చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆనాటి టాప్ స్టార్స్ అందరితో నటించడం జరిగింది. అలా నటిస్తూనే కొన్ని సినిమాల్లో ప్రతి కథానాయకుని పాత్రలు వేశారు. ఆ క్రమంలోనే ఆయనలోని తీక్షణమైన కళ్ళు.. సినిమాలోని సంగీతానికి ఆగని ఒళ్ళు.. ఆనాటి దర్శక, నిర్మాతల దృష్టిలో పడడానికి అది చాలా వరకు దోహదపడింది. సమకాలీన, ఆయన ముందు తరం హీరోలందరూ చిరంజీవి డాన్స్ కు ఫిదా అయినవారే.
ఓ సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిరంజీవి ప్రస్తావన రాగానే అసలు డాన్స్ సినిమాలలో మొదలుపెట్టింది నేనని అలాంటి డాన్స్ ఇప్పుడు చిరంజీవి వేస్తూ ఉంటే ఆయన పక్కన ఉన్న హీరోయిన్ ని కాకుండా చిరంజీవినే చూడాలనిపిస్తుంది. నిజంగా ఆయన శరీరంలో బోన్స్ ఉన్నాయా లేదా స్ప్రింగులు ఉన్నాయా అనే సందేహం కలుగుతూ ఉంటుందని వివరించారు.
మామూలు నటుడి స్థానం నుంచి సుప్రీమ్, మెగాస్టార్ వంటి బిరుదులను సొంతం చేసుకోవడానికి ఆయన వేసిన స్టెప్పులే ప్రధాన కారణం. ఆయనకు కమర్షియల్ హిట్ ఇచ్చిన ఖైదీ సినిమాలో “రగులుతుంది మొగలి పొద వగలమారి కన్నె ఎద” అనే పాట మాధవితో చేసిన డాన్స్ ఆనాటి కుర్రకారును కుర్చీలకు అతుక్కు పోయేలా చేసింది. ఇక అక్కడి నుంచి ఆయన స్టెప్పుల పరంపర నభూతోన భవిష్యత్ అనే విధంగా కొనసాగిందనడంలో సందేహం లేదు. 1988 గీతా ఆర్ట్స్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “అత్తకి యముడు అమ్మాయికి మొగుడు” చిత్రంలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గా అత్త యముడు అమ్మాయికి మొగుడు నిలిచిపోయింది. ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే బ్రేక్ డాన్స్ లు ఈ సినిమాతోనే ప్రారంభమయ్యాయి.
చిరంజీవి సోలోగా పాడే పాట “మెరుపులా లా.లా ఆడతా.. పిడుగులా.లా.లా రేగుతా..” అనే పాటకు చిరంజీవి వేసిన స్టెప్పులు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ తర్వాత 1990 టి. త్రివిక్రమరావు నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కొండవీటి దొంగ సినిమాలో రాధా, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో “చమక్, చమక్ చుట్టుకో.. చుట్టుకో..చాన్సు దొరికే రో హొయ్యా.!” అంటూ చిరంజీవి స్లో డాన్స్ ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను కూడా అబ్బుర పరిచేలా చేసింది. ఇలాంటి పాటలు చిరంజీవి డాన్స్ డిక్షనరీలో ఎన్నో ఎన్నెన్నో.. ఇదే సంవత్సరంలో అశ్వినీదత్ నిర్మాణము, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులోని పాటలన్నీ ఇళయరాజా స్వరపరిచడం ఒక విశేషం.
ఈ పాటలు చిరంజీవి సినీ కెరీర్ లో రికార్డు స్థాయిలో విజయవంతమయ్యాయి. అందులోని ప్రతి పాట ఆనాడు తెలుగు ప్రేక్షకుల ప్రతి నోట వినబడిందంటే సందేహించనవసరంలేదు. ఈ చిత్రం విడుదలకు “యమహో నీ యమ యమ అందం.. చెలరేగిందే ఎగా దిగా తాపం.!! ” అనే పాట మాత్రమే బ్యాలెన్స్ గా మిగిలిపోయింది. ఆ సమయంలో చిరంజీవికి తీవ్రమైన జ్వరం వచ్చింది. అయితే నిర్మాత నష్ట పోకూడదన్న ఉద్దేశంతో జ్వరంలో కూడా ఈ పాటలో చిరంజీవి డ్యాన్స్ చేయడంతో నిర్మాత అశ్వనీదత్ అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడం జరిగింది. అందుకే చిరంజీవి మెగాస్టార్ అనిపించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…