Priyamani:టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆగ్ర హీరోలందరి సరసన నటించిన ప్రియమణి పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఈ విధంగా ఈమె వెండితెరకు దూరమైనప్పటికీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.
ఇకపోతే ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ వరస సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే గత కొద్దిరోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంట పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇలా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నప్పటికీ ప్రియమణి ఈ విషయంపై ఏమాత్రం స్పందించకపోవడంతో నిజమేనని అందరూ భావించారు. అయితే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు.ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ నా నుంచి నా కుటుంబ సభ్యుల నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇలా ఈ పోస్ట్ షేర్ చేస్తూనే కింద మిస్ యు ముస్తఫా రాజ్ అంటూ లవ్ సింబల్ షేర్ చేస్తూ పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ దంపతుల మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవని వీరిద్దరూ ఎలాంటి విడాకులు తీసుకోలేదని ఈ పోస్టు ద్వారా అందరికీ క్లారిటీ వచ్చింది.అయితే ప్రియమణి భర్త ప్రస్తుతం అమెరికాలో ఉండగా ఈమె సినిమా షూటింగ్ ల నిమిత్తం ఇండియాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరి గురించి అలాంటి వార్తలు షికారులు చేశాయని అర్థమవుతుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…