Johnny Master:కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈయన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ ని కూడా అంతే అభిమానిస్తారు.ఈ క్రమంలోనే మెగా హీరోలు నటించే ప్రతి సినిమాకి ఈయన కొరియోగ్రఫీ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే జానీ మాస్టర్ మెగా కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి ఎన్నోసార్లు బయటపెట్టారు. అయితే తాజాగా కేవలం రామ్ చరణ్ వల్లే తన భార్య బిడ్డ బతికి ఉన్నారని రామ్ చరణ్ చేసిన సహాయం గురించి తెలియజేశారు.అయితే ఒక డాన్స్ షోలో భాగంగా జానీ మాస్టర్ జీవితంలో జరిగిన ఈ సంఘటనను కంటెస్టెంట్లు ఫర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఇందులో భాగంగా జానీ మాస్టర్ సతీమణి గర్భవతిగా ఉన్నప్పుడు వెంటనే తనకు సర్జరీ చేస్తేనే ఇద్దరు ప్రాణాలు నిలబడతాయని వెంటనే సర్జరీ చేయాలి లేదంటే ఎవరో ఒకరిని మాత్రమే కాపాడుతామని వైద్యులు చెప్పారు.
ఈ విధంగా డాక్టర్లు చెప్పేసరికి ఏం చేయాలో దిక్కు తెలియక సహాయం కోసం జానీ మాస్టర్ రామ్ చరణ్ గారికి ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో రాంచరణ్ మౌనవ్రతంలో ఉన్నారనీ తన మేనేజర్ చెప్పడమే కాకుండా తనకు ఏం చెప్పాలో చెప్పండి అంటూ మేనేజర్ అడిగారు. విషయం చెప్పినప్పటీకీ జానీ మాస్టర్ మాత్రం రామ్ చరణ్ మౌనవ్రతంలో ఉంటే తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరని భావించారు.
ఇక రాంచరణ్ మౌనవ్రతంలో ఉన్నప్పటికీ ఆయన చేయాల్సిన సహాయం చేశారు. ఇక హాస్పిటల్ కి వెళ్ళగా వెంటనే సర్జరీ చేసి తన భార్య బిడ్డని ఇద్దరిని బ్రతికించారని అయితే ఫీజు కట్టే సమయంలో సిబ్బంది కేవలం 350 రూపాయలు మాత్రమే కట్టండి మిగిలినది మొత్తం ఉపాసన మేడం కట్టారని చెప్పారట. ఇది తెలిసి జానీ మాస్టర్ ఆశ్చర్యపోయారు. రామ్ చరణ్ మౌనవ్రతంలో ఉన్నప్పటికీ ఆయన తనను సహాయం కోరి వచ్చే వారిని వెనుతిరిగి పంపించరని ఇలా ఏదో రూపంలో సహాయం చేస్తారంటూ జానీ మాస్టర్ కు రామ్ చరణ్ చేసిన సహాయాన్ని ఇలా పర్ఫామెన్స్ చేసి చూపించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అవుతుంది.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…