General News

హైదరాబాద్ హిందూ మహాసమ్మేళనం హనుమాన్ చాలీసా కార్యక్రమం ముఖ్యాంశాలు..

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి!
వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ మహా సమ్మేళన్ కార్యక్రమంలో ఇరవై ఒక్క హనుమాన్ చాలీసా పారాయణల అఖండ కార్యక్రమం పరమ వైభవంగా జరగటంతో టాక్ ఆఫ్ ది ట్విన్ సిటీస్‌గా నిలవడం అనేక ఆలయాల్లో, భక్తమండళ్లలో ఆశ్చర్యకరమైన పవిత్ర చర్చగా దారితీసి మరొక మహోజ్జ్వల ఘట్టానికి దారితీసేందుకు శ్రీకారం చుడుతోంది.

నగర ప్రముఖులు, హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సమన్వయకర్తలు చంద్రశేఖర్ గాంధీ, శ్రీమతి జగన్మోహిని, జమలాపురం రాధాకృష్ణల చక్కని సంఘీభావ నిర్మాణాత్మక దక్షతతో ఈ మహాకార్యం దిగ్విజయంగా జరగడంతో భక్తకోటి రసజ్ఞులూ ఒక్కటై వారిపై ప్రశంసలు వర్షన్డం ఆసక్తిదాయకం.

సభాప్రారంభకులు సీనియర్ పాత్రికేయులు, జాతీయవాది రాకా సుధాకర్ రావు తన ప్రసంగంలో… చరిత్రపొడవునా హిందూ సంస్కృతి వైభవ ప్రాభవాలను వివరిస్తూ, వర్తమాన పరిస్థితులలో హిందూధర్మ పరిరక్షణకు యువత నడుం బిగించాలని అనేక ఆసక్తిదాయమైన అంశాలతో పాటు హనుమాన్ చాలీసా విశేషాలతో సభికుల్ని ఆకట్టుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితురాలు అహం టాక్స్ అధినేత్రి శ్రీమతి మోనికారెడ్డి మాట్లాడుతూ.. జాతి యావత్తూ హిందూధర్మాన్ని కాపాడుకుంటూ, హిందూ ఐక్యతకు నడుం బిగించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ కేవలం ఐదు నిమిషాలు మాట్లాడినా అత్యంత ఆసక్తిదాయకంగా, మనోజ్ఞంగా హనుమద్వైభవాన్ని పేర్కొనడం రసజ్ఞుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇంతటి మహా పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం తనకి రావడం పట్ల హనుమంతునికి, నిర్వాహకులకు పురాణపండ ఎంతో వినయంగా కృతజ్ఞతలు తెలిపారు. జీవితాన్ని హనుమ సాధనతో తన్మయింప చేసుకుని అత్యంత ధైర్యంతో ఈతరం మున్ముందుకు కదం తొక్కుతూ సాగాలని పురాణపండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

మైహోం అవతార్ గ్రౌండ్స్‌లో శ్రీమతి జగన్మోహిని పర్యవేక్షణలో సుమారు రెండున్నర గంటల పాటు తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసా పారాయణ ఎంతో భక్తి నిండిన వాతావరణంలో ఇరవై ఒక్క సార్లు సామూహిక పారాయణ కార్యక్రమం జరగడం.. ఆ ప్రాంతంలో పవిత్ర సంచలనం సృష్టించింది. ప్రసన్న గంభీర స్థితిలో జరిగిన ఈ పారాయణ కార్యక్రమంలో సుమారు నాల్గువేలమంది పాల్గొనడం విశేషంగా చెప్పక తప్పదు. ఆద్యంతం శ్రీ రామానుగ్రహంగా, హనుమన్మయంగా జరిగిన హిందూ మహా సమ్మేళన్ కార్యక్రమంలో పురాణపండ శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పలువురు యువతీ యువకులు సెల్ఫీలు దిగడం మీడియా కంట పడటం మరొక ప్రత్యేక విశేషంగానే పేర్కొనాలి. పురాణపండ శ్రీనివాస్ నిస్వార్ధ సేవ గురించీ, అద్భుత ఆధ్యాత్మిక రచనల గురించీ పలువురు ప్రస్తావించడం గమనార్హం. మైహోమ్ అవతార్ చరిత్రలో మైలురాయిలా నిలిచేలా ఇంతటి మహోత్తమ కార్యాన్ని అద్భుతంగా నిర్వహించడంలో ఎంతో కష్టపడిన దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ గాంధీ, శ్రీమతి జగన్మోహిని, జమలాపురం రాధాకృష్ణలను అనేకమంది అభినందించడం స్పష్టంగా కనిపించింది. భాగ్యనగరంలో ఇటీవల జరిగిన హిందూ మహా సమ్మేళన్ భక్తికార్యక్రమాల్లో ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఒక పతాక స్థాయి విజయమేనని చెప్పాల్సిందే!

Puranapanda Srinivas, Hanuman Chalisa, Myhome Avathar, hyderabad, Hindu Maha Sammelan

Sairam K

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago