Tag Archives: Koratala shiva

ఆచార్య నుంచి అదిరిపోయే అప్డేట్.. నవంబర్ 5 న రానున్న నీలాంబరి సాంగ్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ఆచార్య .దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. దసరాకి అయినా విడుదల అవుతుంది అనుకుంటే సంక్రాంతికి వాయిదా వేశారు.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో చిత్ర యూనిట్‌ ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్స్ కు భారీగానే స్పందన వచ్చింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను పూర్తిచేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించారు.

ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నీలాంబరి అనే పాటను నవంబర్‌ 5 వ తేదీన ఉదయం 11.07 నిముషాలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఇక ఈ అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

కొరటాలతో ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమాలో కొమరం భీమ్ అనే పాత్రలో నటించారు.ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజమౌళి RRR సినిమా పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలియజేశారు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోని సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటించిన రామ్ చరణ్ తన తదుపరి చిత్రం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ సినిమా ఇప్పటివరకు పట్టాలేక్కకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటి అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ RRR సినిమాలో అధిక శరీర బరువు పెరిగారు. కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా తన శరీర బరువు తగ్గాల్సి ఉందని చెప్పడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై ప్రసారమౌతున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ తన శరీర బరువును తగ్గిన తదుపరి ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈ సినిమాపై అభిమానులు మరింత అంచనాలు పెట్టుకున్నారు.

షోలో ఎన్టీఆర్ కు చుక్కులు చూపించిన సమంత.. ఆమె ఎంత గెలుచుకున్నారో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా అప్పుడప్పుడు సెలబ్రిటీల సందడితో కొంత కలర్ ఫుల్ గా నడుస్తోంది. ఈ షో ఓపెనింగ్ కు రామ్ చరణ్ హాజరయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాజమౌళి, కొరటాల శివ కలసి ఈ షోలో పాల్గొన్నారు. తర్వాత దసరా సందర్బంగా సమంత ఎపిసోడ్ లో సందడిగా కనిపించింది.

ఆమె ప్రత్యూష ఫౌండేషన్ కోసం డబ్బు గెలుచుకునేందుకు ఆమె ఈ షోకి అతిథిగా పాల్గొన్నట్లు తెలిపింది. ఎన్టీఆర్, సమంత మధ్య వినోదం ప్రేక్షకులను కడపుబ్బా నవ్వించాయి. ఇలా ఎన్టీఆర్ అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెబుతూ.. చివరకు ఆమె రూ.25 లక్షలు గెలుచుకుంది. ఆ షోలోని ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఆమె కాజల్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పొకొచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కాజల్, సమంత హీరోహీరోయిన్లుగా బృందావనం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారివురికి మంచి ర్యాపో ఉంది. ఒకరంటే ఒకరికి మంచి అవగాహన కూడా ఉంది. దీంతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ తో సమంత ఏమాత్రం బెరుకు లేకుండా సమాధానాలు చెప్పి.. అలరించింది. ఇక ఏమాయ చేసావే చిత్రం గురించి సమంత మాట్లాడింది. డార్లింగ్, ఏమాయ చేసావే రెండు సినిమాలు నెల రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయని ఆమె చెప్పింది.

ఎన్టీఆర్ కు సరదాగా సమంత విసుగు తెప్పించింది. సమాధానం చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉండకపోవడం.. ఫిక్స్ చేయమంటారా అంటే.. ఏం సమాధానం రాకపోవడం ఇలా అతడికి విసుకు పుట్టించింది సమంత. ఇదంతా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం కోసమే అని తెలిసిపోయింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. టీజర్ లో మీ వాయిస్ బుగుందంటూ మెచ్చుకున్నారు.. అప్పటి సావిత్రిలో ఉన్న నటన ప్రస్తుతం మీలో చూస్తున్నట్లు ఎన్టీఆర్ కితాబిస్తాడు. ఇలా షోలో సమంత సందడి సందడిగా గడిపింది.

మారిన మ్యూజికల్ కాంబినేషన్.. మరి ప్రేక్షకులను ఆకట్టుకుంటారా!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల కాంబినేషన్ , హీరో డైరెక్టర్ కాంబినేషన్ కాకుండా, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ల కాంబినేషన్ కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ విధంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ-దేవి శ్రీ ప్రసాద్, శ్రీకాంత్ అడ్డాల -మిక్కీ జె మేయర్, శివ నిర్వాణ -గోపీసుందర్ కాంబినేషన్లు అలాంటి కోవకు చెందుతాయి. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఇన్ని రోజులుగా వరుస కాంబినేషన్లో వస్తున్న వీరిద్దరూ ఈ సారి వారి కాంబినేషన్ మార్చుకున్నారు.

