Featured

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. బంగారం ధర రూ.63 వేలకు పెరిగే ఛాన్స్..?

ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రజలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రెండు దశాబ్దాల క్రితం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం 50,000 రూపాయలుగా ఉంది. అయితే కొత్త ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంటే ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని చెబుతున్నారు.

2021 సంవత్సరంలో బంగారం ధర ఏకంగా 63,000 రూపాయలకు చేరే అవకాశం ఉంది. రోజురోజుకు డాలర్ బలహీనపడటం, కొత్తరకం కరోనా విజృంభిస్తూ ఉండటం, ఇతర కారణాల వల్ల బంగారం ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం ధర పెరిగే అవకాశాలు ఉండటంతో పసిడిపై పెట్టుబడులు పెడితే మంచిది. పసిడి కొనాలనే ఆసక్తి ఉంటే వీలైనంత త్వరగా కొనుగోలు చేస్తే మంచిది.

ఈ ఏడాది ఆగష్టు నెలలో రికార్డు స్థయైలో 59,000 రూపాయలకు బంగారం ధర చేరగా వచ్చే ఏడాది ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పసిడి ధర పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులు పెడితే మంచిది. కరోనా మహమ్మారి కారణంగా డబ్బులు ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా బంగారం కొనుగోలు చేస్తే మంచిది. అయితే బంగారం ధరపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో బంగారం ధరలు 63 వేల రూపాయల కంటే ఎక్కువగా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago