కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడో సీరియల్ ను క్లోజ్ చేస్తారని అనుకున్న వారందరికీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే 1104 ఎపిసోడ్లో జరిగిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే.. మోనిత ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ప్రియమణికి మోగుతున్న ఫోన్లతో కంగారు పడిపోయింది. దీంతో మోనిత పడుకొని ఉండగా.. ఆమెను లేపింది. ఏంటి అంటూ కసురుకుంటూ ప్రియమణిని అడిగింది. అమ్మా.. మీకు ఫోన్లు వస్తున్నాయి అని అంటుండగానే మరో ఫోన్ మోగింది.
దీంతో అందులో ఒక ఫోన్ మ్యారేజ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చింది. అందులో అతడు మోనితాకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంజి అనే వ్యక్తి 25న మీ పెళ్లికి అభ్యంతరం చెప్పాడని.. అతడిని ఒప్పిస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కంగారు పడిపోయింది. తన పెళ్లిని కచ్చితంగా దీపానే అడ్డుకుంటుందని అనుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పెళ్లిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న దీపపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఎలాగైనా పెళ్లిని క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు తిప్పి కొట్టాలని భావించింది. తర్వాత వెంటనే తనతో మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం తెలపడంపై కార్తీక్లో ఆలోచనలు మొదలయ్యాయి.
గతంలో మోనిత గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించగా కొట్టిన విషయాలు గుర్తొచ్చాయి. అలాంటిది మోనిత పెళ్లిని ఎందుకు అడ్డుకొంటున్నాడు. నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయా అంటూ కార్తీక్ ఆలోచనల్లో పడిపోయారు. అంజిని దీప కలిసిందా అనే అనుమానం.. మోనితా మదిలో మెదిలింది. వెంటనే మరో ఫోన్ రాగానే ఆమె లిఫ్ట్ చేసింది. అటు ఫోన్ చేసింది రోషిణి. మోనితాను ఒకసారి కలవాలని ఆమె ఫోన్ లో చెప్పింది. ఎందుకు తనను కలవాలి అంటుందో అర్థం కాక.. ఇంకా కొత్త ఆలోచనలు ఆమెకు మొదలయ్యాయి.
ఈ గజిబిజి సమయంలో నే పనిమనిషి ప్రియమణిపై కోపం తెచ్చుకుంది. ఎప్పుడు కాఫీ అంటూ గొడవ ఏమిటి? నేను కాఫీ కోసమే పుట్టానా అంటూ కసురుకుంటుండగా.. అటు నుంచి దీపా నాకు ఇవ్వు నేను తాగుతా అని చెప్పింది. దీంతో మోనితా షాక్ కు గరయ్యింది. మోనితా ఇంట్లోకి దీపా ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది. ఇక వీరిద్దరి మధ్య ఎలాంటి వార్ చోటుచేసుకోనుందో చూడాలి..
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…