Tag Archives: kushboo

Mansoor Ali Khan: త్రిష, కుష్బూ, చిరంజీవిపై కేసు వేసిన నటుడు మన్సూర్ అలి ఖాన్ !

Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈయన హీరో విజయ్ త్రిష నటించిన లియో సినిమాలో కీలక పాత్రలో పోషించారు. అయితే ఈ సినిమా విషయంలో భాగంగా ఈయన త్రిష పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి తాను పలు సినిమాలలో హీరోయిన్లతో రేప్ సన్నివేశాలలో నటించాలని కానీ ఈ సినిమాలో త్రిషతో నటించే అవకాశం రాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా త్రిషతో తనకు ఈ అవకాశం మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది అంటూ అసభ్యకర పదజాలం ఉపయోగించారు. అయితే ఈ వ్యాఖ్యలపై త్రిషా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈమెకు మద్దతుగా కుష్బూ కూడా అండగా నిలిచారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇతర సెలబ్రిటీలు కూడా ఈ త్రిషకు మద్దతుగా నిలబడటమే కాకుండా మన్సూర్ అలీ ఖాన్ లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.

ఇకపోతే ఈయన చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా త్రిషకో క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్లు వచ్చాయి కానీ మన్సూర్ మాత్రం తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొందరు ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలను తప్పుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంటూ ఈయన తెలిపారు. అయినప్పటికీ ఈయన పట్ల చాలామంది విమర్శలు కురిపించగా బహిరంగంగా త్రిషకు క్షమాపణలు చెప్పారు.

పరువు నష్టం కేసు వేసిన మన్సూర్…

ఇకపోతే త్రిష విషయంలో తన పట్ల కామెంట్లు చేస్తూ తన పరువుకు భంగం కలిగించినటువంటి త్రిష కుష్బూ చిరంజీవి వంటి సెలబ్రిటీలపై ఈయన పరువు నష్టం కేసుతో పాటు వారు తనని మానసికంగా హింసించారని అలాగే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు ఈయన వెల్లడించారు. త్రిషకు క్షమాపణలు చెప్పడంతో ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందని అందరూ భావించారు. కానీ ఈయన మరోసారి సెలబ్రిటీలపై కేసు వేయడంతో ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Actress Kushboo: మా నాన్న నుంచే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నా.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి కుష్బూ!

Actress Kushboo: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి కుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా కూడా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈమెను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహిళలు ఎదుర్కొన్నటువంటి లైంగిక ఆరోపణల గురించి మాట్లాడుతూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు మహిళలపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇలా మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ దాడుల గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు తాను కూడా లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్నానని ఈమె పడిన ఇబ్బందుల గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.అయితే తనని తన తండ్రి లైంగిక ఆరోపణలకు గురి చేశారంటూ ఈమె షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

Actress Kushboo: 8 ఏళ్ల వయసులోనే వేధించారు..

ఇలా తన తండ్రి తాను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన పట్ల లైంగిక ఆరోపణలు చేశారని వెల్లడించారు. అయితే 15సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తాను తన తండ్రిని ఎదిరించానని ఆ క్షణం తమను వదిలి వెళ్లిపోయాడని ఈమె తెలియజేశారు.ఈ విధంగా స్వయంగా నటి కుష్బూ తన తండ్రి నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాను అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Indraja: కెవ్వు కార్తీక్ టీం పై మండిపడిన ఇంద్రజ… ఏకంగా షో మధ్యలోనే బయటికి వెళ్లిన జడ్జ్!

Actress Indraja: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కొందరు కమెడియన్స్ బయటకు వెళ్లిపోవడంతో కాస్త రేటింగ్ తగ్గినప్పటికీ తిరిగి ఈ కార్యక్రమానికి హైపర్ ఆది గెటప్ శ్రీను వంటి వారు రావడంతో ఈ కార్యక్రమం పై మరికొన్ని అంచనాలు పెరిగాయి.

ఇకపోతే ఈ కార్యక్రమానికి జడ్జిగా రోజా, నాగబాబు ఉండే వారు. అయితే రోజాకు మంత్ర పదవి రావడంతో ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈమె స్థానంలో ఇంద్రజ పర్మినెంట్ జడ్జిగా ఉండిపోయారు అయితే నాగబాబు స్థానంలో ఎంతోమంది వస్తున్నారు వెళ్తున్నారు.ఇకపోతే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా కుష్బూ ఇంద్రజ న్యాయ నిర్ణేతలుగా సందడి చేశారు.

