Rashmika: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు మేనేజర్ లో ఉండడం సర్వసాధారణం.హీరో హీరోయిన్లకు అవకాశాలు రావాలన్న మేనేజర్ల కృషి ఎంతో ఉంటుంది అలాగే వారి ఆర్థిక వ్యవహారాలు చూసుకోవాలన్నా కూడా మేనేజర్ పాత్ర ఎంతో ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా మేనేజర్లను నియమించుకొని వారి బాధ్యతలు అన్నిటిని వారికి అప్పజెబుతారు.సెలబ్రిటీలకు మంచి సినిమా అవకాశాలను కనుక తీసుకువస్తే మేనేజర్లకు కూడా భారీగా లాభాలు ఉంటాయి.
అందుకే సెలబ్రిటీలకు మేనేజర్లగా వ్యవహరించడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇదే అదునుగా భావించి చాలామంది మేనేజర్లు సెలబ్రిటీలను మోసం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతోమంది సెలబ్రిటీలు మేనేజర్ల చేతిలో మోసపోయి కొన్ని లక్షలు కోట్ల రూపాయలను నష్టపోయిన వారు ఉన్నారు. ఈ క్రమంలోని తాజాగా నటి రష్మిక మందన్న సైతం తన మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా తన వద్ద మేనేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి రష్మికకు తెలియకుండా దాదాపు 80 లక్షల రూపాయల వరకు ఫ్రాడ్ చేశారని తెలుస్తోంది.ఈ విషయం ఆలస్యంగా ఆమెకు తెలియడంతో తీవ్రస్థాయిలో సదరు మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనని తొలగించారని సమాచారం. ఈ విధంగా రష్మిక మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయారని తెలుస్తుంది.
Rashmika:
ఈమె వరస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉండగా తన వ్యవహారాలన్నింటిని మేనేజర్ చూసుకోవడంతో ఈమె పెద్దగా ఆర్థిక వ్యవహారాలను పట్టించుకోవడం లేదట దీంతో ఆయన మోసానికి పాల్పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి రష్మిక ఎక్కడ అధికారక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో పాటు ఇతర సినిమాల్లో షూటింగ్లలో కూడా బిజీ అయ్యారు.
Johnny Master:కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈయన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ ని కూడా అంతే అభిమానిస్తారు.ఈ క్రమంలోనే మెగా హీరోలు నటించే ప్రతి సినిమాకి ఈయన కొరియోగ్రఫీ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే జానీ మాస్టర్ మెగా కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి ఎన్నోసార్లు బయటపెట్టారు. అయితే తాజాగా కేవలం రామ్ చరణ్ వల్లే తన భార్య బిడ్డ బతికి ఉన్నారని రామ్ చరణ్ చేసిన సహాయం గురించి తెలియజేశారు.అయితే ఒక డాన్స్ షోలో భాగంగా జానీ మాస్టర్ జీవితంలో జరిగిన ఈ సంఘటనను కంటెస్టెంట్లు ఫర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఇందులో భాగంగా జానీ మాస్టర్ సతీమణి గర్భవతిగా ఉన్నప్పుడు వెంటనే తనకు సర్జరీ చేస్తేనే ఇద్దరు ప్రాణాలు నిలబడతాయని వెంటనే సర్జరీ చేయాలి లేదంటే ఎవరో ఒకరిని మాత్రమే కాపాడుతామని వైద్యులు చెప్పారు.
ఈ విధంగా డాక్టర్లు చెప్పేసరికి ఏం చేయాలో దిక్కు తెలియక సహాయం కోసం జానీ మాస్టర్ రామ్ చరణ్ గారికి ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో రాంచరణ్ మౌనవ్రతంలో ఉన్నారనీ తన మేనేజర్ చెప్పడమే కాకుండా తనకు ఏం చెప్పాలో చెప్పండి అంటూ మేనేజర్ అడిగారు. విషయం చెప్పినప్పటీకీ జానీ మాస్టర్ మాత్రం రామ్ చరణ్ మౌనవ్రతంలో ఉంటే తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరని భావించారు.
Johnny Master: బిల్లు మొత్తం ఉపాసన కట్టారు…
ఇక రాంచరణ్ మౌనవ్రతంలో ఉన్నప్పటికీ ఆయన చేయాల్సిన సహాయం చేశారు. ఇక హాస్పిటల్ కి వెళ్ళగా వెంటనే సర్జరీ చేసి తన భార్య బిడ్డని ఇద్దరిని బ్రతికించారని అయితే ఫీజు కట్టే సమయంలో సిబ్బంది కేవలం 350 రూపాయలు మాత్రమే కట్టండి మిగిలినది మొత్తం ఉపాసన మేడం కట్టారని చెప్పారట. ఇది తెలిసి జానీ మాస్టర్ ఆశ్చర్యపోయారు. రామ్ చరణ్ మౌనవ్రతంలో ఉన్నప్పటికీ ఆయన తనను సహాయం కోరి వచ్చే వారిని వెనుతిరిగి పంపించరని ఇలా ఏదో రూపంలో సహాయం చేస్తారంటూ జానీ మాస్టర్ కు రామ్ చరణ్ చేసిన సహాయాన్ని ఇలా పర్ఫామెన్స్ చేసి చూపించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అవుతుంది.
