Tag Archives: monita

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో కార్తీకదీపం విలన్ మోనిత… ఈమె రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Bigg Boss 7: బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఇక తెలుగులో ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లలో కార్తీకదీపం విలన్ కూడా ఉన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా బిగ్ బాస్ రివ్యూయర్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

ఇలా కార్తీకదీపం సీరియల్ లో మోనిత పాత్రలో నటించినటువంటి నటి శోభా శెట్టి ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ఈసారి తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందని తెలుస్తోంది.

Bigg Boss 7:లక్షల్లో రెమ్యూనరేషన్…

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం శోభ శెట్టి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈమె ఒక వారం రోజులపాటు హౌస్ లో కొనసాగడం కోసం ఏకంగా 1.25 లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

Karthika Deepam Shobhashetty: సీతగా మారిపోయిన కార్తీకదీపం మోనిత… ఫోటోలు వైరల్!

Karthika Deepam Shobhashetty: బుల్లితెరపై ప్రసారం అవుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ ద్వారా దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్, కార్తీక్ పాత్రలో నటించిన నిరుపమ్, మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.

Karthika Deepam Shobhashetty: సీతగా మారిపోయిన కార్తీకదీపం మోనిత… ఫోటోలు వైరల్!

ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన మోనిత అలియాస్ శోభా శెట్టి ఇది వరకు ఎన్నో సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సీరియల్లో సూర్పనఖ తరహా పాత్రలో నటించిన మోనిత తన విలనిజంతో అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది.

Karthika Deepam Shobhashetty: సీతగా మారిపోయిన కార్తీకదీపం మోనిత… ఫోటోలు వైరల్!

ఈ విధంగా కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం ఈ సీరియల్ లో తర్వాత జనరేషన్ ప్రారంభం కావడంతో సీరియల్ నుంచి తప్పుకుంది. ఈ విధంగా ఈ సీరియల్ నుంచి దూరమైన శోభా శెట్టి సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులను సందడి చేస్తున్నారు.

విలన్ గా భయపెట్టిన మోనిత..

ఇక శోభా శెట్టి ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా శోభా శెట్టి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే సీరియల్స్ లో సూర్పణక పాత్రలలో నటిస్తూ విలన్ గా ముద్ర వేయించుకున్న శోభా శెట్టి తాజాగా సీతమ్మ గెటప్ వేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం శోభా శెట్టి సీత పాత్రకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రాక్షస నిజాలు తెలుసుకున్న డాక్టర్ బాబు.. మోనితను చంపేందుకు వెళ్తూ..!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1111 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ ఎపిసోడ్ లో భాగ్యం ఎలాగైనా
మోనితను కిడ్నాప్ చేసి ఈ పెళ్ళి తప్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మోనిత ఇంటికి వెళ్లి మాయ మాటలు చెప్పడంతో భాగ్యం అబద్ధం చెబుతుందని గ్రహించిన మోనిత తననిలో పలికి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి తలపై కొట్టి కుర్చీకి కట్టిపడేస్తుంది. నన్నే మోసం చేస్తావా… నేను కార్తీక్ ను ఎలాగైనా పెళ్లి చేసుకుని తీరుతాను అంటూ మోనిత అత్యుత్సాహం కనబరుస్తుంది.

ఇక డాక్టర్ బాబు దీప మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్లావు.. ఏమైంది.. అని డాక్టర్ బాబు దీపను అడగడంతో దీప నేను ఏమి చెప్పదలుచుకోలేదు. మీరు నేను చెప్పిన అడ్రస్ కి వెళ్తే చాలు అన్నీ అక్కడే తెలుస్తాయి అంటుంది. అదేదో ఇక్కడే చెప్పచ్చుగా అంటాడు.లేదు డాక్టర్ బాబు మీరు వెళ్లి కేవలం ఆ డోర్ కొట్టండి చాలు అన్ని విషయాలు మీకు తెలుస్తాయి అంటూ డాక్టర్ బాబుకి అడ్రస్ చెబుతుంది. అడ్రస్ తెలుసుకున్న డాక్టర్ బాబు దీప చెప్పిన ఇంటికి వెళ్తాడు.

అప్పటికి అక్కడ మోనిత మనిషి ద్రాక్షారామం.. అంజి మధ్య పెద్ద గొడవ జరిగి అంజి గ్లాస్ బాటిల్ తో ద్రాక్షారామం తల పగల కొడతాడు.అంతలోగా డోర్ కొట్టడంతో ఆ రక్తపు చేతులతోనే తలుపు తీయగా డాక్టర్ బాబు కనపడతాడు. ఆ విధంగా అంజిని చూసేసరికి డాక్టర్ బాబు ..ఈ రౌడీ నా దీప నమ్మింది? అని మనసులో అనుకుంటాడు. డాక్టర్ బాబు దీపమ్మ పంపారా… అంటూ హోటల్ లో దీప వీడియో తీస్తూ తనకు ధైర్యం చెప్పిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు.

డాక్టర్ బాబు మీరు మోనితను నమ్మకండి.. నన్ను నమ్మినా నమ్మక పోయినా పర్వాలేదు ఆ మోనితను నమ్మకండి… ఆమె చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. దీపమ్మ మాటలు నమ్మండి అంటూ జరిగినవన్నీ చెబుతాడు. అంజి చెప్పే మాటలకు కార్తీక్ నమ్మడు.ఈ విషయాలన్నీ అప్పుడే నాకు చెప్పావు కదా అంటూ ఇక నుంచైనా బుద్ధిగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. ఇక భాగ్యం కనిపించకపోవడంతో దీప తండ్రి మురళి కృష్ణ భాగ్యం గురించి కంగారుపడుతూ ఇంటికి వస్తాడు. తన పిన్ని కనిపించడంలేదని కంగారు పడతాడు.పిన్ని చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అంటూ దీప కూడా కంగారు పడుతుంది.

ఇక 25వ తేదీ పెళ్లి కావడంతో కార్తీక్ తండ్రి ఆనందరావు పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నాడు. ఆ సమయంలో ఆదిత్య శ్రావ్య వచ్చి మోనిత మాటలకు అన్నయ్య లొంగడు, ఈ పెళ్ళి జరగదు మీరు టెన్షన్ పడకండి నాన్న అంటాడు. అసలు మీ ఆరోగ్యం బాలేదు మీరు టెన్షన్ పడకూడదు అని డాక్టర్ వర్ధన్ చెప్పారుగా అంటే.. నేనేమైనా విగ్రహమా… టెన్షన్ పడకుండా ఉండటానికి ఇక్కడ నాకే ఇంత టెన్షన్ ఉంటే అక్కడ దీప ఇంకా ఎంత టెన్షన్ పడుతుందో అంటూ దీప గురించి ఆలోచిస్తాడు. ఈ విధంగా కార్తీక్ పెళ్లి గురించి టెన్షన్ పడుతున్న ఆనందరావుకి ఆదిత్య ఓదార్పు ఇస్తాడు.

దీప ఇంట్లో కూర్చొని అంజి దగ్గరికి వెళ్లిన డాక్టర్ బాబు ఇంకా రాలేదు… మరోవైపు పిన్ని ఎక్కడికెళ్ళిందో తెలియదు. అసలు ఏం జరుగుతోంది.ఈ విషయంలో మోనితకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు అంటూ ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి అమ్మ 25వ తేదీ మమ్మల్ని బయటకు తీసుకు వెళ్తా అన్నావ్ కదా …. గుర్తుందా అంటూ అడుగుతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.

కారులో దీపని చూసిన మోనిత.. దుర్గ కోసమంటూ ఝలక్ ఇచ్చిన దీప..!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1109 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి నేటి హైలెట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. అంజి కోసం ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మోనిత ఎవరికో ఫోన్ చేసి సూర్యాపేట హోటల్ 8 నుంచి ఒక క్యాబ్ బుక్ చేయమని చెబుతుంది అయితే అది తన ఇంటికి కాదు యాదగిరిగుట్టలో ఉన్న తన ఫామ్ హౌస్ కి అని చెప్పగానే అంజిని కిడ్నాప్ చేసి అక్కడ ఉంచాలి అనుకుంటుంది అంటూ మోనిత ప్లాన్ పసిగట్టిన దీప
తనకు చిన్న ఝలక్ ఇవ్వాలని భావిస్తుంది.అప్పుడే వాటర్ బాటిల్ కనిపించలేదు వెంకట్ కాస్త లైట్ అనగానే.. ఇదేంటి దీప గొంతులా ఉందని వెనక్కి తిరిగి చూస్తుంది. కారులో దీపని చూసేసరికి మోనిత ఎంతో షాక్ అవుతుంది.

