Tag Archives: mustafa raj

Priyamani: పెళ్లి సమయంలో చాలా విమర్శలు వచ్చాయి… సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందించిన ప్రియమణి!

Priyamani: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియమణి కొంతకాలం కిందట సినిమాలకు దూరమై బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమే తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో ఈమె సీఎం పాత్రలో నటించారు ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ… సోషల్ మీడియా వేదికగా తనను తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. కెరియర్ మొదట్లో తనని బాడీ షేమింగ్ చేశారని తాను కలర్ తక్కువగా ఉన్నానంటూ తన కలర్ గురించి కూడా మాట్లాడారని ఈమె తెలియజేశారు.

ఇకపోతే తాను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తన పెళ్లి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపించారని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. తాను ముస్తఫా రాజ్ తో నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తమ నిశ్చితార్థపు ఫోటోలు పై చాలా మంది తీవ్ర వ్యతిరేకత చూపించారని ఈమె తెలియజేశారు.

Priyamani:నా జీవితం నా ఇష్టం…

ఇలా మా ఎంగేజ్మెంట్ ఫోటోలపై స్పందించిన కొందరు నువ్వు ఎందుకు ఇలా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు అంటూ తనని ప్రశ్నించారని ఈమె తెలిపారు. ఇలా నా గురించి కామెంట్స్ చేసిన వారందరికీ నేను చెప్పేది ఒకటే,ఇది నా జీవితం నా జీవితాన్ని ఎవరితో పంచుకోవాలి అనేది పూర్తిగా నా నిర్ణయం అంటూ ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేశారు. ఇలా అప్పటినుంచి తాను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశానని తెలియజేశారు.

Priyamani: పండగపూట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రియమణి.. ఆ వార్తలకు చెక్ పెట్టేసిందిగా?

Priyamani:టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆగ్ర హీరోలందరి సరసన నటించిన ప్రియమణి పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఈ విధంగా ఈమె వెండితెరకు దూరమైనప్పటికీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

ఇకపోతే ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ వరస సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే గత కొద్దిరోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంట పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇలా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నప్పటికీ ప్రియమణి ఈ విషయంపై ఏమాత్రం స్పందించకపోవడంతో నిజమేనని అందరూ భావించారు. అయితే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు.ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ నా నుంచి నా కుటుంబ సభ్యుల నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Priymani: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ప్రియమణి..

ఇలా ఈ పోస్ట్ షేర్ చేస్తూనే కింద మిస్ యు ముస్తఫా రాజ్ అంటూ లవ్ సింబల్ షేర్ చేస్తూ పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ దంపతుల మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవని వీరిద్దరూ ఎలాంటి విడాకులు తీసుకోలేదని ఈ పోస్టు ద్వారా అందరికీ క్లారిటీ వచ్చింది.అయితే ప్రియమణి భర్త ప్రస్తుతం అమెరికాలో ఉండగా ఈమె సినిమా షూటింగ్ ల నిమిత్తం ఇండియాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరి గురించి అలాంటి వార్తలు షికారులు చేశాయని అర్థమవుతుంది.

Actress Priyamani: విడాకులకు సిద్ధమైన నటి ప్రియమణి.. విడాకులకు కారణం అదేనా?

Actress Priyamani: సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ అయింది. ఈ క్రమంలోని ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమించుకుని ప్రేమలో కొన్ని సంవత్సరాల పాటు విహరించి ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత వీరి వైవాహిక జీవితం కొన్ని సంవత్సరాలు కూడా గడవకు ముందే తెగ తెంపులు చేసుకుంటున్నారు.

ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా బ్రతుకుతున్నారు. మరికొందరు రెండో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక జంట కూడా విడాకులకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి ప్రియమణి తన భర్త ముస్తఫా రాజ్ కి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.

ముస్తఫా రాజ్ ఇదివరకే పెళ్లి చేసుకొని తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ప్రియమణితో ప్రేమలో పడిన ఈయన తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిపోయింది. ఇకపోతే తన భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే రెండవ పెళ్లి చేసుకున్నారని,ప్రియమణి పెళ్లి చెల్లదు అంటూ మధ్యలో పెద్ద వివాదం సృష్టించారు. అయినప్పటికీ ప్రియమణి వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.

