ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏడాదికి 18 లక్షల రూపాయల వేతనంతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏఏఐ నుంచి మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
డిసెంబర్ 15వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 14వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా ఎస్సీ,ఎస్టీ, మహిళలకు దరఖాస్తు ఫీజు 170 రూపాయలుగా ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపికైన వారు దేహదారుఢ్య పరీక్షలు, వాయిస్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. 2020 నవంబర్ 30 నాటికి మేనేజర్లకు 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళు మేనేజర్ ఉద్యోగాలకు, 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు జూనియర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ లకు 18 లక్షలు, జూనియర్ మేనేజర్ లకు 12 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.
బీఈ / బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అయిదు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మెకానికల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ ఉద్యోగాలకు 13 ఖాళీలు ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 355 ఖాళీలు ఉన్నాయి. http://www.aai.aero/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…