Thamanna:సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే హీరో హీరోయిన్లు కెరియర్ మొదట్లో వారికి సంబంధించిన సినిమా విషయాల గురించి ఫైనాన్షియల్ విషయాల గురించి వారే దగ్గరుండి అన్ని విషయాల గురించి చూసుకుంటారు.అయితే వారి కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాలు పడి సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో వారికంటూ ఒక మేనేజర్ నియమించుకొని వారికి సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలన్నింటినీ కూడా మేనేజర్ కి అప్ప చెబుతారు.
Thamanna: మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిన తమన్నా… ఏం జరిగిందంటే?
ఇలా ప్రతి ఒక్క హీరో హీరోయిన్ తప్పనిసరిగా మేనేజర్ ను నియమించుకొని పూర్తిగా ఫైనాన్షియల్ విషయాలన్నీ వారికే వదిలేస్తారు. ఇకపోతే గత దశాబ్ద కాలం నుంచి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Thamanna: మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిన తమన్నా… ఏం జరిగిందంటే?
ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుని కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తన కెరియర్ లోఎంతో బిజీగా గడుపుతున్న తమన్నా తనకు సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలన్నింటిని కూడా తన మేనేజర్ కి అప్ప చెప్పి తన పూర్తి దృష్టిని సినిమాలపై ఉంచారు. ఇలా తమన్నా సినిమాలపై దృష్టి సారించడం వల్ల మేనేజర్ మాత్రం ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ లను చెల్లించకుండా ఆ డబ్బులను తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించారు.
ఇలా ప్రభుత్వానికి కట్టాల్సిన పనులు చెల్లించకపోవడంతో ప్రభుత్వం తమన్నాకు నోటీసులు పంపించారు.ఇలా ప్రభుత్వం నుంచి నోటీసులు రావడంతో షాక్ అయిన తమన్నా ఏం జరిగిందని ఆరా తీయగా మేనేజర్ చేతివాటం బయటపడటంతో అప్పటినుంచి అప్రమత్తమైన ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ఎంతో జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అయితే కేవలం తమన్నా మాత్రమే కాకుండా ఇలా మేనేజర్ చేతిలో మోసపోయిన ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారని చెప్పవచ్చు.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ అరెస్టు కావడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్యన్ కు మద్దతుగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే అతనిని అరెస్టు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అతనికి బెయిల్ రాకుండా ఎన్సీబి అధికారులు తమ వాదనను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ హైకోర్టుకు వెళ్లారు.
ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ మేనేజర్ పూజ దడ్లానీ ఆర్యన్ బెయిల్ విచారణ పై పలుమార్లు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే చాలా మంది నెటిజన్లు అసలు ఈ పూజ ఎవరు అంటూ ఆమె గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గతంలో ఆర్యన్ ఖాన్ గురించి పూజ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2012వ సంవత్సరం నుంచి పూజ షారుఖాన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆర్యన్ 19 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు… తన తండ్రి తెలివి తల్లిలా అందరితో కలిసిపోయే లక్షణాలు ఉన్నటువంటి మంచి హృదయం సున్నితమైన మనస్తత్వం కలిగిన ఆర్యన్ ఖాన్ టీనేజ్ దాటిన అందుకు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ కేసు బెయిల్ విచారణలో భాగంగా ఈమె కోర్టుకు పలుమార్లు హాజరవుతూ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు అతనికి బెయిల్ ఇవ్వకూడదని కోర్టులో విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏడాదికి 18 లక్షల రూపాయల వేతనంతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏఏఐ నుంచి మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
డిసెంబర్ 15వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 14వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా ఎస్సీ,ఎస్టీ, మహిళలకు దరఖాస్తు ఫీజు 170 రూపాయలుగా ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపికైన వారు దేహదారుఢ్య పరీక్షలు, వాయిస్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. 2020 నవంబర్ 30 నాటికి మేనేజర్లకు 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళు మేనేజర్ ఉద్యోగాలకు, 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు జూనియర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ లకు 18 లక్షలు, జూనియర్ మేనేజర్ లకు 12 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.
బీఈ / బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అయిదు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మెకానికల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ ఉద్యోగాలకు 13 ఖాళీలు ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 355 ఖాళీలు ఉన్నాయి. http://www.aai.aero/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net