Actress Priyamani: పిల్లల విషయంలో మనస్పర్ధలే కారణమా…

ఇకపోతే తాజాగా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ప్రియమణి ముస్తఫా రాజ్ వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోతున్న పిల్లల గురించి ప్రియమణి ఏమాత్రం ఆలోచించలేదని తను కెరియర్ లో సెటిల్ అయిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చింది.ఇక పిల్లల విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి గొడవలు జరిగాయని అందుకే వీరిద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా తన విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ ప్రియమణి మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించకపోవడం గమనార్హం.

విడాకులపై స్పందించిన ప్రియమణి.. ఆ ఫోటోతో రూమర్స్ అన్నింటికీ చెక్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎవరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.

అయితే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే ప్రియమణి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. భర్త ముస్తఫా రాజ్ మొదటి భార్య కొన్ని ఆరోపణలు చేయడంతో ప్రియమణి వైవాహిక జీవితం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.ప్రియమణి భర్త పై మొదటి భార్య కేసు నమోదు చేసింది.

ప్రియమణి భర్త ముస్తాఫా రాజ్ కు గతంలోనే ఆయేషా తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం కూడా ఉన్నారు. ముస్తఫా ఆయేషా ఇప్పటికి విడాకులు తీసుకోలేదని అని ఆరోపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి ప్రియమణి,ముస్తఫా ల మధ్య గొడవలు వచ్చాయని వీరిద్దరి విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

తాజాగా ప్రియమణి ఈ వార్తలన్నింటికి చెక్ పెడుతూ దీపావళి పండుగ సందర్భంగా తన భర్త ముస్తఫా తో కలిసి దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పంచుకుంది. దీనితో విడాకుల విషయం పై వినిపిస్తున్న రూమర్స్ కు ప్రియమణి పరోక్షంగా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.

షాకింగ్.. ప్రియమణికి సవతిపోరు.. ఆమెది అక్రమ సంబంధం అంటున్న ముస్తఫా మొదటి భార్య ..

వెండితెర నటిగా పరిచయమై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి ప్రియమణి పలు సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే నటి 2017వ సంవత్సరంలో ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ మే బుల్లి తెర పై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రియమణి,ముస్తఫా వివాహం చెల్లదంటూ ముస్తఫా మొదటి భార్య అయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ముస్తఫా, తన మొదటి భార్య అయేషా ను విడివిడిగా సంప్రదించారు. ఈ క్రమంలోనే ముస్తఫా పై తన మొదటి భార్య న్యాయపోరాటం చేస్తోందని తెలుస్తోంది. ముస్తఫా తన మొదటి భార్య అయేషా అతని పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే ముస్తఫా రెండవ పెళ్లి చట్టపరంగా చెల్లదని ఇప్పటికీ ఆయన భార్య స్థానంలో నేను ఉన్నానని ఆరోపణలు చేసింది.

ఈ విషయంపై ముస్తఫా స్పందిస్తూ.. 2010వ సంవత్సరం నుంచి ఆయేషా నుంచి దూరంగా ఉన్నట్లు తెలిపారు.అదేవిధంగా చట్టపరంగా 2013వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయి 2017వ సంవత్సరంలో ప్రియమణిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. మొదటి భార్య అయేషాకి ఇద్దరు పిల్లలు ఉండటం చేత వారి పోషణకు అవసరమయ్యే డబ్బులను పంపిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే నాపై లేనిపోని ఆరోపణలు చేసి నా దగ్గర నుంచి మరికొంత డబ్బులు కోసమే ఇలాంటి కుట్రపన్నారని ముస్తఫా తెలిపారు.

ఈ క్రమంలోనే ముస్తఫా తరపున వాదించిన న్యాయవాది పూర్ణిమ భాటియాను సంప్రదించగా, ప్రియమణి, ముస్తఫాలపై అయేషా చేస్తున్న న్యాయపోరాటం నిజమైనదేనని నిర్ధారించారు. ఈ విధంగా వీరిద్దరికీ మనస్పర్ధలు తలెత్తతున్న నేపథ్యంలో ప్రియమణి మాత్రం గత కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే.