ నాకు ఈ కొడాలి నాని ఎవరో తెలియదు నాకు తెలిసింది కేవలం నాచురల్ స్టార్ నాని మాత్రమేనని తెలిపారు.ఈ విషయం పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ కొడాలి నాని ఎవరో తెలియదు అన్నారు మరి ఇప్పుడు ఎలా ట్వీట్ చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వర్మ గుడివాడను గోవాతో పోలుస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.

Ram Gopal Varma: కొడాలి నానీ .. ఎవరో నాకు తెలియదు.. నాకు తెలిసిన నాని ఒకరే..వర్మ ట్వీట్ వైరల్..!

Ram Gopal Varma: ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ల వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. టికెట్ల రేట్లను పెంచాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడిన విషయం తెలిసిందే.

Ram Gopal Varma: కొడాలి నానీ .. ఎవరో నాకు తెలియదు.. నాకు తెలిసిన నాని ఒకరే..వర్మ ట్వీట్ వైరల్..!

దాని తర్వాత న్యాచురల్ స్టార్ నానీ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. ప్రభుత్వం విమర్శల వర్షం గుప్పించాడు. ఇక తర్వాత నానీ వ్యాఖ్యలకు సపోర్టుగా మాట్లాడాడు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్ తరుపున తన ప్రశ్నలను ప్రభుత్వానికి వినిపిస్తున్నాడు.

Ram Gopal Varma: కొడాలి నానీ .. ఎవరో నాకు తెలియదు.. నాకు తెలిసిన నాని ఒకరే..వర్మ ట్వీట్ వైరల్..!

రెండు రోజుల నుంచి ఆర్జీవీ ప్రశ్నలకు అంతు లేదు. ఆ ప్రశ్నలు ప్రభుత్వ పెద్దల నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు. కౌంటర్ కు ప్రతి కౌంటర్ ఇస్తూ రెచ్చిపోతున్నాడు. ఇక తాజాగా వర్మ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సమాధానాలు చెప్పడంతో.. ట్వీట్ కు ప్రతి ట్వీట్లతో ఓ యుద్ధ వాతావరణమే తయారైంది.

కోడాలి నాని ఎలా స్పందిస్తారో..

ఇకపోతే తాజాగా వర్మ వేసిన ట్వీట్ మరో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కోడాలి నాని ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘‘AP టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ @NameisNani ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు’’ అంటూ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్ పెద్ద వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై కోడాలి నాని ఇంతవరకు స్పందించలేదు. అతడి వద్ద నుంచి ఏ సమాధానం వస్తుందో చూద్దాం.

Kodali Nani : రామ్ గోపాల్ వర్మకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి కొడాలి నాని !

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే.. అతడు షేర్ చేసిన వీడియోలో.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న టికెట్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలతో జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఇక ఈ విషయంలో అర్జీవీకి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ సైతం మద్దతు పలకడం జరిగింది. సినిమా టికెట్స్ వ్యవహారంపై జగన్ సర్కారుకు సూటిగా 10 ప్రశ్నలు సంధించారు రామ్ గోపాల్ వర్మ. దీనికి మెగా బ్రదర్ నాగబాబు మద్దతు పలుకుతూ ట్వీట్ చేసారు. ఇక నేపధ్యంలో అర్జీవీకి గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ మంత్రి కొడాలి నాని.

Kodali Nani : సినిమా టికెట్ల రెట్లు నియంత్రించే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది

సినిమా టికెట్ల విషయంలో రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. పక్క రాష్ట్రాలలో కూర్చొని, పక్క రాష్ట్రంలో సినిమాలు తీసుకుంటూ.. పక్క రాష్ట్రంలో జీవితాన్ని అనుభావిస్తున్నటువంటి వ్యక్తులకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో కూర్చొని రామ్ గోపాల్ వర్మ ఏదైనా మాట్లాడతాడని, అటువంటి అర్జీవీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు మంత్రి కొడాలి నాని. సినిమా టికెట్ల విషయంలో మాకేం సంబంధం లేదని చెబుతున్నారు కదా అయితే వాళ్ళనే సినిమాలు తీసుకుని అమ్మేసుకోమని చెప్పండి. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు తక్కువ రేటులో వినోదాన్ని అందించడం మా భాద్యత. మా టికెట్లు మేము ఎంతకి అమ్మలో నియంత్రించే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ధిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కుండ బద్దలు కొట్టారు కొడాలి నాని.

జూనియర్ ఎన్టీఆర్ ను దారుణంగా మోసం చేసిన వల్లభనేని వంశీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక టిడిపి నేత జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లతో చనువుగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత వల్లభనేని వంశీ మీద ఆరోపణలు చేశారు.ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలుగులో నిర్మాతగా పలు సినిమాలు చేశారు. 2009వ సంవత్సరంలో కోదండరామి రెడ్డి దర్శకుడిగా ముమైత్ ఖాన్ హీరోయిన్ గా రూపొందిన పున్నమినాగు సినిమాతో ఆయన నిర్మాతగా మారారు.

ఆ తర్వాత 2010వ సంవత్సరంలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అదుర్స్ సినిమాకు వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని ఇద్దరూ కలిసి నిర్మాతలుగా వ్యవహరించారు.ఇక గతంలో వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ నేత, సినీ నిర్మాతగా ఉన్న పరిటాల రవి దగ్గర అనుచరుడిగా ఉండేవారు.

అయితే పరిటాల రవి చనిపోయిన సమయంలో ఆయన ఆస్తులు కాజేశారని టిడిపి అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ ఆరోపించారు. అలాగే నమ్మి సినిమా చేసిన ఎన్టీఆర్ ను కూడా ఒక ల్యాండ్ విషయంలో వల్లభనేని వంశీ మోహన్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇక గతంలో కూడా కొడాలి నాని ఎన్టీఆర్ మధ్య ల్యాండ్ ఈ విషయంలోకొద్దిగా తేడాలు వచ్చాయని పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి.