కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడో సీరియల్ ను క్లోజ్ చేస్తారని అనుకున్న వారందరికీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే 1104 ఎపిసోడ్లో జరిగిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే.. మోనిత ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ప్రియమణికి మోగుతున్న ఫోన్లతో కంగారు పడిపోయింది. దీంతో మోనిత పడుకొని ఉండగా.. ఆమెను లేపింది. ఏంటి అంటూ కసురుకుంటూ ప్రియమణిని అడిగింది. అమ్మా.. మీకు ఫోన్లు వస్తున్నాయి అని అంటుండగానే మరో ఫోన్ మోగింది.
దీంతో అందులో ఒక ఫోన్ మ్యారేజ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చింది. అందులో అతడు మోనితాకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంజి అనే వ్యక్తి 25న మీ పెళ్లికి అభ్యంతరం చెప్పాడని.. అతడిని ఒప్పిస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కంగారు పడిపోయింది. తన పెళ్లిని కచ్చితంగా దీపానే అడ్డుకుంటుందని అనుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పెళ్లిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న దీపపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఎలాగైనా పెళ్లిని క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు తిప్పి కొట్టాలని భావించింది. తర్వాత వెంటనే తనతో మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం తెలపడంపై కార్తీక్లో ఆలోచనలు మొదలయ్యాయి.
గతంలో మోనిత గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించగా కొట్టిన విషయాలు గుర్తొచ్చాయి. అలాంటిది మోనిత పెళ్లిని ఎందుకు అడ్డుకొంటున్నాడు. నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయా అంటూ కార్తీక్ ఆలోచనల్లో పడిపోయారు. అంజిని దీప కలిసిందా అనే అనుమానం.. మోనితా మదిలో మెదిలింది. వెంటనే మరో ఫోన్ రాగానే ఆమె లిఫ్ట్ చేసింది. అటు ఫోన్ చేసింది రోషిణి. మోనితాను ఒకసారి కలవాలని ఆమె ఫోన్ లో చెప్పింది. ఎందుకు తనను కలవాలి అంటుందో అర్థం కాక.. ఇంకా కొత్త ఆలోచనలు ఆమెకు మొదలయ్యాయి.
ఈ గజిబిజి సమయంలో నే పనిమనిషి ప్రియమణిపై కోపం తెచ్చుకుంది. ఎప్పుడు కాఫీ అంటూ గొడవ ఏమిటి? నేను కాఫీ కోసమే పుట్టానా అంటూ కసురుకుంటుండగా.. అటు నుంచి దీపా నాకు ఇవ్వు నేను తాగుతా అని చెప్పింది. దీంతో మోనితా షాక్ కు గరయ్యింది. మోనితా ఇంట్లోకి దీపా ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది. ఇక వీరిద్దరి మధ్య ఎలాంటి వార్ చోటుచేసుకోనుందో చూడాలి..
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…