జస్ట్ ఫర్ చేంజ్ కోసం ఈ విధంగా మారారా.. లేక వీరికి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ విధంగా మ్యూజిక్ డైరెక్టర్లు మారారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతాగ్యారేజ్, భరత్ అనే నేను, మిర్చి, శ్రీమంతుడు వంటి చిత్రాలకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కి బదులుగా మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  ‘లాహే లాహే’ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి సినిమాలకు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

నిన్ను కోరి, మజిలీ, వంటి చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మదిని దోచిన శివ నిర్వాణ తన చిత్రాలకు గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “టక్‌ జగదీష్‌” చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని ఎస్.ఎస్ తమన్ కు కల్పించారు. ఈ విధంగా ఈ డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ ల కాంబినేషన్ ఈ సారీ మారిందని చెప్పవచ్చు. మరి ఈ కాంబినేషన్ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

‘కొరటాల శివ’కు బ్యాడ్ టైం నడుస్తుందా..??

తెలుగు సినీ ఇండస్ట్రీలో రచయిత నుండి దర్శకుడిగా మారాడు ‘కొరటాల శివ’.ప్రభాస్ హీరోగా ‘మిర్చి’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల శివ.. మొదటి సినిమాతోనే మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.. ఇక ఆ తర్వాత శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు.ఇక చివరిగా భరత్ అనే నేను చిత్రంతో ప్రేక్షకులని అలరించిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు..

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.. అంతేకాకుండా ఓ కీలక పాత్రలో మెగా వారసుడు రామ్ చరణ్ సైతం ఈ సినిమాలో కనిపించనున్నాడు.. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది.

ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు మూడేళ్లుగా సమయం కేటాయించాడు కొరటాల.ఈ సినిమా ఆలస్యానికి కరోనా ఒక కారణమైతే మరోవైపు ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్ బిజీగా ఉండడం కూడా మరో కారణం అని అంటున్నారు.ముందుగా ఆచార్యలో రామ్ చరణ్ పాత్రలో మహేష్‌ని అనుకున్నారు. కాని అనుకోకుండా రామ్ చరణ్ వచ్చాడు. ఆయన వలన షూటింగ్ మరింత ఆలస్యం అయినట్టు తెలుస్తుంది. ఇక బన్నీతో సినిమా చేయాలని కొరటాల భావించగా, అది ఇప్పట్లో కుదిరేలా లేదు.ఇక ఎన్టీఆర్‌తో ఇటీవల సినిమా కన్‌ఫాం చేశాడు.

మరి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నుండి బయటకు వస్తాడు, కొరటాలతో ఎప్పుడు సినిమా చేస్తాడన్నది ప్రశ్నార్దకంగా మారింది.ఈ నేపథ్యంలోనే అటు ఆచార్య విడుదల కాకపోవడం, ఇటు ఎన్టీఆర్ RRR నుంచి ఎప్పుడు బయటికి వస్తాడో తెలియదు.. ఒకవేళ వచ్చినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా షూటింగ్ మొదలు పెట్టాలంటే చాలా కష్టం.. కాబట్టి ప్రస్తుతం కొరటాల శివకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని అంటున్నారు విశ్లేషకులు…!!

జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్”ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు మనకు తెలిసిందే. దాదాపు చివరి దశలో షూటింగ్ ఉన్న ఈ సినిమా పై కరోనా ప్రభావం పడటం వల్ల షూటింగ్ వాయిదా పడింది. అయితే ఎన్టీఆర్ రాజమౌళి సినిమా తర్వాత తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుందనే సమాచారం తెలిసిందే.

ఇప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. తిరిగి ఇద్దరి కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్”, శివ “ఆచార్య”సినిమాలు2 పూర్తికాగానే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ ఏర్పడగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఎవరు అనే సస్పెన్షన్ కి తెరపడినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ, లేదా రష్మికను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో కియారా మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ తరుణంలోనే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని మరోసారి కియారాకే ఇవ్వాలనే ఆలోచనలో దర్శకుడు కొరటాల శివ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో సందడి చేయనున్నారని, స్టూడెంట్ పాలిటిక్స్ తరహాలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా దర్శకుడు కియారాకి అవకాశం ఇస్తారా లేక రష్మికి అవకాశం ఇస్తారనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.