Allu Studio: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య నటుడిగా కొనసాగుతూ అనంతరం ఆయన వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అల్లు అరవింద్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇంతటితో ఆగకుండా ఈయన సినిమా ఇండస్ట్రీలో మరో అడుగు ముందుకు వేశారు. నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ కుటుంబం నుంచి అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే తాజాగా అల్లు ఫ్యామిలీ స్టూడియో నిర్మాణాన్ని చేపట్టిన సంగతి మనకు తెలిసిందే.
హైదరాబాదులో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏకంగా 100 కోట్ల నిర్మాణంతో అల్లు స్టూడియో నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ స్టూడియో నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ స్టూడియో ప్రారంభం కానుందని తెలుస్తుంది. అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్ ఒకటో తేదీ కావడంతో అదే రోజున అల్లు స్టూడియోను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా హాజరు కానుంది. ఇకపోతే ఈ స్టూడియో నిర్మాణం పూర్తయిన తర్వాత అల్లు అరవింద్ స్థాపించినటువంటి ఆహా ఓటీటీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ స్టూడియోలోనే జరగనున్నట్లు సమాచారం. అలాగే సినిమా షూటింగులు కూడా ఈ స్టూడియోలో జరుపుకోనన్నట్లు తెలుస్తోంది. ఈ స్టూడియో నిర్మాణంలో అల్లు అరవింద్ ముగ్గురు కుమారుల భాగస్వామ్యం ఉంది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీకానున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…