అక్క అప్పటి నుంచి నువ్వు కారులోనే ఉన్నావా.. నువ్వు ఉన్నావని తెలియక ఖాళీగా కూర్చున్నాను. బాబు కాస్త కారు ఆపు అని చెప్పి మోనిత దీప దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. ఇంకేంటి అక్క విశేషాలు అని అడగగా… రేపు తీరిగ్గా తెలుసుకుంటావులే అంటూ సమాధానం చెబుతుంది. ఇక డ్రైవర్ టీ తాగడానికి కారు పక్కన ఆపితే వీరిద్దరు బయట దిగి కొంచెం ఫ్రీగా మాట్లాడుకుందామా అంటూ మాట్లాడుతారు.. అయినా నా ఎక్కడికి వెళుతున్నావు ఈ వేళప్పుడు అంటూ మోనిత దీపను అడగగా… దుర్గ దగ్గరికి అంటూ షాక్ ఇస్తుంది. దుర్గ పేరు వినగానే కంగారుపడిన మోనిత ఇప్పుడు వీడిని తీసుకువచ్చి నా పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తోందా.. అంటూ కంగారు పడుతుంది. అదే విజయవాడలో దుర్గఉంది కదా.. దుర్గా దేవికి వెళ్తున్నాను అని చెప్పడంతో మోనిత ఊపిరి పీల్చు కుంటుంది.

చాలా రోజుల నుంచి ఎంతో చిరాకుగా ఉన్నాను అందుకోసమే గుడికి వెళదామని వెళ్తున్నా… అయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ అని దీప అడగగా.. రేపు నా పెళ్లి కదా.. సాయంత్రమే రిసెప్షన్ ఈ హోటల్లో వంటవాళ్ళు వంట బాగా చేస్తారని వాళ్లని తీసుకువెళ్లడానికి వచ్చాను అని సమాధానం చెబుతుంది. తీసుకెళ్ళు దోసకాయ పచ్చడి బాగా చేయించు.. అవి డాక్టర్ బాబుకు చాలా ఇష్టం అని సమాధానం చెబుతుంది. నేనే ఉంటే దోసకాయ పచ్చడి రోట్లో వేసి బాగా దంచే దాన్ని నీ తలకాయ మాదిరిగా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక దీపను బాధపెట్టాలని..గుడికి ఎవరు దిక్కులేని దానిలా ఒక్కటే వెళ్లకపోతే పిల్లలని కార్తీక్ ని తీసుకువెళ్ళవచ్చు కదా అంటూ దెప్పి పొడుస్తుంది. డాక్టర్ బాబుని తీసుకు వెళ్తే పిరికివాడిలా పారిపోయాడని నువ్వే అంటావు కదా.. అందుకే రేపు జరగబోయే రచ్చకు ఎనర్జీ కావాలని విశ్రాంతి తీసుకోమని చెప్పాను అంటూ సమాధానం చెబుతుంది.

దీపలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి ఏంటి దీనికి ధైర్యం అని మనసులో అనుకుంటుంది. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి చివరికి మోనితను దింపి కారు విజయవాడ వైపు వెళ్తుంది. దీపకి నాపై అనుమానం రాలేదు అంటూ మోనిత సంతోషపడుతుంది. ఇక అంజి ఉన్న హోటల్ కి వెళ్లి అంజి రూమ్ డోర్ కొట్టగానే అంజి తలుపుతీసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంజిని చూడగానే తన కాళ్ళపై పడి తనను క్షమించమని తను మారిపోయానని, తన తప్పును తెలుసుకొని కార్తీక్, దీపను కలిపానని, తాను పెళ్లి చేసుకోబోతున్నాను తన పెళ్ళికి రమ్మని అడుగుతుంది.మోనిత మాటలు విన్న అంజి కథ బాగా చెప్తున్నావు నీకు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు.. నా కాళ్లు పట్టుకున్నావంటే నీకు ఏదో పెద్ద ప్రమాదం ఉంది అందుకే నా కోసం వెతుక్కుంటూ వచ్చావ్ అంటూ సమాధానం చెబుతాడు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఏంటి ?అనేది తరువాత ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.

కార్తికదీపం : అంజి ఆచూకి కోసం ఒకే కారులో దీప.. మోనిత.. టెన్షన్ లో డాక్టర్ బాబు..!

బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. గత ఎపిసోడ్ లో అంజి ఆచూకీ దొరకడంతో దీప, మోనిత అంజిని పట్టుకోవడానికి బయలుదేరుతారు.ఈ క్రమంలోనే దీప తన పిన్ని దగ్గరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి అంజి కోసం బయలుదేరుతుంది. ఈ క్రమంలోని ఈరోజు1108 వ ఎపిసోడ్ లోకి ఎంటరైన కార్తీకదీపం సీరియల్ లోని హైలెట్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

అంజి సూర్యాపేటలో ఉన్నాడని తెలుసుకున్న దీప,మోనిత ఎలాగైనా అంజిని పట్టుకుంటే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని బయలుదేరుతారు. అంజి ఆచూకీ దొరకడంతో మోనిత ఎంతో సంతోషంతో డ్రైవ్ చేసుకుంటూ అంజి కోసం బయల్దేరుతుంది. ఈ క్రమంలోనే తన మనసులో చేజారిపోయాయి అనుకున్న అంజిగాడు దొరికాడు. వాడిని వదిలి పెట్టకూడదు మాట విన్నాడో సరే.. లేదంటే దీనికి పని చెప్పాల్సి ఉంటుంది అంటూ తుపాకీ చేతిలో పట్టుకుంటుంది.

సూర్యాపేటకు వెళ్తున్న దీపతో క్యాబ్ డ్రైవర్ ఏంటక్కా ఈ సమయంలో ఒంటరిగా వెళుతున్నావు అని అడిగాడు. అందుకు దీప నువ్వు ఉన్నావు కదా తమ్ముడు తోడుగా అంటూ సమాధానం చెబుతుంది. అంత అర్జెంట్ పని ఏముంది అని అడగగా.. నువ్వు వారణాసి మాదిరిగానే నాకు ఇంకో తమ్ముడు ఉన్నాడు అతనిని కలవాలి.నామాదిరి వారణాసి లాగా అంటే నువ్వు ఫోన్ చేయగానే నీ దగ్గరికి వస్తారు కదా అక్క.. కానీ ఏదో ముఖ్యమైన పని ఉండే ఉంటుంది అనుకుని ఇక ఏ వివరాలు అడగను అంటూ కారు నడుపుతాడు.

దీప ఉదయాన్నే వస్తానని చెప్పిన కార్తీక్ కలవర పడుతుంటాడు. అసలు దీప ఏం చేస్తుంది అని ఆలోచిస్తుండగా అప్పుడే భాగ్యం నుంచి ఫోన్ వస్తుంది. బాబు కాస్త దీపకి ఫోన్ ఇవ్వు అని అడగగా కార్తీక్ షాక్ అవుతాడు. నిజం చెప్పితే ఉదయం లేవగానే ఫోన్ చేయిస్తా అని చెబుతాడు. తన పిన్ని ఇంటికి వెళ్తాను అని చెప్పిన దీప అక్కడికి వెళ్లకుండా ఏం చేస్తుంది..మోనిత ఇంటికి వెళ్లిందా అక్కడ ఏం గొడవ జరుగుతుందో అంటూ కంగారుపడుతూ..మోనిత ఇంటికి వెళతాడు.అక్కడికి వెళ్ళగానే ప్రియమణి అమ్మ గారు లేరు రేపు ఉదయం వస్తానని చెప్పి వెళ్లారు అనడంతో కార్తీక్ లో కంగారు పుడుతుంది.

ఇక కారు నడుపుకుంటూ మోనిత ఒరేయ్ అంజి నిన్ను ట్రంపు కార్డుల వాడుకోవాలని చూస్తుంది ఏసిపి రోషిని. నా మాట వింటే సరే లేదంటే నీ ప్రాణాలు తీస్తా అంటూ మనసులో అనుకోని బయలుదేరుతుంది. ఎలాగైనా నిన్ను ఫామ్ హౌస్ లో కట్టిపడేసి కార్తిక్ తో నా పెళ్లి జరిగేలా చూడాలి అని మనసులో అనుకుంటూ ఉండగా కారు రిపేర్ వచ్చి ఆగిపోతుంది. కారు ఆగిపోవడంతో ఎలాగైనా ముందు వెళ్ళాలి లేకపోతే ప్రోబ్లం అవుతుందనే ఉద్దేశ్యంతో అందరిని లిఫ్ట్ అడుగుతుంది. ఇదే క్రమంలో దీప సూర్యాపేట వెళ్తున్న కారు అదే దారిలో వెళ్తునడటంతో ఆ కార్ ఆపి లిఫ్ట్ అడుగుతుంది మొనిత. అయితే ముందుగానే డ్రైవర్ కు కారులో నేను ఉన్నానని చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందో కనుక్కో.. మనం విజయవాడ వెళ్తున్నాం అని చెప్పు అని చెబుతుంది దీప.