కంటెస్టెంట్లు అందరూ ఎప్పటిలాగే తమ పెర్ఫార్మెన్స్ తో అందరిని సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా కెవ్వు కార్తీక్ వెరైటీగా జడ్జెస్ వల్ల టీం లీడర్స్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో చూపించారు.అయితే ఈ స్కిట్ అయిపోయిన అనంతరం జడ్జిమెంట్ టైంలో ఇంద్రజ మాట్లాడుతూ ఏంటి కెవ్వు కార్తిక్ ఈమధ్య మరి దారుణంగా తయారయ్యారు అంటూ ఇంద్రజ కెవ్వు కార్తీక్ కి షాక్ ఇచ్చారు.

Actress Indraja: రేటింగ్ కోసమే మరో ట్రిక్..

ఇంద్రజ మాట్లాడుతూ జడ్జెస్ వల్ల టీం లీడర్స్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో మీరు చూపించారు అలాగే టీం లీడర్స్ వల్ల జడ్జెస్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ స్కిట్ చేయండి అప్పుడే ఈ రెండింటికి కలిపి జడ్జిమెంట్ ఇస్తాను అంటూ ఆమె ఏకంగా కెవ్వు కార్తీక్ పై మండిపడటమే కాకుండా షో మధ్యలో నుంచి లేచి వెళ్లిపోయారు.అయితే ఇది నిజంగానే జరిగిందా లేకపోతే రేటింగ్ కోసమే మరోసారి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారా అనేది తెలియాల్సి ఉంది.

Actress Radhika: ఘనంగా జరిగిన నటి రాధిక 60వ పుట్టినరోజు.. పెద్ద ఎత్తున హాజరైన సెలబ్రిటీలు?

Actress Radhika:దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోని అన్ని భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధిక శరత్ కుమార్ గురించి మనకు సపరిచితమే. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన రాధిక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ప్రస్తుతం ఎంతోమంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ రాధిక ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె కేవలం నటిగా మాత్రమే కాకుండా యాంకర్ గా నిర్మాతగా కూడా వ్యవహరించారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధిక ఆగస్టు 21వ తేదీతో ఈమె ఘనంగా తన 60 వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

రాధిక 61 పుట్టినరోజు కావడంతో తన కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేశారు. ఇక రాధిక పుట్టిన రోజు సందర్భంగా ఎంతోమంది నటీమణులు పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే నటి రమ్యకృష్ణ, మీనా, కుష్బూ, జ్యోతిక వంటి హీరోయిన్లు రాధిక పుట్టినరోజు వేడుకలలో సందడి చేశారు. ఇక మొదటిసారి సూర్య తన భార్య జ్యోతికను తీసుకొని ఈ వేడుకలకు హాజరయ్యారు.

Actress Radhika: ఘనంగా పుట్టినరోజు వేడుక…

ఇలా ఎంతోమంది స్నేహితులు సెలబ్రిటీలు నడుమ రాధిక తన 60 వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. ఈ క్రమంలోనే ఈమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె పుట్టినరోజు వేడుకలలో భాగంగా నటి మీనా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భర్త చనిపోయిన తర్వాత మీనా ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు ఇలా ఈమెను బర్త్ డే పార్టీలో చూడటంతో అభిమానులు మీనా ఇప్పుడిప్పుడు తన బాధ నుంచి బయట పడుతుందని సంతోషపడుతున్నారు.

Kushboo : ఆ షూటింగ్ లో చేయ్యివేస్తే.. చెంప పగలకోట్టాను.. నిర్మాత సురేష్ బాబు అక్కడే ఉన్నారు.. : నటి కుష్బూ

దేవుళ్ళు లేదా దేవతలకు గుడి కట్టడం సర్వ సాధారణం. తర్వాత రాజులు, చక్రవర్తులకు గుడి కట్టిన దాఖలాలున్నాయి. ఆ తర్వాత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులకు గుడి కట్టిన సందర్భాలున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులకు ఆ పార్టీ కార్యకర్తలు గుడి కట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగే తారలకు గుడి కట్టడం జరిగిన మొట్ట మొదటి తార ఖుష్బూ.. అందమైన రూపం కుర్రాళ్ల మతులు పోగొట్టే వయ్యారం ఆమె సొంతం. 80-90 దశకంలో స్టార్ హీరోయిన్ గా సౌత్ సినిమాలలో ఒక వెలుగు వెలిగారు కుష్బూ. మహారాష్ట్రకు చెందిన కుష్బూ కోలీవుడ్ తిరుగులేని నటిగా ఎదిగారు.. ఆమె అందానికి పడిపోయిన తమిళ ప్రేక్షకులు గుడికూడా కట్టి ఆరాధించారంటే అర్థం చేసుకోవచ్చు.

1970 ముంబైలో పుట్టిన ఖుష్బూ బాల్యంలోనే అనేక చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ లో హీరో వెంకటేష్ న్యూ ఎంట్రీ తో వచ్చిన కలియుగ పాండవులు చిత్రంలో హీరోయిన్ గా ఖుష్బూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు ఘటనను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఖుష్బూ. సినీ పరిశ్రమలో లైగింక వేధింపుల గురించి మాట్లాడుతూ.. ఒక సమయంలో తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు ఖుష్బూ. తెలుగులో తన మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’ చిత్రం షూటింగ్ జరుగుతున్నా సమయంలో తనతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది.

ఒక విలేజ్ లో కలియుగ పాండవులు సినిమా షూటింగ్ ముగిసిన తరువాత మేడపైకి మెట్లు ఎక్కుతున్న సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన వెనుక భాగంపై తాకాడని.. వెంటనే కోపంతో తాను అతని చెంప పగలగొట్టానని నటి ఖుష్బూ. అయితే ఆ సమయంలో ఆ చిత్ర నిర్మాత డి. సురేష్ బాబు అక్కడే ఉన్నారని.. అప్పుడు ఆయనతో పాటు అక్కడ షూటింగ్ లో ఉన్న కొందరు తనకు మద్దతుగా నిలిచారు.. అంటూ కుష్బూ తన డెబ్యూ మూవీ షూటింగ్ లో జరిగిన చేదు అనుభవం గురించి తెలిపారు.

ఖుష్‌బూ అప్పటికే పెళ్ళైన హీరోతో ప్రేమలో పడ్డ విషయం తెలుసా.. అసలు ఏం జరిగిందంటే..

ఖుష్‌బూ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. 1991 సంవత్సరం ఆమె కెరీర్ ను అనూహ్యంగా మలుపుతిప్పిన సంవత్సరంగా పేర్కొనాలి. తమిళంలో ఆమె నటించిన చిత్రం చిన్నతంబి అప్పట్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. ప్రతి జిల్లాలో సినిమా విజయవంతం అయినందుకు వేడుకలు కూడా జరుపుకున్నారు.

అప్పట్లో ఆమెకు దేవాలయాలు కూడా కట్టారు. కొందరు అభిమానులు అయితే ఆమెకు రక్తంతో కూడా ఉత్తరాలు రాశారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్ హీరోలతో ఆమె నటించే అవకాశాలు దక్కాయి. ఇలా సినిమాలో ఆమె జీవితం ఎంతో విజయవంతగా సాగినా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. పెళ్లైన ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో పడ్డారు. ఆమె ప్రభుతో సంబంధం గురించి అప్పట్లో గుసగుసలు బాగా వినిపించేవి.

ఆమెకు హీరోయిన్ గా మంచి పేరు రాకముందే ఆమె 1989లో ప్రభుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 1993 సమయంలో ఒక పాపుల‌ర్ త‌మిళ డైలీలో ఈ వార్త‌ను ఫ్రంట్ పేజీలో ప్రచురించడంతో.. ఆమెను ప్రతీ ఒక్కరు తిట్టుకున్నారు. ఒక సంసార జీవితంలో నిప్పులు పోస్తావా అంటూ ప్రతి ఒక్కరూ తిట్టారు. ఆ క్ర‌మంలో ఆమెను ఏకంగా ఐదు సినిమాల నుంచి తొల‌గించారు. ఆ కారణంగానే ప్రభుతో ఆమె అనుబంధాన్ని తెంచేసుకుంది.

ఆ తర్వాత సినిమాలు చేయడం చాలా రోజుల వరకు మానేసింది. డైరెక్ట‌ర్ సి. సుంద‌ర్‌ను 2000 సంవ‌త్స‌రంలో పెళ్లి చేసుకున్నారు ఖుష్‌బూ. తర్వాత ఎలాంటి గొడవలు లేకుండా.. ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గ‌డుపుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఖుష్‌బూ భర్త సుందర్ దర్శకత్వంలో ప్రభు ఓ సినిమాలో నటించారు.