ఈ క్రమంలోనే కారు ఆపగానే సూర్యాపేట వరకు లిఫ్ట్ ఇమ్మని అడుగుతుంది మొనిత. డ్రైవర్ సరే ఎక్కండి అని ఎక్కించుకుంటాడు. వెనుక సీట్ లో దీప దుప్పటి కప్పుకుని పడుకున్నట్టు నటిస్తుంది. వెనుక ఉన్నది ఎవరని డ్రైవర్ని అడుగుతుంది మోనిత. మా అక్క నిద్రోస్తుందని పడుకుంది అని చెబుతాడు డ్రైవర్. ఈలోపు ఒక ఫోన్ చేసి వీరేశం నేను ఇంకో నలబై నిమిషాల్లో సూర్యాపేట 8 హోటల్ దగ్గరకి వచ్చేస్తాను అని చెబుతుంది. అదంతా వెనుకనుంచి వింటున్న దీప.. వారినీ దీనికి ఇంత నెట్ వర్క్ ఉందా.. ఏసీపీ కి తెలిసిన విషయం వెంటనే దీనికి ఎలా తెలిసిపోయింది అంటూ ఆలోచిస్తుంటుంది.. ఈలోపు కార్తిక్ తన తమ్ముడుతో దీప ఎక్కడికి వెళ్లిందో.. మోనిత కూడా కనిపించడం లేదు.. ఆ రాకాశి మొనిత దీపని ఎం చేస్తుందో అని భయపడుతూ మాట్లాడుతుంటాడు. అక్కడికి ఎపిసోడ్ పూర్తవుతుంది.

మోనితాకు షాక్ ల మీద షాక్ లు.. ఏం జరిగిందంటే..?

కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడో సీరియల్ ను క్లోజ్ చేస్తారని అనుకున్న వారందరికీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే 1104 ఎపిసోడ్‌లో జరిగిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే.. మోనిత ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ప్రియమణికి మోగుతున్న ఫోన్లతో కంగారు పడిపోయింది. దీంతో మోనిత పడుకొని ఉండగా.. ఆమెను లేపింది. ఏంటి అంటూ కసురుకుంటూ ప్రియమణిని అడిగింది. అమ్మా.. మీకు ఫోన్లు వస్తున్నాయి అని అంటుండగానే మరో ఫోన్ మోగింది.

దీంతో అందులో ఒక ఫోన్ మ్యారేజ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చింది. అందులో అతడు మోనితాకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంజి అనే వ్యక్తి 25న మీ పెళ్లికి అభ్యంతరం చెప్పాడని.. అతడిని ఒప్పిస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కంగారు పడిపోయింది. తన పెళ్లిని కచ్చితంగా దీపానే అడ్డుకుంటుందని అనుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పెళ్లిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న దీపపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఎలాగైనా పెళ్లిని క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు తిప్పి కొట్టాలని భావించింది. తర్వాత వెంటనే తనతో మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం తెలపడంపై కార్తీక్‌లో ఆలోచనలు మొదలయ్యాయి.

గతంలో మోనిత గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించగా కొట్టిన విషయాలు గుర్తొచ్చాయి. అలాంటిది మోనిత పెళ్లిని ఎందుకు అడ్డుకొంటున్నాడు. నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయా అంటూ కార్తీక్ ఆలోచనల్లో పడిపోయారు. అంజిని దీప కలిసిందా అనే అనుమానం.. మోనితా మదిలో మెదిలింది. వెంటనే మరో ఫోన్ రాగానే ఆమె లిఫ్ట్ చేసింది. అటు ఫోన్ చేసింది రోషిణి. మోనితాను ఒకసారి కలవాలని ఆమె ఫోన్ లో చెప్పింది. ఎందుకు తనను కలవాలి అంటుందో అర్థం కాక.. ఇంకా కొత్త ఆలోచనలు ఆమెకు మొదలయ్యాయి.

ఈ గజిబిజి సమయంలో నే పనిమనిషి ప్రియమణిపై కోపం తెచ్చుకుంది. ఎప్పుడు కాఫీ అంటూ గొడవ ఏమిటి? నేను కాఫీ కోసమే పుట్టానా అంటూ కసురుకుంటుండగా.. అటు నుంచి దీపా నాకు ఇవ్వు నేను తాగుతా అని చెప్పింది. దీంతో మోనితా షాక్ కు గరయ్యింది. మోనితా ఇంట్లోకి దీపా ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది. ఇక వీరిద్దరి మధ్య ఎలాంటి వార్ చోటుచేసుకోనుందో చూడాలి..